మేడారం జాతర ఎంతగానో మారింది…

మేడారం జాతర ఎంతగానో మారింది…

 

మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.

ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

– డీజీపీ శివధర్‌రెడ్డి.. తల్లులకు మొక్కులు

మేడారం(ములుగు): అదివాసీల సహకారం తో పొలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadhar Reddy) తెలిపారు. వనదేవతలను దర్శించుకున్న డీజీపీ.. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించిన సీసీ పుటేజీల్లో జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే దారుల్లో ఉన్న ట్రాఫిక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోతే అచూకీ తెలుసుకోవడానికి గత జాతరల్లో జాప్యం జరిగేదని,

కానీ ఈ జాతరలో కొత్తగా చైల్ట్‌ ట్రాక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి పిల్లలు, వృద్ధుల చేతులకు హ్యాండ్‌ బ్యాండ్‌ పెట్టడం ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను కనుక్కోవడం సులువ గా మారిందన్నారు తద్వారా బాధితులతో పాటు పోలీస్‌శాఖకు సంతృప్తిని కల్గించం దన్నారు. పొలీస్‌శాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైయినీ ఐపీఎస్‌, డీఎస్పీలు పని నేర్చుకునేందుకు జాతరలో విధులు కేటాయించామన్నారు.

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం…

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

28 నుంచి 31 వరకు వనదేవతల మహాజాతర

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ శివారులో గల శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసాం,ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు,మేడారం తరువాత అత్యంత వైభవంగా జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో అతిపెద్ద జాతర కంఠాత్మకూర్ మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వచ్చి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకోవడం అనవాయితీ,జాతర ఆధునికరణ కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ కొంగంటి తిరుపతి కృషి,పట్టుదలతో జాతర ఏర్పాట్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసాం గద్దేల చుట్టూ ఐరన్ పైపులు గ్రిల్స్, నూతన బోర్ లు ఏర్పాటు చేసాము,అంతే కాకుండా జాతర కమాన్ నుంచి గద్దేల వరకు మొరం పోయించి భక్తులకు రోడ్డు సౌకార్యం కల్పించాము,అంతే కాకుండా నిరంతరం విద్యుత్,త్రాగునిటీ సౌకార్యం,స్థానాల గట్టాలు, మరుగుదోడ్లు,సౌండ్ సిస్టం, లైటింగ్,క్యూలైన్లు,మెడికల్ ఎమర్జెన్సీ,పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్, జాతరకు మూడు కిలోమీటర్ల లోపు అన్ని వైపుల నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు,ఆటో రవాణా సౌకర్యం,అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. భక్తులు ఉమ్మడి పరకాల మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేరాలని అమ్మవార్ల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని జాతర కమిటీ వైస్ చైర్మన్లు భాషిక శ్రీనివాస్,కుమ్మరి నరేష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version