సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ నూతన సీఐగా ఇటీవల విధుల్లో చేరిన పట్టణ సి.ఐ రఘుపతిరెడ్డి ని స్థానిక స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు.ఈ సందర్బంగా సి.ఐ మాట్లాడుతూ స్వచ్చంధంగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు తమ వంతు పోలీస్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో ప్రతిభా సంస్థ నిర్వాహకులు, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వచ్చంధ వాలంటీర్ కాసుల వెంకటాచారి, గన్ మెన్ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.