శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version