‘‘శాపనార్థాలకు’’నీళ్లు రావు..’’బూతులకు’’పొలాలు పారవు!

‘‘శాపనార్థాలకు’’నీళ్లు రావు..’’బూతులకు’’పొలాలు పారవు!

’’కేసీఆర్‌’’ ను తిడితే పుట్టగతులుండవు.

`తిడుతుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు!

kcr leader of telangana

`శాపనార్ధాలు కాదు సమాధానం చెప్పండి?

`ఎవరి ‘‘పదవి’’ ఎప్పుడు పోతుందో ‘‘గ్యారెంటీ లేదు’’!

`నీళ్లిచ్చిండు..కరంటు తెచ్చిండు..కడుపు నింపిండు.

`నీళ్ళాపిండు..నిలువ చేసిండు..చెరువులు నింపిండు.

kcr leader of telangana

`అనుమతుల కోసం ప్రయత్నస్తూనే… ప్రాజెక్టులు కట్టిండు.

`తెలంగాణా దిశ మర్చిండు… దశ మర్చిండు.

`నీటి గోస తీర్చిండు.. తెలంగాణ నెంబర్‌ వన్‌ చేసిండు.

`తిండికి గతి లేని తెలంగాణను అన్నపూర?ను చేసిండు.

`పంజాబ్‌ ను పక్కకు తోసిండు.

`బెంగాల్‌ ను కిందికి తోసిండు.

`పదేళ్లలో తెలంగాణ రైతును రాజును చేసిండు.

`శాపనార్ధాలతో సమస్యలు పరిష్కారం కావు.

`తెలంగాణా దేవుణి? తిట్టి తప్పు చేస్తుండ్రు.

చావు భాష ఎవరు మాట్లాడినా మంచిది కాదు.

`ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గది కాదు.

`పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.

`ఆ మాత్రం దానికి మిడిసిపాటు ఎవరికీ తగదు.

`ఉన్నత పదవుల్లో వున్న వారికి అసలే మంచిది కాదు.

`తిట్లు కాదు కనీసం తెలివైన సమాధానం వెతకండి.

`జనం చేత శబాష్‌ అనిపించుకోండి!

`ఎన్నికల ముందు ఆరోపణలు వేరు?

`ఇప్పుడు ‘‘కెసిఆర్‌’’ ను దూషిస్తే జనం మెచ్చుకోరు.

`‘‘కెసిఆర్‌’’ ను పాలకులు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రనా గొప్ప వారు కారు.

మళ్ళీ జన్మేత్తినా ‘‘కెసిఆర్‌’’ చరిత్ర చేరపలేరు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

