హిందూ ఏక్తా యాత్రను విజయవంతం .

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మే 22న తేదీన జరిగే హిందూ ఏక్తా యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్క హిందూ పార్టీలతో, కులలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరు సంఘటితమై స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ హాజరై ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, కారుపాకల అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేం కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కోర్కెలు తీర్చే కలి యుగదైవం శ్రీ మత్స్యగిరి స్వామి.

కోరిన కోర్కెలు తీర్చే కలి యుగదైవం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం

నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కాకతీయుల కళావైభ వానికి ప్రతీక ఈ దేవా లయం

రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షే త్రంగా ప్రసిద్ధి గాంచిన దేవాల యం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రం లోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల కళా వైభవా నికి ప్రత్యేకగా నిలిచిన మత్స్య గిరి స్వామి దేవాలయం.ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలను ఘనంగా నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుంది
కాబట్టి శనివారం నుండి బుధవారం వరకు కార్యక్రమం కోసం చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.ఆలయ చరిత్ర గురించి గుడి చైర్మన్ మాట్లాడుతూ శాయంపేట గ్రామపొలిమేరలోని మచ్చర్ల య్య గుట్టపై. శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 569 సంవత్సరాల క్రితం కొలువుదీరినట్లు పూర్వీ కులు పేర్కొంటున్నారు.మహావి ష్ణువు దుష్టశిక్షణకై దశావతా రాలలో భాగంగా మొదట మత్స్యవతారంగా వెలసినట్లు చెబుతున్నారు మచ్చర్లయ గుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయిం చిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మచ్చా అవతారంలో స్వామి వారు దర్శనమిస్తారు.

Lord Vishnu

ఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుం ది అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడు తున్నది కాకతీయ సామంత రాజు కొత్త గట్టు సీమ పాలకు డు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాల యం నిర్మించినట్లు తెలుస్తుంది కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపో యింది గ్రామం మధ్య లో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్నినిర్మించా రు.

Lord Vishnu

దేవాలయ గోపురం పైన మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి. కల్యాణోత్సవ కార్యక్రమం తేదీ మే 10 శనివారం ఉదయం తోలక్కం ప్రారంభం పుట్ట బం గారు సేవ మధ్యాహ్నం ధ్వజా రోహణం గరుడ ముద్దా (సంతానం లేని దంపతులు గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించగలరు) సాయంత్రం ఎదురుకోళ్లు తేదీ 11 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం తేదీ 12 సోమవారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ గుట్టమీదికి పోవడం తేదీ 13 మంగళవారం సాయంత్రం రథోత్సవం అలుకతీరుట తేదీ 14 బుధవారం ఉదయం చక్ర వరీ సాయంత్రం నాకబలి నాగవల్లి పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.

వేసవి వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

వేసవి వ్యాధులు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

వేసవి ఎండలతో అనేక రుగ్మతలు వ్యాపిస్తుండటం సహజం. డీ హైడ్రేషన్‌ నుంచి ఫుడ్‌ పాయిజనింగ్‌ వరకూ కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయి. పరిశుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. తరచుగా చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించటం మర్చిపోవద్దు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటం చాలా అవసరం. వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వివరాలు ఇవిగో …

వడదెబ్బ (సన్‌స్ట్రోక్‌) : ఎండలో ఇష్టానుసారంగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా, అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చెమట పట్టకపోవటం, కాళ్ళూ చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహకోల్పోవటం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబర్చాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం ఉత్తమం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, గ్లూకోజ్‌ డి వంటివి తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్‌ ఫౌడర్‌ లేదా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి.

