తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది
– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకున్నారని అన్నారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పక్షాన నిలబడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ టీఆర్ఎస్ పార్టీదో లేక బీఆర్ఎస్ పార్టీదో కేసీఆర్ స్పష్టత ఇచ్చి వరంగల్ కు వెళ్లాలని కేకే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా స్పష్టత ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ, బావమరుదులు నాడు కుర్చీ కోసం నేడు పార్టీ కోసం కుస్తీ పడుతున్నారని, హరీష్ రావుకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతే పడుతుందని కేకే జోష్యం చెప్పారు. వరంగల్ సభలో పార్టీలో హరీష్ రావు స్థానం ఏంటో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని, కుర్చీల కొట్లాటలో హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బయటకు రావడం ఖాయమన్నారు. తెలంగాణను నయవంచన చేసిన వాళ్లే ఆ పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అది బీఆర్ఎస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో తెలియదన్నారు. సంపాదించిన అవినీతి సొమ్ముతో రజతోత్సవ సభకు ప్రజలను తరలిస్తున్నారని, సభకు వచ్చేవారు కదిలివచ్చే జనం కాదని, కదిలిస్తే వచ్చే జనం అని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు యేళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాసు, శ్రీనివాస్ రవి, మహిళా నాయకురాలు కల్లూరు చందన, వనిత తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

పలుగుల 8, 9, మరో మూడు ఇసుక రీచుల్లో రోజుకు వందకు పై లారీల ఇసుక రవాణా.

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

దోపిడీ లక్ష్యంగా అక్రమ వసూళ్లు, అదునపు ఇసుకను లోడ్ చేస్తూ దర్జాగా దర్జాగా లక్షల రూపాయలు దూచుకుంటున్న ఇసుక క్వారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా, దోపిడీకి మరింత సహకరిస్తూ దోపిడి ముఠాలకు దొరలుగా మార్చింది టీజీఎండిసి, దీనికి సాక్షాలు ఒకటి కాదు వందల సంఖ్యలో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది కానీ టీజీఎండిసి ఇలాంటి చర్యలు తీసుకోదు.

robbery gangs.

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కుదురుపల్లి కాలేశ్వరం పరిధిలో పలువుల 8 పలుగుల 9, ఉసుక్ పల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశం లాగా, దర్జాగా దూచుకోవడం జరుగుతుంది. ఇక పుసుకుపల్లి ఒకటి ప్రస్తుతం ఈ క్వారీ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా చేసి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకుంది, ఇక్కడ సిబ్బంది దర్జాగా అదనపు ఇసుక రవాణా చేయడం నిబంధనకు విరుద్ధం కాదని చెప్పడం జరిగినప్పటికీ టీజీఎండిసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నదంతా సమాప్తం చేసుకొని వెళ్లిపోయింది.

robbery gangs.

ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు ఇసుక క్వారీల అక్రమాలు మాత్రం ఆగడం లేదు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేపడుతున్న కొద్ది ఈ క్వారీలకు లారీల సంఖ్య రోజుకు 100కు పైచిలువు లారీడు ఇసుక రవాణాకు రావడం ఆశ్చర్యం.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

ఇక ప్రస్తుతం మహదేవ్పూర్ మండల పరిధిలో దర్జాగా టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుమస్తాల కంటే ఎక్కువగా, వసూళ్ల పర్వం చేపట్టడం, సీరియల్ లోడింగ్ కాంటా, వే బిల్, వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయడం శరమాములుగానే కొనసాగుతుంది.

robbery gangs.

సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఒక బలమైన రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఇక ఇసుక రిచుల్లో సిబ్బంది అక్రమాలపై టీజీఎండిసీ నిశ్శబ్దం, పెద్ద మొత్తంలో ప్రతి క్వారీలో సుమారు రోజుకు లక్ష 30 వేల నుండి 2 లక్షల పదివేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేపడుతున్న టీజీఎండిసి నిశ్శబ్దం వెనుక ఒక బలమైన కారణం ఉందని అందుకే అధికారులు అక్రమ వసూళ్లపై పట్టించుకోవడంలేదని, ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి, అంతేకాకుండా మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు, స్వయంగా టీజీఎండిసి సిబ్బంది కలెక్షన్ చేయడం, వెనుక దాగి ఉన్న ఒక రహస్యం అది రహస్యం కాదు జగమెరిగిన సత్యం అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు చర్యలకు ససేమిరా అనడానికి ప్రధాన కారణం అని చెప్పడంలో సందేహం లేదు.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

