అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

ఎమ్మెల్యే పై అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు..

సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం బిఆర్ఎస్ పాపం..

శిలాఫలకాలు వేయడమే తప్ప పనులు ప్రారంభించని బిఆర్ఎస్..

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..

రామాయంపేట జూలై 5 నేటి ధాత్రి (మెదక్)

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మాట్లాడి అర్హత బి.ఆర్.ఎస్ నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి ఎంత మాత్రం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం లేకపోవడంతో పాటు తక్కువ సమయంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు పట్ల ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలు వేయడం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన ఘటనలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలలు కాలం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో వేగంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లో 250 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను సైతం వారం రోజుల్లోకి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రావుకు దక్కింది అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కుంటూపడిందని కనీసం తన స్వగ్రామం కోనాపూర్ కూడా అభివృద్ధి నోచుకోని దుస్థితి దాపురించింది అన్నారు. రామయంపేట రెవిన్యూ డివిజన్ ప్రకటించి ఆర్డిఓ కార్యాలయం, సిబ్బంది నియమించకపోవడం కనీసం ఆర్డిఓ ఎవరు తెలియని పరిస్థితి అప్పటి బి ఆర్ ఎస్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. తూతు మంత్రంగా రెవిన్యూ డివిజన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Congress party.

ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, దేమే యాదగిరి చిలుక స్వామి, బైరం శంకర్ కంచర్లు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన..

చలో హైదరాబాద్ కు
తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన
ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ…
ములుగు నియోజకవర్గ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు
ఈ కార్యక్రమంలో
కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి..

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు సందర్బంగా జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ నాగభూషణం హైదరాబాద్ లో వారి నివాసం లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన జువ్వాడి నర్సింగరావు ఈ కార్యక్రమంలో
మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ ఎల్లలజలపతి రెడ్డి రాష్ట్ర పద్మశాలి సంఘము ఉపాధ్యక్షులు కేసుల సురేందర్ కౌన్సిలర్లు మర్రి సహాదేవ్, పిప్పర రాజేష్ బీసీ సంక్షేమ శాఖ మెట్ పల్లి ఇంచార్జి తుమ్మనాపెళ్ళి రాజు లు తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు .

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభకు బయలుదేరిన,జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పటేల్ గారు,శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొని సభకు బయలుదేరడం జరిగింది.

ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.

ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రం నుండి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం హైదరా బాద్ లో ఏర్పాటుచేసిన కాంగ్రె స్ సభకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ ముఖ్య నాయ కులు తరలివెళ్లారు. ఈ మేరకు బుచ్చిరెడ్డి పార్టీ జెండా ఊపి వాహనాలను ప్రారంభిం చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు నఖర్గే పాల్గొని, ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం దిశా నిర్దేశం ఉంటుందని తెలిపారు. సభకు తరలిన వారిలో చిదంరవి, వై నాల కుమారస్వామి, నిమ్మల రమేష్, హింగేభాస్కర్, శానం కుమారస్వామి, లడే రాజ్ కుమార్, మిట్టపల్లి సతీష్, మారపల్లి వరదరాజు, మసికే కుమార్, మామిడిపల్లి సాం బయ్య, మాడిశెట్టి చిరంజీవి, సుధాకర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాల మొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

 

 

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాలమొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయండి

➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమేళనం నిర్వహిచబడుతుంది.ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేసి ఈ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్,రామలింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,సామెల్,మరియు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,రచన్న,తదితరులు పాల్గొన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా .!

