బాలికల గురుకుల పాఠశాలలో.!

బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు

దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం.

ప్రభంజనం ప్రభంజనం
దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం

  నేటిధాత్రి

 

 

జిల్లా స్థాయి క్విజ్ పోటీలో మా 5వ తరగతి విద్యార్థి ఊడుగుల శ్రీవాన్ టీం జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందున ఊడుగుల శ్రీవాన్ కి పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులందరి తరుపున హార్దిక శుభాకాంక్షలు.
ఇంతటి ఘనత సాధించినందున మా విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ
ఉపాధ్యాయుల బృందం యు.పి.యస్ దుంపేట

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం

పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.

ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.

 

అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .

అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

 

ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఆర్.!

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల నేటి ధాత్:

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డిడబ్ల్యు ఓ అధికారి చిన్నయ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసోమవారం రోజున గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా:రు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు.

అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు , ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీజ చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయకోమురు, దబ్బేట అనిల్ శ్రీనివాసు రాజమౌళి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు

బస్సు సౌకర్యం లేక అవస్థలు.

బస్సు సౌకర్యం లేక అవస్థలు

బయటకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందే

నేటిధాత్రి :

 

 

మహిళలు, విద్యార్థులు, ప్రజలు,వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం బయటికి పోవాలంటే ప్రజలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు కిలోమీటర్ల మేరకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత బస్సు సర్వీసులను పునరు ద్ధరించాలి.

వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు

39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం.

వీటి విలువ మొత్తం కలిపి 10,67,500/- రూపాయలు

 

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఈ దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు ఈ రోజు పోత్కపల్లి మండల పరిధిలో శానగొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్సై ఉదయం10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ మరియు అంగిడి సాయికుమార్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్,750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే….

 

Police

 

సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుద్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య తో పరిచయం ఏర్పడి, ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ ( కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె SRSP కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు, కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్ నారాయణ పేట మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు.
ఈ దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు 13 మంది సిబ్బందిని అభినందించి డీసీపీ రివార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’

భూభారతితో భూములకు భరోసా

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయని, ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవని అన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చామని, భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

 

Land issues

రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను, సామాన్యులను కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పిందని, 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా MRO, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.
భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్‌లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు, ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు, ఈ పోర్టల్‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు.

అధికారుల తీరు మార్చుకోవాలి.     

ఏజెన్సీ చట్టాలను గౌరవించండి…

అధికారుల తీరు మార్చుకోవాలి.     

భారతదేశంలో అందరు
బతుకులు మారిన ఆదివాసి బతుకులు మారడం లేదు

ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ..

గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి..

నూగూర్ వెంకటాపురం

నేటి ధాత్రి /ములుగు జిల్లా వెంకటాపురం:

 

 

ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న విలువైన శాసనాలను గౌరవించాలని. ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో జరిగిన జీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సాయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అభివృద్ధి పథకాలు మారినా, ఏజెన్సీలోని ఆదివాసీల బ్రతుకులు మారడం లేదని, ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కుతో చట్టసభలకు ఎన్నిక అవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు గిరిజనేతరులకు,కొమ్ముగాస్తూ, ఆదివాసి గూడేల అభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల మాయమాటలకు ఆదివాసీలు మోసపోతూనే ఉన్నారని అన్నారు. ఏజెన్సీలోని ప్రత్యేక చట్టాల అమలుకు, ప్రభుత్వ పథకాల పంపిణీలో, ఆదివాసీల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, 1/70, ఎల్ టి ఆర్ లాంటి చట్టాలు నీరు గారి పోతున్నాయని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వస్తుందంటే, పాలకుల, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణి వళ్ళనే అని మండిపడ్డారు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు, ఉద్యోగులు మాత్రం ఆత్మస్తుతి పరినిందలా వ్యవహరించ కుండా, ఆత్మ సాక్షిగా, ఆదివాసీల అభివృద్ధికి, చట్టాల అమలుకు కట్టబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన హక్కులకోసం, మన్యం బిడ్డల అభివృద్ధి కోసం, గోండ్వానా సంక్షేమ పరిషత్ నిరంతరం విశ్రమించకుండా పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంటి,నరేష్ పాల్గొన్నారు

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో సదస్సులు.

