సీకేఎం కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు…

సీకేఎం కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పదవ బెటాలియన్ ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సీఐ సుజాత, షీ టీం ఎస్సై శ్వేత, ముఖ్య అతిథులుగా హాజరై సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందమే షీ టీమ్ అని తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ వంటి సమస్యలను అరికట్టడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు మరియు సమాజంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా మహిళల గౌరవాన్ని కాపాడడంతో పాటు వేధింపులను నిరోధించవచ్చని అన్నారు.

ట్రాఫిక్ సీఐ సుజాత మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొనే సమస్యలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ హెల్ప్‌లైన్ 100, షీ టీమ్ నెంబర్ 1930కు ఫోన్ చేయవచ్చని లేదా తెలంగాణ పోలీస్ సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఒకే బండిపై ముగ్గురు ప్రయాణించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరో ముఖ్య అతిథి ఎస్సై స్వాతి మరియు హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూ షీ టీమ్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సమాజంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా యువతులు తమ వాట్సాప్ డీపీలు, స్టేటస్‌లలో వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, విజయ్ పాల్ రెడ్డి, ఎన్‌సీసీ కెప్టెన్ డాక్టర్ సతీష్, లైబ్రేరియన్ అనిల్, ఆయేషా, కానిస్టేబుల్ పూర్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పా షా, జ్ఞానేశ్వర్, స్రవంతి, హరిబాబు, వెంకట్, సుమన్, చంద్రమోహన్ తదితర బోధనా, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ మరియు ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్ పోచ అద్యర్య ములో విద్యార్థులకు అవగాహన

డాక్టర్ పోచ అద్యర్య ములో విద్యార్థులకు అవగాహన

వనపర్తి నేటిధాత్రి .

సామాజిక వేత్త డాక్టర్
పోచ రవీందర్ రెడ్డి ఆధ్వర్యములో వనపర్తి లో దాచా లక్ష్మయ్య కల్యాణ మండపంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు 10 వ తరగతి నుండి ఏ కోర్సులు చేయాలి ఇంటర్ తరువాత ఉద్యోగ అవకాశాలు మ్యాథ్స్ సైన్స్ కాకుండా కోర్సులు ఉంటాయ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే విద్యార్థులు చదువు పై అవగాహన కల్పించారు.21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మెన్ క్రిష్ణ ప్రదీప్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ భవాని శంకర్ కాలేజ్ యాజమాన్యం వేణు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారని డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు

నిత్యం సాధన చేయాలి.. విజయం సాధించాలి..

నిత్యం సాధన చేయాలి.. విజయం సాధించాలి

టైమ్ టేబుల్ ప్రకారం చదవాలి

రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో10 వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ప్రేరణ, అవగాహన తరగతులు ప్రారంభం

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై నిత్యం సాధన చేయాలని.. విజయం సాధించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో సోమవారం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం విద్యార్థులతో ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చిన మార్కులు భవిష్యత్తు చదువులకు ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు. మూడు విషయాలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. గత ప్రశ్నాపత్రాలు కూడా సాధన చేయాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ స్టడీ హవర్ తో పాటుగా సెల్ఫ్ స్టడీ రోజు 3 నుంచి 4 గంటలపాటు చేయాలని సూచించారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

నడీకూడ,నేటిధాత్రి:

 

సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను అడవిలో వేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న చైతన్య కార్యక్రమం చేపట్టారు.
నా ప్లాస్టిక్ నా బ్యాగ్‌లోనే
మా చెత్త మా ఇంటికే
అమ్మల ఆశీర్వాదం అడవిని కాపాడితేనే
అనే నినాదాలతో విద్యార్థులు ఓ పాత క్యారీ బ్యాగ్‌తో ప్రజలలో అవగాహన కల్పించారు.మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ వెంట ఒక క్యారీ బ్యాగ్ వెంట తీసుకెళ్లి అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమం ద్వారా భక్తి అంటే దర్శనం మాత్రమే కాకుండా అడవిని, పర్యావరణాన్ని రక్షించడమూ మన కర్తవ్యం అనే సందేశాన్ని విద్యార్థులు బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లారు.
జాతర కొన్ని రోజులు మాత్రమే ఉన్నా,అడవి తరతరాల పాటు నిలవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయత్నం భక్తులలో మార్పు చైతన్యాన్ని కలిగించేలా ఉందని గ్రామస్థులు ప్రశంసించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడితేనే సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం నిలుస్తుందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్పష్టమైన సందేశం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పావని, సత్యపాల్ విద్యార్థులను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version