Summer diseases

విషాహారం (ఫుడ్‌పాయిజనింగ్‌) : ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు వేసవిలో సాధారణం. ఇవి ఎక్కువగా హానికారక బ్యాక్టీరియా, పరాన్నజీవుల వల్ల వస్తాయి. అధిక వేడికారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే బాగా ఉడికించాలి. వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినటం ముఖ్యం. మసాలాలతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి.
కంటి ఇన్ఫెక్షన్‌ : ఈ కాలంలో కనిపించే కొన్ని సాధారణ కంటి వ్యాధుల్లో కంటి వాపు, అలెర్జీ, కంజక్టివైటిస్‌ ఉంటాయి. తగినంత విశ్రాంతి కళ్లకు ఇవ్వాలి. వాటిపై ఒత్తిడి తగ్గించాలి. మీ కళ్ళు, ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి. ఎండలో బయటకు వెళ్తే కళ్లజోడు వాడటం మంచిది. సమస్యలు వస్తే డాక్టరు సిఫారసు మేరకు ఐడ్రాప్స్‌, మందులు వాడాలి.
చర్మ సమస్యలు : సూర్యుడి అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు, స్వేద గ్రంథులు మూసుకుపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చెమట వల్ల మచ్చలు, దురద మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండా లంటే వేసవిలో సన్‌స్క్రీన్‌ లోషన్లు వంటివి కూడా ఉపయోగించొచ్చు. వాడిన దుస్తులను ఉతక్కుండా మళ్లీ వాడకూడదు. చెమట ఎక్కువగా పడుతున్నం దున స్నానం రెండుమూడు సార్లు చేయొచ్చు. శరీరానికి గాలి తగిలేలా వదులైన, చెమట పీల్చే కాటన్‌ దుస్తులు ధరించటం మేలు.
అతిసార : ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరోచనలు సాధారణం. కలుషిత ఆహారం తినటం, నీరు తాగటం, మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి. అతిసారం నుంచి దూరంగా ఉండటానికి నీటిని మరిగించిన తర్వాత మాత్రమే తాగటం అలవాటుగా చేసుకోవాలి. కూరగాయలను ముక్కలుగా చేయటానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి. ఇళ్లల్లో ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. పాడైనవి కాకుండా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం మేలు.
చికెన్‌పాక్స్‌ : చికెన్‌పాక్స్‌ (అమ్మోరు) చాలా సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపురంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లల్లో తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది సోకినప్పుడు బయటకు తిరగకుండా ఇంట్లో ఉండటమే మేలు. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. త్వరగా తగ్గే వీలుంది.
తట్టు : మీజిల్స్‌ మరో సాధారణ వేసవి వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సో వైరస్‌ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్‌ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి. మందులు వాడితే తగ్గిపోతుంది.

Summer diseases

కామెర్లు : నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది హైపటైటిస్‌ ఎ వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషిత మైన ఆహారం, నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది.
టైఫాయిడ్‌ : జ్వరం వస్తే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసు కోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. కలుషిత ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తికి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్‌ వస్తే బలహీనత, ఆకలిలేకపోవటం, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
గవదబిళ్ళలు : వేసవి వ్యాధుల్లో గవదబిళ్లలు అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్‌ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథివాపు, కండరాలనొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి.
తలనొప్పి : అధిక ఉష్ణోగ్రతలతో తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. వేడి వల్ల వచ్చే తలనొప్పి శరీరం వేడికి ప్రతి స్పందించటం వల్ల కూడా వస్తుంది.
పైన పేర్కొన్న వ్యాధులకు అధునాతనమైన మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టరు సలహా మేరకు వాటిని ఉపయోగిస్తే అవి నియంత్రణలోకి వస్తాయి.

ఈ చిట్కాలు పాటించండి ….

– తరచూ మంచినీరు, నిమ్మకాయ ద్రావణంతోపాటుగా ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి
– నారింజ, దానిమ్మ వంటి పండ్లను తినాలి
– మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లకండి
– క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
సూర్యకాంతికి గురి కావడాన్ని తగ్గించండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం వంటి కార్యక్రమాలను చేయండి.
– కళ్ల సంరక్షణ కోసం కూలింగ్‌ గ్లాసులు పెట్టుకోవాలి
– లేతరంగు, తేలికైన వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి
– బ్యాక్టీరియాతో ఉండే స్ట్రీట్‌ఫుడ్‌ తినొద్దు
– ప్యాకింగ్‌ చేసిన పండ్లు, కూరగాయలు తీసుకోవద్దు
– పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచండి.
– ఆల్కాహాల్‌, కెఫైన్‌ తీసుకోవద్దు
– కూల్‌డ్రింక్స్‌ తాగొద్దు.

