మేడారం జాతర ఎంతగానో మారింది…
మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.
– డీజీపీ శివధర్రెడ్డి.. తల్లులకు మొక్కులు
మేడారం(ములుగు): అదివాసీల సహకారం తో పొలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి(DGP Shivadhar Reddy) తెలిపారు. వనదేవతలను దర్శించుకున్న డీజీపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించిన సీసీ పుటేజీల్లో జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే దారుల్లో ఉన్న ట్రాఫిక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోతే అచూకీ తెలుసుకోవడానికి గత జాతరల్లో జాప్యం జరిగేదని,