టీజీఎండిసి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, నిఘానేత్రం, రెవెన్యూ ,పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను ఏర్పాటుచేసి అక్రమ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, చెప్పడం జరిగింది. కానీ అది కేవలం చెప్పుడు మాటల కొరకే, అదనపు బకెట్ తో ఇసుక క్వారీలు చిన్న బకెట్ కు 1500, పెద్ద బకెట్ కు 2000 నుండి 2500 వసూలు చేసేవారు, కానీ అప్పట్లో ఇసుక దోపిడీ జరుగుతుందని బహిర్గతం కావడంతో, కాంట్రాక్టర్లకు కాస్త ఇబ్బంది కలిగింది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా టీజీఎండిసి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి దానికి అమలు చేస్తుంది, అదేమిటంటే అక్రమ వసూళ్లు చేస్తే సరిపోతుంది అదునపు బకెట్ కు ఎంత అయితే కాంట్రాక్టర్లకు వస్తుండేది దానికి సరి సమానం అదునపు చార్జీలు, సీరియల్ కాంట లోడింగ్, కలిపితే 1600 నుండి 2200 వరకు వస్తుందని చెప్పి మరి తన సిబ్బందిచే కాంట్రాక్టర్లకు కలెక్షన్ చేసి అప్పజెప్పేలా చేసింది. దీనికి వందల సాక్ష్యాలు గత 20 రోజుల నుండి తెరపైకి తీసుకురావడం జరిగింది.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

టీజీఎండిసి అక్రమ వసూళ్లపై వ్యవహారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి, గడిచిన 20 రోజుల నుండి అనేక సాక్షాలు తెరపైకి తీసుకు వచ్చినప్పటికీ, మహాదేవపూర్ కాళేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోకుండా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు పలువుల 8, 9, పుసుపల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ఈ ఇసుక క్వారీలో ఒక్క రోజు కూడా ఇసుక రవాణా కొరకు లారీలు తగ్గుముఖం పట్టిన దాఖలా లేదు, గడిచిన 22 రోజుల్లో పలుగుల 8 ,9, 100 నుండి 150 లారీల వరకు ప్రతిరోజు ఈ రెండు క్వారీల్లో పెద్ద మొత్తంగా ఇసుక అరవణ చేయడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, పుసుపల్లి పలువుల 6, పుసుపల్లి ఒకటి, 70 నుండి 110 లారీల వరకు ఈ మూడు ఇసుక క్వారీలు ప్రతిరోజు లారీల్లో ఇసుక రవాణా చేయడం జరిగింది. పూసుకుపల్లి ఒకటి, క్వారీలో తమ క్వాంటిటీ పూర్తికాకముందు ఒకటవ తేదీ నుండి 21వ తేదీ వరకు యావరేజ్ రోజుకు డెబ్బై నుండి మొదలుకొని 110 లారీల్లో ఇసుక రవాణా చేసింది. అక్రమ వసూలు చేస్తూ పాసింగ్ పై అదనపు ఇసుక దర్జాగా తరలిస్తున్నప్పటికీ టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఈ క్వారీల్లో పాసింగ్ పై అదనపు ఇసుక వస్తుందని, లారీ యజమానులు ఈ క్వారీలో మరింత రెట్టింపు ఉత్సాహంతో తమ లారీలను బుక్ చేయడం జరుగుతుంది.

 

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

ప్రస్తుతం మండలంలోని కాలేశ్వరం మహాదేపూర్ పరిధిలో నిర్వహించబడుతున్న నాలుగు ఇసుక రీచ్ లో, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, అక్రమంగా రవాణా చేస్తూ, లక్షల రూపాయలను దూచుకుంటున్న క్వారీలపై టి జి ఎం డి సి, చర్యలు తీసుకోకపోవడం. కాంట్రాక్టర్లకు అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న బలమైన నమ్మకం, మరోవైపు టి జి ఎం డి సి సిబ్బంది అధికారులు తమకు ఏమీ చెప్పరు, ఎందుకంటే మా రూటు కాస్త సపరేటు, అన్న విషయం వారికి తెలియడంతో, వారి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న క్రమంలో, ఈ నాలుగు ఇసుక రీచ్ లో అక్రమ వసూలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి, అమాయక లారీ డ్రైవర్ల నుండి లోడింగ్ ,పాసింగ్, కాంట, వే బిల్, మరోవైపు పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 తమకు అడిగే నాధుడే లేడని, మరింత రెట్టింపు ఉత్సాహంతో దర్జాగా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా టీజీఎండిసి, ఈ ఐదు క్వారీలపై చర్యలు తీసుకొని, క్వారీల కమిషన్ నిలిపివేసి, ఈ క్వారీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగిస్తారా, లేక అక్రమాలకు ప్రోత్సహిస్తారా అనేది వేచి చూడాలి.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన పనులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.

ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.

సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఎంపీ వంశీకృష్ణ చొరవతో రీ సర్వే జరగడం ద్వారా రెండు దశాబ్దాల కల నెరవేరబోతుందనీ ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతుంది.

అంతర్గాం మండల కేంద్రంలోని టెక్ట్స్ టైల్స్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు సందర్శించి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని రీ సర్వే నిర్వహించారు.

సమీపంలోని రైల్వే ట్రాక్,రాజీవ్ రహదారి కనెక్టివిటీ,ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.

అక్కడి నుండి బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ భూములు పరిశీలించారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం,బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకు వెళ్తామన్నారు.

అతి త్వరలో ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,అంతర్గాం తాసిల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…
– పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది
– 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే
– అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు
– ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి
– ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే
– అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

40ఏండ్లు నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఆనాడు స్వర్గీయ పీవీ నర్సింహరావు మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారని అన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తండ్రి కొడుకులు ఒక్క వంతెనను తీసుకురాలేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా రెండు బ్రిడ్జిలుమంజూరు చేయించామని, ఒక్కటి ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా మరొకటి ఓడేడ్‌ వద్ద నిర్మాణంలో ఉందన్నారు. తాను అనేక మార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలేదంటే పేరుకోసం తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ కోసం రూ.300కోట్లతో అవసరం లేనిచోట బ్రిడ్జిని తీసుకువచ్చారని అన్నారు. ఆ రూ.300కోట్ల నిధులతో మంథని మండలం ఆరెంద మానేరు లేకపోతే అడవిసోమన్‌పల్లి వద్ద మరో బ్రిడ్జి నిర్మిస్తే అద్బుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయి 16నెలలు గడుస్తున్న సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండటం విడ్డూరమని, కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద పదవిలో ఉండి ఏ ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌, జర్మనీ తరహాలో అభివృధ్ది చేస్తామని, ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు చెబుతున్నారని, మార్పు, అభివృధ్ది ఏమో కానీ ఈ బ్రిడ్జి మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదన్నారు. గత 25రోజుల క్రితం మరమ్మత్తు పనులు ప్రారంభించి మధ్యలోనే అపివేయడంతో వాహనదారులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఈ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, కనీసం ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోరా అని ఆయన అన్నారు. మంత్రి పదవి వస్తే ఎంతో అబివృద్ది జరుగుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయనుకుంటే చీకట్లోకే నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సోమన్‌పల్లి బ్రిడ్జికి రిపేరు చేయకపోగా ఓడేడు బ్రిడ్జి వద్దకు వెళ్లి పనుల్లో నాణ్యతపై విచారణ చేయిస్తామని, బాధ్యులతపై చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మంత్రి 16 నెలలు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మరమ్మత్తులు పూర్తి చేయకపోగా ఓడేడుబ్రిడ్జి పనులు మొదలు పెట్టకుండా అవసరం లేనిచోట రూ.300కోట్ల నిధులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో మానేరు, గోదావరి, ఆలయాలు, అడవులు, భూములు ఉన్న ఈ నియోజకవర్గ అభివృధ్దిపై ఇప్పటి వరకు ప్రణాళిక చెప్పలేదని, ఐదేండ్లలో అభివృద్ది గురించి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడ ఏం అవసరం ఉంటుందనే విషయంపై మంత్రికి అవగాహణ లేదని అర్థం అవుతోందని, కేవలం ప్రజలను గొర్రెల్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకోవచ్చనే ఆలోచన ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి మరమ్మత్తు పనులను పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రం చిట్యాల రోడ్ లో కల్వ సత్యనారాయణ శెట్టి జ్ఞాపకార్థం శనివారం నాడు శ్ చేయుత అనాధాశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశామని ఆర్యవైశ్య యూవజన సంగం ప్రచారకార్యదర్శి కల్వ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . అన్నదానం సేవలో గిరీష్ ఆర్యవైశ్య అధ్యక్షులు బచ్చు వెంకటేష్ దివంగత కల్వ సత్యనారాయణ సతీమణి శ్రీమతి కల్వ అరుణ సౌమ్య. పాల్గొన్నారు ఆలుగడ్డ శంకరయ్య కల్వ భూపేష్ మిత్రులు బంధువులు దివంగత కిరాణం వ్యాపారి కల్వ సత్యనారాయణ శెట్టికి శ్రద్ధాంజలి ఘటించారు

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.!