– డాక్టర్‌ రమ్య ఝరాసంగం మండల వైద్యాధికారి

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్

బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈద్గా మైదానంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు.

24న జహీరాబాద్‌లోని ఈద్గా మైదానంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు వ్యతిరేకంగా నిరసన సమావేశం,

◆ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షత వహించనున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మీ క్నావిజ్ వక్ఫ్ బచావ్ ప్రచారం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యొక్క వక్ఫ్ బచావ్ దస్తూర్ బచావ్ ప్రచారం యొక్క కేంద్ర నిరసన సర్వసభ్య సమావేశం 2025 మే 24, శనివారం, అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు జహీరాబాద్ ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మాని అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో, అన్ని ఆలోచనా విధానాల బాధ్యతాయుతమైన స్నేహితులు, రాజకీయ పార్టీల బాధ్యతాయుతమైన స్నేహితులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగాలు చేస్తారు. ముస్లిం పర్సనల్ లేబర్ బోర్డు వ్యవస్థాపక మరియు కార్యనిర్వాహక సభ్యులు కూడా పాల్గొంటారు. మతం లేదా మతంతో సంబంధం లేకుండా ముస్లిం సోదరులందరూ ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో పాల్గొని తమ ఐక్యత, జాతీయ గర్వం, మత గౌరవం మరియు సజీవ దేశాన్ని ప్రదర్శించాలని అభ్యర్థించారు.మీ ఉనికికి రుజువును అందించండి మరియు ఈ వివాదాస్పద నల్ల చట్టానికి వ్యతిరేకంగా మీ సమిష్టి నిరసనను నమోదు చేయండి.

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి.!

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన ఒంటెరు భాస్కర్ కు చెందిన పాడి గేదే బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఉదయం మేత కోసం బయటకు వెళ్లిన పాడి గేదె సాయంత్రం. ఇంటికి రాకపోవడంతో ఉదయం భాస్కర్ బయటకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెంది కనిపించింది. సుమారు 70 వేల ఈరోజు చేసే గేదె మృతి చెందడంతో రైతు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

క్షతగాత్రులను పరామర్శించిన.!

క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్. మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి

 

గత రెండు రోజుల క్రితం కాళేశ్వరం కారులో వెళ్ళివస్తూ కాటారం మండల పరిధిలో లారీ ఆక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి,హనుమకొండలోని లాస్య హాస్పిటలలో చికిత్స పొందుతున్న పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొచ్చురమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్. మడికొండ శ్రీను.అనంతరం జరిగిన సంఘటన గురుంచి వివరాలు తెలుసుకుని,వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడూరి రఘుపతి రెడ్డి-అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి-కావ్య దంపతుల వివాహ వేడుకలు హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో గల ఎంఎన్ రావు గార్డెన్ లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. మూడుముళ్ల బంధంతో..ఏడడుగుల అనుబంధంతో ఏకమైన ఈ జంట నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి గోదారి, గట్టు శ్రీకాంత్ తదితరులున్నారు.

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన.!

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
అన్నదాన కార్యక్రమం
బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేశిని కోటి
సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్
మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్58వ పుట్టినరోజు సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో పొన్నం ప్రభాకర్ పేరున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

