గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ.

జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ…

 

తంగళ్ళపల్లి నేటి దాత్రి

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐసీసీ. పీసీసీ. పిలుపు మేరకు తంగళ్ళపల్లి మండల జిల్లాల గ్రామం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగిందని. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్య విలువతో కూడిన లౌకిక వాదం వర్ధిల్లాలంటూ వాడ వాడలా నినాదాలతో పాదయాత్ర కొనసాగిందని. బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చీకటి ఒప్పందంతో చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని .గత పది సంవత్సరాలు చేసిన దోపిడిని అహంకారంతో కొనసాగించిన పాలన ఎండగడుతూ శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలను అమలు చేయాలంటూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరూ సిత్త శుద్ధితో అంకితభావంతో కృషి చేయాలని గ్రామ చౌరస్తాలో గ్రామస్తుల అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ చిలుక రమేష్ కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version