వన దేవతల సన్నిధిలో కోలాహలంగా సమ్మక్క సారలమ్మ జాతర

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం.

#తిరుగువారం రోజున కొనసాగిన భక్తుల రద్దీ.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తో కోలాహలంగా మారింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదట గా జంపన్న వాగు లో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం,ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ కొనసాగుతున్నా తరుణం లో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతర పరిసర ప్రాంతాలలోని వ్యర్ధాలను పారిశుధ్య కార్మికుల ద్వారా తొలగిస్తూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుగువారం సందర్భంగా వన దేవతల పూజారులు కన్నేపల్లి ఆలయం లో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వన దేవతలకు దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి,పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరుస్తారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version