ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

హన్మకొండ నేటిధాత్రి:

ఎం జె పి ఆర్ సి ఓ రాజ్ కుమార్ ద్వారా ఎం జె పి కార్యదర్శి డాక్టర్ సైదులుకి వినతి పత్రం అందజేత.బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్ బోట్ల నరేష్ మాట్లాడుతూ…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఎంజేపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.

వేల సంఖ్యలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోకుండా ఈరోజు నిర్వహించే స్పాట్ కౌన్సిలింగ్ హాజరు కాగా కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికే మెరిట్ ప్రకారం అవకాశం కల్పిస్తామని సంబంధిత అధికారులు చెప్పడంతో విద్యార్థులు. 

చాలామంది జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో తండ్రి గాని తల్లి గాని కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించాలని మరియు సంచార జాతులకు చెందిన విద్యార్థులకు. 

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం కల్పించి వారినీ ఆదుకోవాల్సిందిగా ఎం జె పి గురుకుల కార్యదర్శి డాక్టర్ సైదులుని కోరారు.

కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులు జూనియర్, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ విభాగంలో పెయింటింగ్, వ్యాసరచన రాసి 63090 07828 నెంబర్ కు వాట్సప్ ద్వారా జూన్ 3 లోపు పంపాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, ఫోన్ నెంబర్, గ్రామం తప్పనిసరిగా రాయాలన్నారు.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.

ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.

 

అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .

అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

 

ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version