చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన నాయకులు
ముచ్చటగా మూడు జేఏసీలు ఏర్పాటు చేసి ముందుకు పోనీయని నాయకులు
మూడు ముక్కలాట లెక్క చేసిన రెవెన్యూ డివిజన్ అంశం
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయినను గత పాలకులు పట్టించుకోలేదు ఇగో తీసుకొని వస్తాము అగో తీసుకొని వస్తాము అని మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వాలు మారాయి అయినను రెవెన్యూ డివిజన్ అంశం ప్రభుత్వం పట్టించుకున్నట్టే కనబడుతూనే గత ప్రభుత్వం మాదిరి మభ్యపెడుతున్నారు చేర్యాల ప్రాంత ఇక్కడి నాయకులు కు ఒంటెద్దు పోకడలు రెవెన్యూ డివిజన్ అంశం వచ్చేసరికి మూడు జేఏసీలు 60 మంది నాయకులు అన్నట్టు సమస్యపై పోరాడకుండా జేఏసీలుగా ఏర్పడి కీచులు ఆడుకుంటున్నారు సమస్య తీవ్రతను పాలకులకు దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారు ఇక్కడి ప్రాంత ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారన్న సంగతి మరిచి వ్యవహరిస్తున్నారు మీ వ్యక్తిగత తగాదాలు రెవెన్యూ డివిజన్ అంశానికి ముడిపెడుతూ మూడు జేఏసీలు ఏర్పాటు చేశారు వారేమో వారి నిత్య కార్యక్రమాలు వ్యాపారాలలో మునిగితేలుతూ విలాసాలు చేస్తూ పక్కన పెట్టిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఇబ్బందులు నాయకులకు పట్టనట్టు వ్యవహరిస్తూన్నారని ఇక్కడి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మీ నేటిధాత్రి జర్నలిస్ట్ కాసుల కుమార్