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో భూభారతి సదస్సులు.

జహీరాబాద్. నేటి ధాత

 

 

 

 

భూభారతి అవగాహన సదస్సులు సోమవారం మూడు మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. మొగుడంపల్లిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30, రాయికోడులో 1: 30 నుంచి 3. 30, జహీరాబాద్ లో 3: 30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు జరుగుతాయని చెప్పారు. అధికారులు, రైతులు సమయానికి హాజరుకావాలని సూచించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనీటి మాణిక్ రావు
అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శశి,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మోహీ ఉద్దీన్,తులసి దాస్,గణేష్ తదితరులు వారి నివాసానికి చేరుకుని పరామర్శించడం  జరిగింది.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్.

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్, రూ. 25వేలు స్వాధీనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం గుంత మర్పల్లి గ్రామంలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సె నరేష్ తెలిపారు. నమ్మద గిన సమాచారంతో ఆదివారం సాయంత్రం గుంత మర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,090ల నగదుతో పాటు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు.

శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలం లోని కొల్లూర్ గ్రామస్తులు, గొల్ల కుర్మ కులస్తులు మహిళలు బుధవారం శ్రీ బీరప్ప స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకము, కుంకుమార్చన, అలంకరణ, సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి బోనాల నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు శోభాయ మానంగా జరిగింది. ఉత్సవాలు తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ కుర్మా సంఘం గ్రామ పెద్దలు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దంచి కొడుతున్న ఎండలు.!

దంచి కొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

నిప్పుల కొలిమి..!

◆ దంచి కొడుతున్న ఎండలు

◆ ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

◆ జిల్లాలో 42.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

◆ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే భానుడు భగభగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు తోడుగా వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 38 ప్రాంతాల్లో 40.1 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం, కడ్పల్, నిజాంపేట్, కల్హేర్ 42.1 పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, న్యాల్ కల్, కోహిర్, ఝరాసంగం, 39 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. శనివారం 40 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఆదివారం వచ్చేసరికి 42.5 డిగ్రీలు దాటేసింది. 

 

Temperatures

 

జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు..

పాల్వట్ల, అన్నాసాగర్, పాశమైలారం, దిగ్వాల్, సిర్గాపూర్, పుల్ కాల్, గుండ్ల మాచనూర్, నారాయణఖేడ్, ఆర్సీ పురం, 41.1 పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వట్టిపల్లి, హత్నూర్, మనూర్, అందోల్, లక్ష్మీ సాగర్, పటాన్ చేరు, మునిపల్లి, కంది, సదాశివపేట్, కిష్టారెడ్డిపేట్, కంగిటి, సుల్తాన్ పూర్, గుమ్మడిదల, కొండాపూర్, రాయికోడ్, రుద్రారం, చౌటకూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, నాగలిగిద్ద, సంగారెడ్డి, ముక్తాపూర్ తదితర ప్రాంతాల్లో 40.1 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొట్టాయి. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అర్ధరాత్రి ఉక్కపోత ఎక్కువగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి..

 

Temperatures

 

పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకె ళ్లాలి. ఓఆర్ఎస్ ను విని యోగించాలి. 12గం టల నుంచి 3గంటల వరకూ బయటకు వెళ్లాడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణులు, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూ దదు. చాయ్, కాఫీ, ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవపదార్థాల ను తీసుకోవద్దు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అత్యవసరమైతే డాక్టర్లు సంపాదించాలి.

సరమైతే డాక్టర్లు సంపాదించాలి. -డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారి ఝరాసంగం,

తెలంగాణ పేగు బంధమే బిఆర్‌ ఎస్‌.

తెలంగాణ ఆత్మ గౌరవమే కేసీఆర్‌

తెలంగాణ జీవం వున్నంత వరకు కేసీఆర్‌ కీర్తి అజరామరంగా వెలుగుతుంది

ఇప్పటికీ రామ రాజ్యం గురించి చెప్పుకున్నట్లే వచ్చే తరాలు కేసిఆర్‌ గురించి చెప్పుకుంటాయంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అనేక ఉద్యమ విశేషాలు ఆయన మాటల్లోనే…

`తెలంగాణ దేవుడు కేసిఆర్‌ అని భవిష్యత్తు తరాలు కొలుస్తారు

`తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌.

