మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న
నల్లబెల్లి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న సుదర్శన్ రెడ్డి శుక్రవారం మేడారం మహా జాతరలో వన దేవతలు సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర,అడవి తల్లి ఒడిలో జంపన్న వాగు ఒడ్డున వెలసిన సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నట్లు తెలిపారు.అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకోవడం మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