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్న నాయకులు

◆జహీరాబాద్ హెల్త్కేర్ హీరో ఉజ్వలుడు

◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం

◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్స్‌-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,అక్బర్, టీపీసీసీ జిల్లా మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నతానియల్ ‌,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండలం అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ, ఇమామ్ పటేల్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు సంబరాలకు రాష్ట్ర పార్టీ ఆదేశించగా మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, జెట్టి రామ్మూర్తి, జిల్లా మునీందర్, చిట్యాల ఉపేందర్ రెడ్డి బత్తిని మహేష్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనం అన్నారు.పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందని ఇలాగే క్రియాశీలంకంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ దుదిల్ల శ్రీను బాబు మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం రాజు, అనుము ప్రశాంత్, ఇనుముల ప్రదీప్, నాగరాజు,స్వామి,బర్ల రాజు, నాగరాజు,నేతెట్ల కిరణ్, ఎడుమెకల కిరణ్, ప్రదీప్, ఐత రాజు, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుందని బాలానగర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టి, ప్రశ్నించే బంజారా బిడ్డలను, బంజారా రైతులను, బంజారా ఉద్యోగులను జైల్లో పెడుతున్నారన్నారు. లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం లంబాడ సామాజిక వర్గంకు అవమానం చేసినట్టే అని అన్నారు. ఈ విషయంపై గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజనులను తృతీయ శ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

 

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి:

 

 

 

 

మండల చెందిన.కాంగ్రెస్ పార్టీ.సీనియర్ నాయకులు గత కొన్ని రోజులు బాధపడుతున్న నర్రా బాల్రెడ్డిని.ఆయనను తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పరామర్శించి మనోధైర్యం ఇచ్చి అన్ని రకాలగా ఆదుకుంటామని పెద్దలదృష్టికి తీసుకెళ్లి సహాయ అందిస్తామని.ఆయనకు హామీ ఇవ్వడంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింగం.గౌడ్ డైరెక్టర్ బాలు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆచారి బాల్రాజ్ మనోజ్ ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. పేద ప్రజల ప్రభుత్వం అని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ నైజం అని ఇందిరమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండడానికి అనేక పథకాలు తీసుకొచ్చామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామం జిల్లాల గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని. జిల్లాలలో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఇందిరమ్మ కాలనీ జిల్లాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిభూమి పూజలో పాల్గొనడం జరిగిందని. అలాగే రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని. రాష్ట్రాన్ని గత పాలకులు ఎంతో అప్పుల్లో కూర్చున కూడా దాన్ని అధిగమిస్తూ. రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని. అలాంటిది లేనిపోని అబండాలు వేసి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దయచేసి అభివృద్ధి పథంలో భాగ్యస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంత కష్టమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గo గౌడ్. డైరెక్టర్ బాలు. శ్రీనివాస్ రెడ్డి. గడ్డం మధుకర్. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఆసరి బాలరాజు. మనోజ్. ఉమేష్. తిరుపతి గౌడ్. నరసయ్య. సలీం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

చిట్యాల, నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చిట్యాలమండల లోని గుంటూరు పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ముద్దేన నాగరాజు*ఉపాధ్యక్షులుగా*:మన్యం పెద్ద తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా*:-కంకణాల రామ్, కోటేశ్వరరావు ,సహాయ కార్యదర్శిగా*:- మునిమాకుల నాగేశ్వరరావు, కోశాధికారిగా:కోటపాటి సాంబశివరావు ,*కార్యవర్గ సభ్యులు*పాశం శంకర్ ,కంకణాల లక్ష్మీనారాయణ ,పంచమర్తి కృష్ణారావు మన్నెంచిన్న తిరుపతయ్య, గోదే సుబ్బారావు ,కోటపాటి శ్రీనివాస్, కొంక వెంకటప్పయ్య, మన్యం శ్రీనివాసరావు దుగ్గినేని హరిబాబు..