`బిడ్డ పుట్టినప్పుడు ఎలా వుందో అలాగే వుండాలనుకోరు.

`టీఆర్‌ఎస్‌ నుంచి బిఆర్‌ఎస్‌గా మారడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

`ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కావడం గిట్టని వారు చేస్తున్న అసత్య ప్రచారం.

`తెలంగాణ ఆత్మ, ఆవిష్కారం బీఆర్‌ఎస్‌

`ప్రజల గుండెల్లో వెయ్యేల్లు నిలిచిపోయే పార్టీ బీఆర్‌ఎస్‌

`కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణకు వ్యతిరేక పార్టీలు

`తెలంగాణ ఇస్తామని మాటిచ్చి పదేండ్లు దాట వేసిన పార్టీ కాంగ్రెస్‌

`సమైక్య వాదుల కుట్రలు నమ్మి ప్రకటించిన తెలంగాణ వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్‌

`కేసీఆర్‌ ఆమరణ దీక్షకు భయపడి కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది

`తప్పని పరిస్థితులలో బీజేపీ సమ్మతిచ్చింది

`ఇప్పటికీ తెలంగాణపై బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకున్నది

`ఆనాడు తెలంగాణ ఎందుకని అద్వానీ అన్నాడు

`తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ పలుసార్లు అన్నారు

`తెలంగాణ ఆత్మగౌరవం రాష్ట్ర బీజేపీ నాయకులలో లేదు

`తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతున్నారు

`తెలంగాణ కోసం కొట్లాడితే ఆ విలువ బీజేపీ నాయకులకు తెలిసేది

`తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, కిషన్‌ రెడ్డి అమెరికా వెళ్లిపోయాడు

`తెలంగాణ తల్లి బిడ్డలే బీఆర్‌ఎస్‌ నాయకులు

`తెలంగాణ తల్లికి ద్రోహం చేసినవే ఆ రెండు పార్టీలు

`అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే ఎండాకాలంలో గజగజ వణుకుతున్నారు

