కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్.!

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. జహీరాబాద్ నియోజకవర్గ రంజోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్, రవీందర్ రెడ్డి, బాబు, మాజీ ఎంపిటిసి ఖలీల్, నాయకులు చంద్రన్న, గుండారెడ్డి, రాజు, మల్లేష్, రవి, శశి, షబ్బీర్, మస్తాన్, సర్దార్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, దత్తు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్.!

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండల నూతన ఎస్సై సైదా రాహుఫ్ కు సన్మానం చేసిన మండల పిఎస్ఆర్,పివిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్,ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, యువజన నాయకులు ఎస్కె వాజీద్ పాషా, నాయకులు ఎస్కె ఖాసీం, దుర్గం బాలకృష్ణ, సోషల్ మీడియా సభ్యులు మండలోజు కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.
మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం పొనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరగాని రమేష్,బోరగాని మణికంఠ వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గతంలో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు.అయినా వారి ప్రవర్తనలో మార్పు జగగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పొనకల్ గ్రామ కమిటీ తీర్మానం చేయగా దానిని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయసినట్లు ఎర్రల్ల బాబు పేర్కొన్నారు.సస్పెండ్ ఐనా వారిద్దరికీ ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన

బిజెపి కుల గణన అంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధి

గద్వాల /నేటి ధాత్రి

 

 

60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్రన్నారు. జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్‌గా నిలిచారన్నారన్నారు. ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు. శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, 6 దశాబ్దాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.

Abhinav Ambedkar.

 

 

దేశ జనగణనలో భాగంగా కులగణనను చేపట్టి, దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక – సామజిక – సంక్షేమ లాభాలు చేకూర్చాలని ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, జిల్లా ఓబీసి మోర్చా అధ్యక్షుడు జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఐటి సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,బిజెపి నాయకులు ఢిల్లీవాల కృష్ణ,మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు ,బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి,మోహన్ రెడ్డి, రమేష్,వెంకటేష్, నరసింహ తదితరులు ఉన్నారు.

పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్.!

పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి:

మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హతకలిగిన లబ్ధిదారులకు చెందకుండా నిరుపేదలను మోసం చేస్తున్నారని వారి పార్టీ కార్యకర్తలకు మరియు కమిటీ సభ్యులకు మాత్రమే ఇల్లు కేటాయించుకోవడం జరుగుతుందని గ్రామంలో ఇల్లు కావాలనే వారి దగ్గర 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లు లేకుండా చేసి అనర్హుల పేర్లను పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాళ్లు ఇష్టానుసారం చేస్తున్నారన్నారని భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండలం మాజీ అధ్యక్షులు ముష్కే దేవేందర్ అన్నారు.పేదప్రజలను రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని కోరారు.

కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​.!

కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు
నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్​పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్​ ముఖ్యనేతల ఫిర్యాదు

పెద్ద సంఖ్యలో హైదరాబాద్​ తరలివెళ్లిన కాంగ్రెస్​ నాయకులు

కరీంనగర్ నేటిధాత్రి:

పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్​లో భేటి, శ్రీనివాస్​ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్​పై
చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్​కుమార్​ గౌడ్​. గత నెల 28వ తేదీన కరీంనగర్​లో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​పై కరీంనగర్​ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి పురుమళ్ల శ్రీనివాస్​ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్​ గౌడ్​ కరీంనగర్​ కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్​పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్​ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు నేతృత్వంలో కరీంనగర్​ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్​ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్​ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్​కు​ తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్​ రావు అధ్వర్యంలో కాంగ్రెస్​ ముఖ్యనేతలు గాంధీభవన్​లో పీసీసీ అధ్యక్షులు మహేశ్​కుమార్​ గౌడ్​ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్​ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్​ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్​ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్​ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్​ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్​పై శ్రీనివాస్​ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్​ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు.
పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్​ ముఖ్యనేతలు
పురుమళ్ల శ్రీనివాస్​ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్​ఎస్​తో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్​ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్​లో కాంగ్రెస్​ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్​ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్​ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్​ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్​పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్​ నోటీస్​ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ అభ్యర్థి గంగుల కమలాకర్​కు శ్రీనివాస్​ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్​ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్​లో పార్టీకి భవిష్యత్​ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్​, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్​ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్ల పల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపెళ్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేయడంజరిగింది. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపెళ్లి యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత పది సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈమహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈజాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు ఎనిమిది వందల మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎనభై మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
ఈపోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్, చిన్న సదాశివ్, అవినాష్, రమేష్ , దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్.!

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

 

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా
కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని.
ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36%
శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్.!

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్*

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై
పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.

రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం.

రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం
పాల్గొన్న జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
బుడిగె శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగ శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జెక్కిడి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎస్ వి ఎల్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రానున్న దేశ భవిష్యత్తు యువతదే అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి యువజన కాంగ్రెస్ కృషి మరువలేనిది అన్నారు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో రెచ్చగొడుతూ తమ రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు అమాయక ప్రజలు బలైపోతున్నారని వాపోయారు మోడీ నిరంకుశ పరిపాలనకు యువత త్వరలోనే చరమగీతం పాడి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూస్తామని తెలిపారు యువజన కాంగ్రెస్ కు సీనియర్ కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్కు యువజన కాంగ్రెస్ కుండకాయ లాంటిదని కొనియాడారు . అనంతరం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు సంతాపం తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జ్ శ్రీ కృష్ణ అల్లవారు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ సీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ ఇన్చార్జి మధు యాష్ గౌడ్ , రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రవణ్ రావు, టిపిసిసి ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

దశదినకర్మలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

దశదినకర్మలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

కొత్తగూడ మండలం కార్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్తీ నరసయ్య గారి అమ్మగారు ఇటీవల కాలం చేశారు వారి యొక్క దశదినకర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, గారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కల్తీ నరసయ్య గారిని ఓదార్పు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ మొగిలి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇర్ప వెంకన్న, మాజీ సర్పంచ్ మండల అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, సోలం వెంకన్న, కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని దేవదాసు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి అతని అంతక్రియలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి దేవదాసు పాడే మోసినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిని దేవదాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటామని ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతల కుమ్ములాట.!

కాంగ్రెస్ నేతల కుమ్ములాట
– కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం
– చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన
సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో
ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం ఒక్కసారిగా స్టేజి వద్దకు దూసుకెళ్లారు.

discussion

ఏనాడు పార్టీకి సేవ చేయలేదని ఉమేష్ రావు స్టేజి దిగి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీస్ లు కలగజేసుకొని శాంతింప చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సభను కొనసాగించారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఎదుటే నేతలు ఆందోళనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.!

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం అందుకుతండా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని దేవదాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన నాయకుడు. దేవదాస్ అకాల మరణం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య తన ప్రగాఢ సానుభూతి తెలిపారు..

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో

భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం

గండ్ర యువసేన జిల్లా నాయకులు

గడ్డం రాజు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని గడ్డం రాజు ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మొగుళ్ళపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో విజయోత్స సభకు పాల్గొనాలని గడ్డం రాజు పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు.!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మామిడిగి గ్రామానికి చెందిన బక్క రెడ్డి పెంట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి నాయకత్వములో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో చంద్రన్న,తుక్క రెడ్డి,మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు

జహీరాబాద్. నేటి ధాత్రి:

డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version