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ ఆదేశం మేరకు కొప్పుల, కాట్ర పల్లి గ్రామాలలో నూతనంగా కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకె ళ్లాల చూడాలన్నారు అనం తరం నూతన గ్రామ కమిటీ లను ఎన్నుకున్నారు కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వాంకు డోత్ జగన్ ఉపాధ్య క్షుడిగా ఆరే కమలాకర్ ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీకాంత్ కోశాధికారిగా కొప్పుల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏరుకొండ శంకర్ ఉపాధ్యక్షుడిగామామిడి రవి ,ప్రధాన కార్యదర్శిగా చాడ రామ్ రెడ్డి, పిట్టల నరేష్ ఎన్నుకున్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మండల నాయకులు బాసని చంద్ర ప్రకాష్ ,చల్లా చక్రపాణి, అబు ప్రకాష్ రెడ్డి ,మారేపల్లి రవీందర్ దుబాసి కృష్ణమూర్తి, పోతు కృష్ణమూర్తి, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం కాంగ్రెస్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి తెలిపారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి* నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు చిట్యాల మండల కేంద్రం కార్యకర్తలు నాయకులు జిల్లా, మండల నాయకత్వం సమావేశంలోచిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్* ఏకగ్రీవంగా రెండోసారి జరిగింది. ఈ సందర్భంగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా ఎన్నిక కుసహకరించిన ఎమ్మెల్యేకు జిల్లా నాయకులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల టౌన్ ఎంపీటీసీ లా పరిధి ఇంచార్జ్ లు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు జయశంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలకల రాయకుమురు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు చిలుములరాజమౌళి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ.

జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ…

 

తంగళ్ళపల్లి నేటి దాత్రి

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐసీసీ. పీసీసీ. పిలుపు మేరకు తంగళ్ళపల్లి మండల జిల్లాల గ్రామం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగిందని. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్య విలువతో కూడిన లౌకిక వాదం వర్ధిల్లాలంటూ వాడ వాడలా నినాదాలతో పాదయాత్ర కొనసాగిందని. బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చీకటి ఒప్పందంతో చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని .గత పది సంవత్సరాలు చేసిన దోపిడిని అహంకారంతో కొనసాగించిన పాలన ఎండగడుతూ శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలను అమలు చేయాలంటూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరూ సిత్త శుద్ధితో అంకితభావంతో కృషి చేయాలని గ్రామ చౌరస్తాలో గ్రామస్తుల అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ చిలుక రమేష్ కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొనడం జరిగింది

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు.!

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

ఎస్సి సేల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు
ఓనపాకాల ప్రసాద్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు, ఓర్వలేక సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనులకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న విమర్శలకు సోమవారం రోజున అయన స్పందించి మాట్లాడుతూ. గత పాలకులు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు కోట్ల పదిలక్షల మందికి సన్న బియ్యం జరుగుతుంది నిజం కదా. సుమారు 82శాతం మందికి లబ్ది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, సుమారు 150 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని. రైతులకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ రైతుబంధు జరిగింది. యువకులకు 57,వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యువతకు అందించారాని. పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు అవుతుందని ప్రతిపక్షాలకు ఈ పథకాల అవపడుతలేవ. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తుందనడంలో. ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో. నేటి యువత. స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, రాజ్యాంగం యొక్క చరిత్ర,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవడం అవసరం ఉందని, ఈరోజు జై బాపు జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు మొగుళ్లపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి లకు తగిన గుణపాఠం చెపుతామని ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్ అన్నారు. పాల్గొని పై విధంగా పేర్కొన్నారు.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు వివరించాలని తెలియజేశారు భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు పేద బలహీన వర్గాల ప్రజల వృద్ధిపై ఆకాంక్ష లేదని ప్రధాని పేద ప్రజల కంటే బడా బాబులకు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగదొక్కలని చూస్తుందనీ అమిత్ షాఅంబేద్కర్ నీ పార్లమెంటు సాక్షిగా అవమానించారని గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు గాంధీ అంబేడ్కర్ ఆశయాల సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ గత బి.ఆర్.ఎస్ పార్టీ అందజేసిన పథకాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులుఓ ర్వలేక వ్యతిరేక అంశాలను సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పై విషం చిమ్ముతుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపరుడుపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version