`రెండు పార్టీలకు తెలంగాణ మనుగడ వుండదని భయపడుతున్నారు

అప్పటికీ, ఇప్పటికీ,ఎప్పటికీ తెలంగాణ పేగుబంధం బిఆర్‌ఎస్‌కు మాత్రమే వుంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణ గురించి, బిఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని పార్టీలు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం, అదికారంకోసం తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ అన్నదే తప్ప, ఆ పార్టీకి చిత్తశుద్ది ఆనాడు లేదు. ఇప్పుడూ లేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ మాయ మాటలు చెప్పి, తెలంగాణ ఏర్పాటుకు సహకరించని పార్టీ బిజేపి. బిజేపి ఎన్టీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన పార్టీ బిజేపి. ఆ రెండు పార్టీలలో తెలంగాణ ఆత్మ ఇసుమంతైనా కనిపించదు. నిజంగా తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు వుంటే సమైక్యవాదుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలికేదే కాదు. తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం దొరికిందని తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకునేదే కాదు. తెలంగాణ ప్రకటించి పట్టుమని పది రోజులు కూడా కాకముందే తెలంగాణను వెనక్కి తీసుకుని కాంగ్రెస్‌ ఎప్పుడో తెలంగాణ ద్రోహం చేసింది. కేవలం అధికారం కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా లెక్కచేయని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పటికీ మనస్పూర్తిగా జై తెలంగాణ అనరు. అనడానికి కూడా మనసురాదు. ఇప్పుడు పాలను సాగిస్తున్న ముఖ్యులెవరైనా సరే ఏ సభలోనైనా సరే జై తెలంగాణ అనడం జరుగుతుందా? కనీసం ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం కూడా వారిలో లేదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్‌ నాయకులు జై తెలంగాణ అంటే కూడా ఎక్కడ ఆ క్రెడిట్‌ కేసిఆర్‌కు వెళ్తుందో అనే భయమే ఆవహించి వుంది. అది చాలు తెలంగాణ ఆత్మలో కేసిఆర్‌ మాత్రమే వున్నాడని చెప్పడానికి అంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్‌ , నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్‌ గొప్పదనం, బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్ధానంపై చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవమే కేసిఆర్‌. తెలంగాణ అనే జీవం వున్నంత వరకు కేసిఆర్‌ కీర్తి అజరామరంగా వెలుగుతూనే వుంటుంది. యుగాలు మారినా రామ రాజ్యం గురించి ఎలా చెప్పుకుంటున్నారో, తరాలు ఎన్ని మారినా భవిష్యత్తులో కేసిఆర్‌ ఉద్యమం, స్వర్ణయుగ పాలన గురించి నిత్యం చెప్పుకుంటారు. అంతగా తెలంగాణను తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. దేశంలో కేవలం రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన పార్టీలు రెండు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా. రెండోది బిఆర్‌ఎస్‌. అయితే జార్ఖండ్‌ కోసం కేసిఆర్‌ సాగించింతనంత ఉద్యమం సాగలేదు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కాలం జరగలేదు. తెలంగాణ ఆత్మ ఆవిష్కారం కోసం, ఆత్మగౌరవం కోసం, అస్దిత్వం కోసం, స్వయం పాలన కోసం కేసిఆర్‌ తెగించి, పద్నాలుగు సంవత్సరాల పాటు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ ఉద్యమ చరిత్రలకే పాఠాలు నేర్పింది. అంత గొప్పది కేసిఆర్‌ సాగించిన ఉద్యమం. చైనా లాంటి దేశాలలో తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలుగా చెప్పుకుంటున్నారంటే అది కేసిఆర్‌ గొప్పదనం. ఆయన త్యాగం. భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా కేసిఆర్‌ను దేవుడుగా కొలుస్తారు. ఒక్క రాజమండ్రి బ్రిడ్జిని కట్టిన కాటన్‌ దొరనే కోనసీమలో దేవుడు అని కొలుస్తున్నారంటే ఎడారి లాంటి తెలంగాణను బంగారు మాగాణ చేసి, సిరుల పంటలు పండేలా చేసిన కేసిఆర్‌ను ఇంకెంత గొప్పగా కీర్తించాలి. ఇంకెంత భక్తితో కొలువాలి. అందుకే భవిష్యత్తు కాలంలో కేసిఆర్‌ను స్మరించకుండా సాగు కూడా చేయరు. అంతగా కేసిఆర్‌ రైతు బాంధవుడయ్యారు. రైతును రాజును చేసిన కీర్తిని సంపాదించుకున్నారు. అలాంటి కేసిఆర్‌ కేవలం తెలంగాణ ఉద్యమం కోసం బిఆర్‌ఎస్‌ ఏర్పాటుచేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంత కాలం ఒక పార్టీ మనుగడ సాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజల గుండెల్లో కేసిఆర్‌ కొలువై వుండడం వల్లనే సాధ్యమౌతోంది. బిఆర్‌ఎస్‌ పార్టీ పురుడు పోసుకున్న నుంచి చిదిమేయాలని సమైక్యవాదులు అనేక సార్లు చూశారు. పార్టీని పలుసార్లు చీల్చే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. తెలంగాణ ఉద్యమం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేశారు. ఏకంగా కేసిఆర్‌ను కూడా భౌతికంగా లేకుండా చేయాలని అనేక సార్లు రెక్కిలు కూడా నిర్వహించారు. కేసిఆర్‌ పుట్టిందే తెలంగాణకోసం. కేసిఆర్‌ రాజకీయం చేసిందే తెలంగాణ కోసం. కేసిఆర్‌ ఉద్యమ జెండా ఎత్తిందే తెలంగాణ కోసం..