జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు వివరించాలని తెలియజేశారు భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు పేద బలహీన వర్గాల ప్రజల వృద్ధిపై ఆకాంక్ష లేదని ప్రధాని పేద ప్రజల కంటే బడా బాబులకు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగదొక్కలని చూస్తుందనీ అమిత్ షాఅంబేద్కర్ నీ పార్లమెంటు సాక్షిగా అవమానించారని గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు గాంధీ అంబేడ్కర్ ఆశయాల సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ గత బి.ఆర్.ఎస్ పార్టీ అందజేసిన పథకాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులుఓ ర్వలేక వ్యతిరేక అంశాలను సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పై విషం చిమ్ముతుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపరుడుపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండలం లోని దూత్ పెల్లి గ్రామంలో ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్* ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది…. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్ మరియు మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి మాట్లాడుతూ ఈ దేశంలో మతోన్మాద బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని కూనిచేస్తూ రాజ్యాంగ విలువలను మంట కలుపుతూ దళితులు ,అట్టడుగు వర్గాలపై దాడులు ,దౌర్జన్యాలు చేస్తూ అధికారంలోకి వచ్చి నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం 75 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించిన తరుణంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ మహా నాయకులు అందించారుఅని స్వాతంత్రం తీసుకొచ్చినదేశ పరిపాలనలో అసువులు బాసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటివారు ప్రజల కోసం ప్రజాసేవలో కొనసాగుతూ అమరులైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత సోనియాగాంధీ కి దక్కింది 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనను తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అనేక సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటిలన్నింటిని అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం జై బాబు జై భీమ్ జై సౌంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గడపగడపకు కాంగ్రెస్ పార్టీ బాపు వారసుల త్యాగ ఫలితాలను అంబేడ్కర్ వాదాన్ని ప్రజల్లోకి ప్రతి కార్యకర్త నాయకులు తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారు,చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధుర వంశీ కృష్ణ , జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కార్యదర్శి రాయకమురు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఏకు రవీందర్ ,ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బొట్ల రవి ,నందరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ , యూత్ నాయకులు గోపగాని శివ, నాగరాజు, శ్రీకాంత్, ముష్కే నాగరాజు యూత్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version