Ponnam Prabhakar’s birthday

అలాగే పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది
* జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరూ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి NSUI రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమాలలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు సుంకరి రమేష్ సాయిన్ రవి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారపల్లి బిక్షపతి ఎలగందుల స్వరూపా శ్రీహరి పిట్టల శ్వేతా రమేష్ పానుగంటి సారంగం దిడ్డి రామ్మోహన్ కు దాడి రాజన్న గొల్లి పూలమ్మ మొగిలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి శివ మరి రామ్ రెడ్డి పందాల అజయ్ ముద్దమల్ల రవి పోతుల శ్రీనివాస్ అశోక్ రాజ్కుమార్ శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజు ఎండి సజ్జు పాతకాల రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శులు రవి అజయ్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి వార్డుల అధ్యక్షులు నరికే సుమన్ బుల్లి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ పొనగంటి కుమార్ పొన్నగంటి రాజు గాంధీ యువజన నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

అదనపు వసూళ్లపై నిశ్శబ్దం వెనుక రహస్యం.

అదునపు బకెట్లు అనుమతి ఇస్తేనే క్వారీలు ప్రారంభిస్తాం.

నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.

గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.

ప్రస్తుతం కొనసాగిస్తున్న ఇసుక రీచ్ లో ఎన్ని అక్రమాలు జరిగిన డోంట్ కేర్.

లోడింగ్ చేయనున్న కాంట్రాక్టర్ పై చర్యలకు బదులు, టీజీఎండిసి తమాషాగా చూస్తుంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కు టీజీఎండిసి తూట్లు పొడుస్తుంది.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

ఇసుక అక్రమాలు ఇసుక క్వారీల నిర్వహణ విషయంలో టి జి ఎం డి సి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్లకు వారు చెప్పిందే వేదం అంటూ సై అంటున్నారు. మండలంలో ఇసుక క్వారీల నిర్వహణ, విషయంలో టి జి ఎం డి సి, అధికారులు, నూతన ఇసుక పాలసీని అమలు పరిచాల్సింది పోయి, పాలసీ యొక్క విధానాలను తూట్లు పొడుస్తున్నారు, ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లకు, ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకు సహకరిస్తూ కాంట్రాక్టర్ల సూపర్వైజర్లతో సమానంగా టీజీఎండిసి సిబ్బంది, వసూళ్లు చేసి ఇవ్వడం, శరమాములుగా కొనసాగుతుంది. మరోవైపు దర్జాగా కాంట్రాక్టర్ సిబ్బంది ప్రతి లారీ వద్ద సీరియల్ నంబర్ పాసింగ్ లోడింగ్ లాంటి పేర్లతో వేల రూపాయలను దండుకోవడం జరుగుతుంటే, అధికారులు తమకేమీ తెలువది అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, టీజీఎండిసి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, కాంట్రాక్టర్ల వెసులుబాటు అక్రమ సంపాదనకు మొగ్గు చూపుతూ వారు చెప్పింది వేదం అంటూ కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి అధికారులు, కొత్త రీచుల ప్రారంభం ఇసుక రీచుల్లో ఇసుక డంపింగ్ చేసి ఉన్నప్పటికీ లోడింగ్ కై ఆదేశాలు జారీ చేసే సత్తా లేకుండా పోయింది. దీనికి సాక్షాలు మండలంలో అనేక ఇసుక రీచుల్లో డంపింగ్ చేసి ఉన్న ఇసుక కుప్పలు సాక్ష్యం.

 

TGMDC

 

