కొప్పుల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ ఎన్నిక
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఏరుకొండ శంకర్, ప్రధాన కార్యదర్శులు చాడ రాంరెడ్డి, పిట్టల నరేష్, ఉపాధ్యక్షుడు మామిడి రవి, సహాయ కార్యదర్శి గుండా ప్రవీణ్, కోశాధికారి అలువాల భాస్కర్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడు తూ తన ఎన్నికకు సహకరించి న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం కోసం కృషిచేస్తాన న్నారు.అలాగే గ్రామ అను బంధ కమిటీ ఎస్సీ, బీసీ, మైనా ర్టీ, మహిళా విభాగం కమిటీలు వేశారు ఈ కార్యక్ర మంలో కళ్లెపువంశీ, వంగాలతిరుపతి రెడ్డి, వేములపల్లి రవీందర్, సురేష్,కొమురయ్య, శాన బోయిన ఆగయ్య, గండి రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలలో వివిధ చోట్ల జూనియర్ కళాశాలలో మూసివేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యా ర్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొల గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడు తూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగు లాంబ,గద్వాల ,కరీంనగర్, చొప్పదండి, ఖమ్మం, మహబూ బాద్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి ,జనగాం మేడ్చల్ మల్కాజిగిరి,12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరి కాదు. ఈ విషయం సీఎం రేవం త్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు టెట్ ద్వారా చేర్చపరచం 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యా ర్థులు ఎక్కడికి పోవాలి తెలి యక ఆందోళన చెందుతు న్నారు ఈ నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపో యే ప్రమాదం ఉందని వాపో యారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్వితీయ సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయి. 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసి వేయడం వల్ల 28 సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరు పేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారు. ఈ విష యాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.
ఉద్యమం తప్పదు
బిఎస్ యు ఉమ్మడి వరం గల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్
గురుకుల కాలేజీ కుదుంపు కోర్సుల నిర్వహణపై పరిమి తులు విధించాలని సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపై ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రు లు మరోవైపు గురుకుల ఉద్యో గ ఉపాధ్యాయ యూనియన్ అనాలోచితంగా అసంబద్ధ మైన నిర్ణయాలు తీసుకుంటు న్నారని తప్పుడు పడుతు న్నారు గురుకుల సొసైటీ పూర్తిగా నిర్ణయం చేస్తే ఉద్యమాలు చేయడానికి ముందు ఉంటామని హెచ్చరించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బీఎస్ యు డిమాండ్ చేశారు లేదంటే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్.ఆధ్వర్యంలో పాత్రికేయుల.సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చిందా. ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. తోట ఆగయ్య. కొండూరి రవీందర్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే. 2002. 2003. వ. సంవత్సరంలో 36. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే . ఇప్పుడు. ఇప్పుడు అలాగే 2024. 2025. సంవత్సరానికి. 68 . లక్షల మెట్రిక్. తన్నుల. ధాన్యాన్ని కొనుగోలు చేసిన.ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని. చివరికి గింజ.వరకు కొంటామని చెప్పాము మీరు అధికారంలో ఉన్నప్పుడు. ప్రోటోకాల్ పాటించారా. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ ఫోటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమంలో పాల్గొని కూర్చున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే ఉంటానని చెప్పి కేటీఆర్.ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఏ ఒక్కరోజు ప్రజల పక్షాన పోరాడని. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. పదవి లేకున్నా ఉన్న ప్రజల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని ప్రజలను దోపి ది. చేసి.దోచుకున్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సిగ్గుచేటు. మీరు చేసిన తప్పులను అక్రమాలను దాచిపెట్టి వేదాలు వల్లిస్తామంటే ఎవరు నమ్మరు. రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చాం మీలాగా గుట్టలకు బూట్టలకు ప్రజాధనాన్ని దోచుకోలేదు. ప్రజా ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారుల కు.పథకాలను. అందిస్తున్నామని. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ధాన్యం. కొనడం లేదని చెప్పడం సిగ్గుచేటు అని. మీరు ఎన్ని చేసినా ప్రజలే వారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు అని. తెలియజేస్తూ. ప్రజలేతన ప్రోటోకాల్ గా. ప్రజల మధ్యలో ఉంటున్న ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. అధికారం పోయాక . మతిభ్రమించి. మాట్లాడుతున్నారని. దయచేసి ఇప్పటికైనా. ప్రజలకు మేలు చేయాలి తప్ప. తప్పుడు సంకేతాలు పంపకుండా. ప్రజల గురించి పోరాడాలని. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లాప్రధాన కార్యదర్శి. లింగాల భూపతి. విద్యార్థి జిల్లా అధ్యక్షులు. వెలుపుల సాయి ప్రసాద్.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కటకం రాజశేఖర్. శ్రీకాంత్ గౌడ్. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కొత్త రవి గౌడ్. ఇటికల మహేందర్. బండి పరశురాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు : సీఎం రేవంత్ రెడ్డీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర బాగంగానే బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు బాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.
కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
రేగొండ, నేటిధాత్రి
రేగొండ మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీపతి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రమేష్, భరత్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కర్ణాకర్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
గణపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా రెండోసారి ఓరుగంటి కృష్ణను ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మామిళ్ళ మల్లేష్ పసునూటి శంకర్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఓరుగంటి కృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రెండోసారి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నాకు సహకరించిన పార్టీ నాయకులు గ్రామస్తులు అలాగే నా యొక్క మిత్ర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు
రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
నేటిధాత్రి, రేగొండ..
రేగొండ మండలంలోని రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం జగన్, ఉపాధ్యక్షుడిగా దండవేన రమేష్, రాజయ్య, సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా మంద మొగిలి, క్యాతం రమేష్, అశోక్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యాతం సదయ్య, పున్నం రవి, బొజ్జం రవి, తదితరులు పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి
బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు
— విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి • ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి • ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
నిజాంపేట నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో 32 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్రభాతరావు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో రాజిరెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ ప్రీతీ, హిమాద్, ఎంపీవో ప్రవీణ్ నాయకులు అమర్సేనారెడ్డి, సిద్ధ రాములు, పంజా మహేందర్, నజీరుద్దీన్, సత్యనారాయణ, లక్ష్మా గౌడ్ , ఆకుల బాలయ్య,గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం మైలారం గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ సర్పంచులు ఎస్ వరుణ కుమారి పబ్బ సదయ్య వారి ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో భూక్య సమ్మయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నాకు సహకరించిన పార్టీ నాయకులకు గ్రామ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు గ్రామ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మోరే మహిపాల్ ప్రధాన కార్యదర్శి కుసుమ మహేందర్ కోశాధికారి దౌడు రమేష్ కార్యదర్శి జంగా రవి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.
చిట్యాల నేటిధాత్రి:
జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్* ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు* వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య* సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు* కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,* ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి
నేటిధాత్రి మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి
నేటిధాత్రి మొగుళ్ళపల్లి
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వారికే పార్టీ పదవులు
గ్రామ స్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు నూతన కమిటీలు
కేసముద్రం నేటిదాత్రి:
కేసముద్రం మండల కేంద్రంలో లక్ష్మీ సాయి గార్డెన్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణం సన్నహక విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ అబ్జర్వర్ పోట్ల నాగేశ్వర్ రావు,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,అబ్జర్వర్ కూచన రవళి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వర్ రావు,రవళి రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని,అర్హులైన నాయకులకు ఖచ్చితంగా పదవులు వస్తాయ అన్నారు.నాయకత్వం అందరికీ అవకాశం ఇస్తుందని,క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతును పెంచాలన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించేందుకు మన అందరము కలిసికట్టుగా పని చేయాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి,పిసిసి మెంబర్ దస్రు నాయక్,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,పోలేపాక నాగరాజు,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయూబ్ ఖాన్,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీ ఖాన్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు వెంకన్న,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోలేపెల్లి మహేందర్,కార్యకర్తలు,మండల నాయకులు,జిల్లా నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం
సంస్థాగత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు భూపాలపల్లి నియోజక వర్గం
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం లో ప్రతిపాదనల స్వీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగంగా, భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రొ బెల్ స్కూల్ లో మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , మాసంపెల్లి లింగాజి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు మండల కమిటీ అధ్యక్షుడు కి గ్రామ కమిటీ అధ్యక్షుడుకి ప్రతిపాదనలు పంపేందుకు, ఆసక్తి ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో తమరి బయోడేటా, పాస్ ఫోటోతో ప్రతిపాదన సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ, అనుబంద సంస్థల, బ్లాక్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మందమర్రి 11వ మహాసభను జయప్రదం చేయండి.. ఈనెల 18వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ మందమర్రి పట్టణ 11వ మహాసభను విజయవంతం చేయాలని ఈరోజు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి.. కామెర దుర్గారాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ . దున్నేవాడికే భూమిని అను నినాదంతో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ.. మందమర్రి ప్రాంతంలో నాడు దొరల భూస్వాములు వారి అనుచరులు గుండాలు ప్రజలను కట్టు బానిసలుగా చేసి చిత్రహింసల గురి చేసినటువంటి సమయంలో కామ్రేడ్ టి వి అబ్రహం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ కార్యక్రమంలో బండారి రాజేశం బియ్యాల పద్మ ఆంటోని దినేష్. ఆర్ జనార్ధన్. ఉప్పులేటి తిరుపతి.. సుంకర శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు
జమ్మికుంట నూతన తహసిల్దార్ ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట నేటిధాత్రి:
జమ్మికుంట మండల తహసిల్దారు గా పదవి బాధ్యతలు స్వీకరించిన చలమల్ల రాజు గారిని ఈరోజు వారి కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కమిటీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ మరియు మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ముందుండాలని యువజన కాంగ్రెస్ కమిటీలు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో; యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చైతన్య రమేష్, సంధ్యా నవీన్, సెక్రటరీ సజ్జు అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, యువజన నాయకులు ప్రవీణ్, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సే
2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సే
ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా?
ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా?
ఇదిగో…ఆధారం
నిన్న కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు
అయినా లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడం ఎంత వరకు కరెక్ట్?
ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ డ్రామాలాడుతున్నారు
సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాల్సిందే
ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే’’అని వ్యాఖ్యానించారు.
ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం తీసుకొని ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…..
తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. నిన్న సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్.
Congress
సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం నిన్న పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు.
ఢిల్లీకి పోతే అపాయిట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా ఏం మాట్లాడుతున్నరు. ‘‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు.’’అని అంటున్నడు. ఈ చెప్పులెత్తకపోవడమేంది? ఈ చెప్పులెత్తకపోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్కృతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు. నిన్న కూడా గడ్కరీ కలిశారు. అయినా అపాయిట్ మెంట్ ఇయ్యడం లేదు. చెప్పులు ఎత్తకపోయేవాడిలా చూస్తున్నరనడం సిగ్గు చేటు.
Congress
సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే…. ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. హామీలను అమలు చేయలేం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేం. ఇచ్చిన హమీలను అమలు చేయలేమని చెప్పిండు… ఇగ ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు. అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నడు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ సీఎం సీటెక్కంగనే చేతులెత్తేసిండు. ఇగ మీ ఖర్మ అని చేతులెత్తిసిండు. ఓట్లేసి గెలిపించినందుకు మీ తీట మీది అని అంటున్నడు. ఇకపై రైతులకిచ్చిన హామీలను అమలు చేయడు. వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యడు. మహిళలకు రూ.2500లు ఇయ్యరు. తులం బంగారం ఇయ్యరు.
మాట తప్పిన కాంగ్రెస్ ను ఇగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట ఇచ్చి తప్పినందుకు ఆ పార్టీ సంగతి తేలుస్తాం. ఏం ఆశించి ఎన్నికలప్పుడు హామీలను అమలు చేస్తామన్నరు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు? ఇప్పుడెందుకు చేతులెత్తేశారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ రాక్షసత్యం బయటపడింది. సంవిధాన్ పుస్తకం చేత పట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో సమాధానం చెప్పి తీరాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం. ప్రజలతో కలిసి అడ్డుకుని తీరుతాం.
ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదంటరు. ఇచ్చేదంతా కేంద్రమే. అభివ్రుద్ధి జరుగుతున్నదంతా కేంద్ర నిధులతోనే. రోడ్ల కోసమే 1.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. రైల్వేల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తుందని పొగుడుతారు. బయటకు వచ్చినంక నయాపైసా ఇయ్యడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతటి దుర్మార్గులంటే… చేసిన తప్పులన్నీ చేసేస్తారు. పాపాలన్నీ చేస్తారు….అవన్నీ బయటకొస్తున్నయని తెలిసే సరికి ఎదుటి వాళ్ల మీద రుద్ది బయటపడాలనుకుంటరు. నిన్న ఓ మంత్రి రాజీవ్ రహదారిని 6 లేన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తడు. ఇదేం పద్దతి? అరే.. రాజీవ్ రహదారిని నిర్మించింది నాటి కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంట్రాక్టర్ తో కలిసి కమీషన్లు కక్కుర్తి పడి రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్సే. భారీ ఎత్తున కమీషన్లు దండుకుంది కాంగ్రెస్సే…. అట్లాంటి పార్టీ నేతలు ఇయాళ ఏమంటున్నరు? రాజీవ్ రహదారిని 8 (ఎయిట్) లేన్ రోడ్డుగా మార్చండి… కేంద్రం పట్టించుకోవడం లేదని నిందలేస్తున్నరు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి ఉందా? 2036 దాకా ఆ కాంట్రాక్ట్ కొనసాగేలా ఒప్పందం చేసుకుందే కాంగ్రెస్ పార్టీ. అయినా సరే… తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని 6 లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడే కాదు. 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్పింది. ఇదిగో ఆధారం(3.6.2022న కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని చూపిస్తూ….). ‘‘హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారినికి 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం ద్రుష్ట్యా ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోండి. అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ కింద లేదా జాతీయ రహదారిగానైనా విస్తరిస్తాం’’ అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ కాపీలను కూడా మీకు పంపిస్తా… చెక్ చేసుకోండి. ఇదే కాదు… తెలంగాణ అభివ్రుద్ది కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసినం. రాబోయే 2 ఏళ్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనం. కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిధ్దమే. ఇకనైనా కేంద్రంపై బురద చల్లడం మానుకొని ప్రజల బాధలను అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నా…
ఆపరేషన్ కగార్ శాంతియుత చర్చల పై అభిప్రాయం…
అసలు చర్చలు అనేవి లేవని తుపాకులు పట్టుకున్న వారితో చర్చలు ఏంటి? తుపాకులు వదిలేసి జనంలో కలవాలని దానికి చర్చలు ఎందుకు,సమస్య తీరిపోతుందని అన్నారు…
పహల్గాం దాడి పై వివరణ
భారతదేశ పౌరులపై దాడి చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వదలమని త్వరలోనే దానికి సమాధానం తెలుస్తుందని అన్నారు…
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు నంది నరేష్, సీనియర్ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, బుగ్గారెడ్డి, కంచర్ల పరుశురాములు, సళ్ళ సత్యం రెడ్డి, రావుల బాల్రెడ్డి, గాజుల దాసు, స్రవంతి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.