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండా లో జరిగిన వివాహ విందు లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,జనరల్ సెక్రటరీ గోపాల్,మిథున్ రాజ్ ,అశోక్ రెడ్డి,ప్రవీణ్ మెస్సీ, రతన్ సింగ్, కీరు,బుక్కు,చందర్ పవార్ తదితరులు.

రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన నాయకులు

ముచ్చటగా మూడు జేఏసీలు ఏర్పాటు చేసి ముందుకు పోనీయని నాయకులు

మూడు ముక్కలాట లెక్క చేసిన రెవెన్యూ డివిజన్ అంశం

చేర్యాల నేటిధాత్రి

 

 

 

చేర్యాల కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయినను గత పాలకులు పట్టించుకోలేదు ఇగో తీసుకొని వస్తాము అగో తీసుకొని వస్తాము అని మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వాలు మారాయి అయినను రెవెన్యూ డివిజన్ అంశం ప్రభుత్వం పట్టించుకున్నట్టే కనబడుతూనే గత ప్రభుత్వం మాదిరి మభ్యపెడుతున్నారు చేర్యాల ప్రాంత ఇక్కడి నాయకులు కు ఒంటెద్దు పోకడలు రెవెన్యూ డివిజన్ అంశం వచ్చేసరికి మూడు జేఏసీలు 60 మంది నాయకులు అన్నట్టు సమస్యపై పోరాడకుండా జేఏసీలుగా ఏర్పడి కీచులు ఆడుకుంటున్నారు సమస్య తీవ్రతను పాలకులకు దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారు ఇక్కడి ప్రాంత ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారన్న సంగతి మరిచి వ్యవహరిస్తున్నారు మీ వ్యక్తిగత తగాదాలు రెవెన్యూ డివిజన్ అంశానికి ముడిపెడుతూ మూడు జేఏసీలు ఏర్పాటు చేశారు వారేమో వారి నిత్య కార్యక్రమాలు వ్యాపారాలలో మునిగితేలుతూ విలాసాలు చేస్తూ పక్కన పెట్టిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఇబ్బందులు నాయకులకు పట్టనట్టు వ్యవహరిస్తూన్నారని ఇక్కడి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మీ నేటిధాత్రి జర్నలిస్ట్ కాసుల కుమార్

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం..

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం
ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఐనవోలు మండలంలోని బిఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు.ఈ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వరంగల్ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అభివర్ణించాడు.రామాయణంలో రాముని కోసం రామదండు లంకకు ఏవిధంగా బయలుదేరిందొ అదేవిధంగా మన అధినేత కెసిఆర్ కోసం మన గులాబీదండు అలాగే బయలుదేరాలని మోహన్ పిలుపునిచ్చారు.ఆదివారం జరగబోయే సభలో మన అధినేత కెసిఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందనారు.
420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఈసభతో వెన్నులో వణుకు పుట్టా లనని అన్నారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమిలేదని
తెలంగాణ కోసం పుట్టిన మన పార్టీతోనే తెలంగాణకు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
మన రాష్ట్రం- మన పార్టీ అనే నినాదంతో ముందుకు సాగాలని మోహన్ పిలుపునిచ్చారు.

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం.!

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ అయినవోలు మండల పార్టీ పిలుపు
నేటి ధాత్రి అయినవోలు హనుమకొండ:-

బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అయినవోలు మండల కన్వీనర్ తక్కలపల్లి చందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం నరకావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు రజతోత్సవ సభకు తండోపతండాలుగా రావడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరై మన సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు జడ్పి కో.ఆప్షన్ నెంబర్ ఉస్మాన్ అలీ మాజీ సర్పంచులు పల్లకొండ సురేష్ కావటి స్వామి బరిగల సదానందం కంజర్ల రమేష్ మండల నాయకులు మర్పట్ల దేవదాస్ తీగల లక్ష్మణ్ గౌడ్, పఠాపురం ఎల్ల గౌడ్ దుపెళ్లి కొమురయ్య గడ్డం రఘు వంశీ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమారస్వామి ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు

వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి

వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మూడవ కేంద్రంలో అన్యువల్ డే ప్రోగ్రాం అరుణ భాగ్యమ్మ టీచర్స్ఏర్పాటు చేయడం జరిగింది జయప్రద సూపర్వైజర్ హాజరై జూన్24 నుండి ఏప్రిల్ 25 వరకు 11 నెలలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకున్న ప్రీస్కూల్ కార్యక్రమాలన్నింటినీ తల్లులకు చేయించి చూపించడం జరిగింది ఆటలు పాటలు కథలు ఇంగ్లీష్ తెలుగు బోధనా అక్షరాలు అంకెలు వయసుల వారీగా పిల్లల బరువు ఎత్తులు ఏ స్థాయిలో ఉన్నవని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చేసి చూపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్లువద్దు అంగన్వాడీ ముద్దు అనే నినాదంతో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించినట్లయితే పిల్లల శారీరక మానసిక కండరాల అభివృద్ధి ఆలోచన శక్తి మేధాశక్తి అభివృద్ధి చెంది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతూ ఆరు సంవత్సరాలురాగానే ఏ స్కూళ్లకు పంపించిన పిల్లలందరు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ప్రైవేట్ స్కూల్ కి పంపడం వల్ల చిన్న వయసులో ఆడి పాడి సంతోషంగా గడపాల్సిన వయసులో ప్రైవేట్ స్కూల్ బందికానలో బంధించకండి ప్రస్తుతం శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మినిస్టర్ జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరుచుట కొరకు పిల్లలు సంతోషంగా ఉత్సాహంగా ఉండుట కొరకు భవనాలను రిపేర్ చేయించడం రకరకాల పెయింటింగ్ వేయించడం యూనిఫామ్ ఇవ్వడం పిల్లలు కూర్చోవడానికి మ్యాట్స్ ఎన్నో రకాల ఆట వస్తువులను కూడా పంపిచ్చుచున్నారు అలాగే పిల్లలకు ముఖ్యంగా రుచికరమైన భోజనాన్ని వేడిగా అందించడం జరుగుతున్నది అందరూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో అరుణ భాగ్యమ్మ జ్యోతి భాగ్యలక్ష్మి సంధ్యారాణి సుజాత మహిళలు హాజరైనారు తల్లులందరికి పిల్లల గ్రోత్ కార్డ్స్ అభివృద్ధి పరిశీలన పత్రాలు అందివ్వడం జరిగింది.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని దారులు వరంగల్ వైపే…

అన్ని దారులు వరంగల్ వైపే

మాజీ మున్సిపల్ కో ఆప్షన్ ఫాతిమా హమీద్

పరకాల నేటిధాత్రి

 

 

రాతెలంగాణ ష్ట్ర ప్రజల కోసంభారత రాష్ట్ర సమితి 25 వసంతాల రజతోత్సవ సభ 27 ఏప్రిల్ నాడు వరంగల్ లోని ఎల్కతుర్తి లో ఆవిర్భవించి అంగరంగ వైభవంగా జరగనుంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగ జనం ఈ సభకు హాజరుకానున్నారు. ఉద్యమపందాతో అధికారంలోకి వచ్చి దశాబ్దం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంచిందని కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రయోజనార్థం పుట్టిన బీఆరెస్ పార్టీ రేపు 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది.ఈ సందర్భంగా ఉద్యమ సింహం కేసీఆర్ గారు ప్రజల సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడుతారో ,ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో అని 4 కోట్ల రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.రేపు రాష్ట్రం మొత్తం టీవీలు మరియు మొబైల్ ఫోన్ల ద్వారా కేసీఆర్ సభను వీక్షించే అవకాశముంది.భను ఇలాంటి మహోతరమైన సబిఅరెస్ నాయకులు,కార్యకర్తలు, బిఅరెస్ సానుభూతి పరులు,ప్రజలు అత్యధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ కోరారు.

రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ.!

రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ..

.. 40 ఫీట్ల రోడ్డు ఒప్పుకోమంటున్న బాధితులు..

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

రామయంపేట మెదక్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు మంజూరైన రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో వేయడం మానుకోవాలని బాధితులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యాపారులు, ఇండ్లను కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు. 40 ఫీట్ల రోడ్డు కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని వెడల్పు చేయాలని అన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని కానీ విచ్చలవిడిగా రోడ్డు వెడల్పు చేస్తే చాలామందిని నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

Congress party

ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మైనoపల్లి రోహిత్ రావు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం కొంతమంది తమ స్వార్థం కోసం 40 ఫీట్ల రోడ్డు చేయాలని పట్టు పట్టడం సమంజసం కాదన్నారు. కొంతమంది లేనిపోని కారణాలు చెప్పి 40 ఫీట్ల రోడ్డు కోసం పట్టు పట్టడం జరుగుతుందని ఇది ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని పట్టణానికి చెందిన వ్యాపారి ఎనిశెట్టి సంతోష్ అన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది బాదితులకు వాగ్వాదం జరిగింది.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు..

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు
మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటిదాత్ర

 

 

 

 

శనివారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.!

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు .ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version