బాలికల గురుకుల పాఠశాలలో.!

బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version