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న టీజీఎండిసి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, ఇసుక కాంట్రాక్టర్ల గుప్పిట్లో కీలుబొమ్మలా మారి, అక్రమ వసూళ్ల వ్యవహారం పై నిశ్శబ్దాన్ని పాటిస్తూ, కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, కాంట్రాక్టర్లకు వెసులుబాటు అక్రమ వసూళ్లు అదనపు బకెట్ల వ్యవహారం ప్రారంభం కై ,టి జి ఎం డి సి, పై ఒత్తిళ్లు, చీకటి ఒప్పందాలకు వేచి చూస్తూ, ప్రస్తుత అదనపు వసూళ్ల వ్యవహారంతో ఇసుక కాంట్రాక్టర్లకు, కడుపు నిందడం లేదని, అదునపు బకెట్లు 2500 నుండి 5000 వరకు రెండు బకెట్లు వేస్తేనే తమ కడుపు నిండుతుందని, కాంట్రాక్టర్ల విన్నపం మేరకు టీజీఎండిసి కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారి, కొత్త ఇసుక క్వారీల ప్రారంభం చేపట్టాల్సింది పోయి, సుమారు నాలుగు నెలల నుండి, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇసుక కాంట్రాక్టర్లు, ఇప్పటికీ కేటాయించిన గ్రామాల్లో భూముల కొనుగోళ్ల విషయం పేరుతో, కాలయాపన చేయడం, మరోవైపు కొన్ని ఇసుక రీచ్ లు ఇప్పటికే డంపింగ్ చేసి ఉన్నప్పటికీ, ఆ రీచ్ ల నుండి ఇసుక రవాణా చేయించకపోవడం, వెనుక దాగి ఉన్న రహస్యం, అదనపు బకెట్ కు అనుమతి ఇస్తేనే, ఇసుక రీచులన్నీ పెద్ద మొత్తంలో ప్రారంభించడం జరుగుతుందని, టి జి ఎం డి సి కు కాంట్రాక్టర్లు వివరించడం జరిగింది అని అందుకే కొత్త ఇసుక క్వారీల ప్రారంభం డంపింగ్ చేసిన ఇసుక రీచుల నుండి రవాణాకు ఆలస్యం చేయడం జరుగుతుంది.

 

TGMDC

 

నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.

మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలో 14 ఇసుక రీచులకు 2014 సంవత్సరంలో 14 ఇసుక రీచులకు టెండర్ వేయడం జరిగింది. 14 క్వారీలు కూడా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆగస్టు 2014 నాటికి తమ కాంట్రాక్టర్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో కేవలం రెండు ఇసుక క్వారీలు మాత్రం ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. మిగతా 12 ఇసుక రీచ్ లు వాటిలో మహాదేవపూర్ ఒకటి, రెండు, మూడు ,నాలుగు, బొమ్మ పూర్ పేరుతో నాలుగు, బ్రాహ్మణ పెళ్లి పేరుతో రెండు,ఎల్కేశ్వరం పేరుతో రెండు, బెంగులూర్, పేరుతో ఒకటి, వీటిలో సుమారు నాలుగు క్వారీలు డంపింగ్ పూర్తిచేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ, ఇసుక రవాణా చేయడానికి ససేమీరా అంటున్నారు కాంట్రాక్టర్, అలాగే మిగితా 8 ఇసుక రీచ్లు, ఇప్పటివరకు భూమి పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఇసుక క్వారీలు నిర్వహించకపోవడం, కాంట్రాక్టర్లపై టీజీఎండిసి తక్షణ చర్యలు తీసుకొని, ఇతరులకు కాంట్రాక్ట్ అప్పజెప్పి ఇసుక రవాణా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, టీజీఎండిసి కేవలం కాంట్రాక్టర్ల కొరకు శాఖ పని చేస్తుందనే విధంగా నేటి వరకు, గత సంవత్సరం, జూన్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమై జూలై నాటికి అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నప్పటికీ, నేటికి ఇసుక రవాణా కొనసాగడం జరగలేదంటే, టీజీఎండిసి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టా కాదా. కాంట్రాక్టర్లకు టీజీఎండిసి పరోక్షంగా సహకరిస్తుందని స్పష్టంగా కనబడుతుంది.

 

TGMDC

గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.