అలాంటి గొప్ప త్యాగధనుడిపై కుట్రలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. రాజకీయంగా కనుమరుగైపోయారు. కేసిఆర్‌ మాత్రం పద్నాలుగేళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. డిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారు. అలాంటి బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవం జరుపుకుంటుంటే ఎండా కాలంలో కూడా కాంగ్రెస్‌, బిజేపిలు గజగజ వనుకుతున్నాయి. తెలంగాణ ప్రజలు అంతా రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని తెలిసి, ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ తల్లి నిజమైన బిడ్డలే బిఆర్‌ఎస్‌ నాయకులు. తెలంగాణకు తీరని ద్రోహంచేసిన పార్టీలే కాంగ్రెస్‌,బిజేపిలు. అందుకే ఆ పార్టీలను నమ్మడానికి కూడా తెలంగాణ ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కాని గత ఎన్నికల్లో ప్రజలకు లేనిపోనివి చెప్పి, చెప్పి, అబద్దాలు ఆడి, ఆడి గెలిచారు. అదికారంలోకి వచ్చిన వెంటనే నయ వంచన మొదలు పెట్టారు. అందుకే వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చెప్పివన్నీ అబద్దాలని, మోసాలని ప్రజలకు తెలిసిపోయింది. ఆరు నెలల్లోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నది. అందుకే బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. పైగా బిఆర్‌ఎస్‌ సభలంటే ఎలా వుంటాయో ప్రపంచానికి మొత్తం తెలుసు. పోరుగర్జన, సంహిగర్జన, మహాసింహగర్జన, కొంగర కలాన్‌ సభలు ఇప్పటికే చరిత్రోలో నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసిన పులి వేటకు వెళ్తే ఎలా ముందుకు దూకుతుందో అలా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ వుంటుందని ముందే కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌పార్టీలు ఊహిస్తున్నాయి. అందుకు ఆ పార్టీ నాయకులకు నిద్రలు కూడా వుండడం లేదు. ప్రజలు పుట్టల నుంచి చీమలు బైటకు వచ్చినట్లు పల్లెల నుంచి లక్షలాదిగా వరంగల్‌ రజతోత్సవ సభకు వస్తారని తెలుసు. బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చే సభ రాజకీయ సభల చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసం కొట్లాడిరది బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌,బిజేపిలు పక్తు తెలంగాణ వ్యతిరేక పార్టీలు. తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేసి, నమ్మక ద్రోహం చేద్దామనే చూసింది. అది పసిగట్టిన కేసిఆర్‌ ఆమరణ నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌కు దిగిరాక తప్పలేదు. లేకుంటే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చేదే కాదు. బిజేపి తప్పని పరిస్దితుల్లో సమ్మతిచ్చిందే. ఎందుకంటే తెలంగాణ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్‌,బిజేపి ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయలేదు. బిజేపి ఏకైక శాసన సభ్యుడుగా వున్న కిషన్‌ రెడ్డి తెలంగాణ ప్రజలు ఒత్తిడి చేస్తారని గ్రహించి అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటికీ బిజేపి తెలంగాణపై కడుపులో కత్తులు పెట్టుకొన్నట్లే మాట్లాడుతుంది. 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో అదికారంలో వున్న బిజేపి కేంద్ర ప్రేభుత్వంలో ఉప ప్రదానిగా వున్న అద్వానీ తెలంగాణ ఎందుకు అని వెటకారం చేశాడు. తెలంగాణ వచ్చి ఇంతకాలమైనా ప్రధాని మోడీ అవకాశం దొరికినప్పుడుల్లా విషం చిమ్ముతూనే వుంటాడు. పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటాడు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని తెలంగాణ అసి ్దత్వాన్ని అవమాన పర్చుతూనే వుంటాడు. ఎందుకంటే తెలంగాణ బిజేపి నాయకుల్లోనే ఆత్మగౌరవం లేదు. అందుకే కేంద్ర పెద్దలు తెలంగాణను కించపర్చుతుంటారు. తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతుంటారు. కాని తెలంగాణ కోసం కేసిఆర్‌ పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నారు. తెలంగాణ సాధించారు. అందుకే తెలంగాణ జాతి పిత అని కేసిఆర్‌ కొనియాడబడతున్నారు.

మృతి చెందిన తాపీ మేస్త్రి.!

మృతి చెందిన తాపీ మేస్త్రి కార్మికునికి కుటుంబానికి ఆర్థిక చేయూత…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరదిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల14వ వార్డ్ పోచమ్మ బస్తీ ఏరియాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు పానుగంటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అయన కుటుంబం నిరుపేద కావడంతో పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులందరూ కలిసి 17 వేల 7 వందల రూపాయలను మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు జీలకర్ర రాయమల్లు చేతుల చేతుల మీదుగా అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాజేష్, సంగ రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ గొప్ప శంకర్, ట్రెజరరీ కత్తెర సతీష్, సభ్యులు బాదావత్ రాజు, ముంత శ్రీనివాస్, కల్లేపల్లి ప్రసాద్, బొబ్బిలి వీరస్వామి, చొప్పరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version