ఇక టీజీఎండిసి పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల ఇసుక క్వారీల పేర్లను టీజీఎండిసి గత నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు సుమారు 15 రోజులు,ఆరు రిచులపేర్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా టీఎస్ఎండిసిని పట్టించుకోకపోవడంతో టీజీఎండిసి ఇసుక రీచుల పేర్లను ఆన్లైన్ లో పెట్టడం నిలిపివేసింది. టీజీఎండిసి ఆన్లైన్లో పెట్టిన ఇసుక రీచుల పేర్లు ఇవే, మహాదేవపూర్ ఒక్కటి, ఎలికేశ్వరం ఒక్కటి, బొబ్బాపూర్ రెండు, బొమ్మపూర్ 3, బొమ్మపూర్ నాలుగు, మహాదేవపూర్ నాలుగు, టీజీ ఎంబీసీ అధికారుల ఆదేశాలు కాంట్రాక్టర్ల వద్ద ఎంత విలువతో ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతుంది. మహాదేవపూర్ వన్ క్వారీలో ఇసుక నాలుగు నెలల నుండి స్టోర్ ఉన్నప్పటికీ రవాణాకు టీఎస్ ఎండిసీ ఆదేశాలకు రిజెక్ట్ చేసిన కాంట్రాక్టర్, మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పలువుల ఎనిమిది ,పలుగుల తొమ్మిది, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఇసుక రిచుల్లో ఇసుక అక్రమాల వ్యవహారం అక్రమ వసూళ్ల దందా, మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ, టీజీఎండిసి అధికారులకు వాటిపై చర్యలకు ధైర్యం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇసుక రీచ్ లో స్టాక్ చేసి ఉన్న ఇసుక రవాణాకు ఆదేశాలు ఇవ్వాల్సిన టిజిఎండిసి ఇసుక కుప్పలను తమాషాగా చూస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించి సగానికి పై ఇసుక క్వాంటిటీని రవాణా చేయాల్సిన టి జి ఎం డి సి, కేవలం కాంట్రాక్టర్లకు అక్రమ సొమ్మును దోచిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధికారులవ్యవహారం, ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ విధానానికి తూట్లు పొడుస్తూ, కేవలం కాంట్రాక్టర్ల వద్ద మెప్పు పొంది అక్రమ సొమ్ము కాంట్రాక్టర్లతో పాటు తాము కూడా పోగు చేసుకుందామని ఒక చీకటి ఒప్పంద లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది. ఇలా టీజీఎండిసి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి వంద శాతం చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారంతో టీజీఎండిసి బండారం బయటపడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి కింది స్థాయి నుండి ఉన్నత అధికారి వరకు తక్షణమే ఇసుక రీచులు ఇప్పటివరకే ప్రారంభించకుండా ఉండడానికి కారణం, ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక రీచ్ లో అక్రమాల వ్యవహారంపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వివాహ కార్యక్రమములో పాల్గొన్నా ఎమ్మెల్యే చైర్మన్.

వివాహ కార్యక్రమములో పాల్గొన్నా ఎమ్మెల్యే చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

వివిధ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను. ఆశీర్వదించిన స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ,డిసిఎన్ఎస్ చైర్మన్ శివ కుమార్,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ గారు, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,
నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ ,
మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు.

కేతకిలో ఎస్పీ ప్రత్యేక పూజలు.

కేతకిలో ఎస్పీ ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి బుధవారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ.!

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండలంలో ని మోట్లపల్లి గ్రామ వాస్తవ్యులు గూడూరి రఘుపతి రెడ్డి -అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి వెడ్స్ కావ్య రెడ్డి (m.n రావు గార్డెన్ పరకాల) గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

పెద్ద కోమటిపల్లి గ్రామ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దురిశెట్టి సంపత్_ సప్న గార్ల కుమార్తె శరణ్య గారి నూతన ఫల పుష్ప అలంకరణ కార్యక్రమ0లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య *

ఆయన వెంట గ్రామ నాయకులు పాల్గొన్నారు

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలును బహిష్కరించాలని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల ఎంఆర్ఓ గారికి మరియు కోహిర్ మండల పిఎస్ ఎస్ఐ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మరియు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్న వారిని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది.
ఇందులో మండల అధ్యక్షులు వైద్యనాథ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, సీనియర్ నాయకులు నర్సింలు, సతీష్ రెడ్డి, నాగరాజు, వంశ వర్ధన్ రెడ్డి, వంశీ, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, ఈశ్వర్ యాదవ్, శ్రీనివాస్, శ్రీశైలం, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.

హనుమాన్ మందిరాలయంలో.!

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version