మంత్రాలకు చింతకాయలు రాలవు. శాపనార్దాలకు నీళ్లు రావు. తిట్టుకుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు. నీళ్లంటే మాటలు కాదు. మాటలు చెప్పినంత సులువుగా నీళ్లు రావు. మాటల మూటలు కట్టుకంటూ పోతే కాలం చాలదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరూ శాశ్వతంకాదు. ప్రాణాలే శాశ్వతం కానప్పుడు పదవులెంత? ప్రాపకాలెంత? వైభవాలెంత? ఇవి తెలిస్తే ఏ వ్యక్తి మరో వ్యక్తిని దూషించడు. చావులు కోరుకోరు. పాలకులా లేక ప్రత్యర్ధులను తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ, చావులు కోరుకునే వాళ్లా? ఇవెక్కడి దిక్కుమాలని రాకీయాలు. ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. అది నాయకుల పుణ్యం కాదు. ప్రజల దయాదాక్షిణ్యం. ఏ వ్యక్తికైనా కొపం వుంటే ఒకసారి తిట్టొచ్చు. రెండుసార్లు తిట్టొచ్చు. కాని పదే పదే మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి, నోరు తెరిస్తే తిట్ల పర్వం తప్ప మరొక పని లేదా? ప్రజలు పని చేయమని పట్టం కట్టారా? లేక కేసిఆర్‌ ను తిట్టుకుంటూ కాలం గడపమని గెలిపించారా? రెండేళ్లుగా ఒకటే పనా? కేసిఆర్‌ను దూషించడం తప్ప మరో పని లేదా? ఇన్ని తిడుతున్నా, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎంతో హుందాగా కేసిఆర్‌ మౌనంగానేవుంటున్నారు. ప్రజలు చక్కటి అవకాశమిచ్చారు. మాకంటే బాగా పనిచేయండి. నేను ఒక దారి చూపాను. తెలంగాణ భవిష్యత్తు మీది అని ఎంతో హుందా కేసిఆర్‌ సూచించారు. అయినా సరే మేం మేం మారమన్నట్లు సాగుతున్నారు. అటు బూతులు, ఇటు తిట్లతోనే పుణ్యం కాలం గడిపేస్తారా? ఎంత కాలం కేసిఆర్‌ మీద పడి ఏడుస్తారు? కేసిఆర్‌ చేసిన తప్పేంటి? కేసిఆర్‌ చేసిన అన్యాయమేమిటి? కేసిఆర్‌ ఒక యోగి. తెలంగాణ త్యాగి. తెలంగాణ మూర్తి. తెలంగాణ స్పూర్తి. తెలంగాణ ఆర్తి. తెలంగాణ దీప్తి. కేసిఆర్‌ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎన్ని పదాలు రాసిన తక్కువే. అంత గొప్పది కేసిఆర్‌ చరిత్ర. ప్రజల గురించి ఆయన ఆలోచించినంతా మరే నాయకుడు ఆలోచించరు. తెలంగాణ కోసం కొట్లాడిరడు. తెలంగాణ తెచ్చిండు. 60 ఏళ్లుగా సాద్య పడని తెలంగాణ సాధన సుసాద్యం చేసిండు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో కనకం చేసిండు. తెలంగాణను అన్ని రంగాల్లో పరుగులు తీయించిండు. ఎప్పుటి నుంచో పరుగులు తీస్తున్న రాష్ట్రాలను దాటుకొని, పదేళ్లలో అన్ని రాష్ట్రాలను దాటేలా చేసింది. అభివృద్ది అంటే ఇదీ అని చూపించిండు. విఫల రాష్ట్రం చేయాలని చూసి, కళ్లలో నిప్పులు పోసుకున్న వారి కనువిప్పు కలిగేలా చేసిండు. తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే కర్రు కాల్చి వాత పెట్టింతన పని చేసిండు. అలా భయం పెట్టి, తెలంగాణను కాపాడిరడు. అదీ కేసిఆర్‌. తెలంగాణ ద్రోహులు కపట పన్నాగాలు పన్నుతుంటే, కాళ్లల్లో కట్టెలు పెడుతుంటే కూడా క్షమించిండు. తన కర్తవ్యమే ముఖ్యమని ముందుకు సాగిండు. తెలంగాణను బంగారు తునక చేసిండు. ఇదీ ఒక పాలకుడికి వుండాల్సిన లక్షణం. కాని ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది. అసలు కేసిఆర్‌ తెలంగాణ తేవడమే తప్పనుకుంటున్నారా? కేసిఆర్‌ తెలంగాణ కోసంకొట్లాడడమే పాపమనుకుంటున్నారా? అరవై ఏళ్లలో కాంగ్రెస్‌, తెలుగుదేశం చేసిన విద్వంసం నుంచి తెలంగాణను కాపాడినందుకా? కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అసహనమో అర్దం కావడం లేదు. అరవైఏళ్లు పాలించి, తెలంగాణను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రజలను అన్నమో రామ చంద్రా అని ఏడిపించిన కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లలో కేసిఆర్‌ తెలంగాణను నాశనం చేశాడడనడంలో ఔచిత్యమేమిటో కనిపించడం లేదు. 50 ఏళ్లు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్లు చూడలేక, నోరు మాట్లాడలేక, పదవుల్లో వుండి పనులు చేయలేక చేష్టలుడిగిన నాయకులు కూడా ఇప్పుడు కేసిఆర్‌ను తిడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర నాయకులను ఇంకా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాళ్ల వల్లనే రాజకీయ జీవితాలు వచ్చాయని కృతజ్ఞతలు చూపిస్తున్నారు. ఓట్లేసేసి గెలిపించేది తెలంగాణ ప్రజలు. కాని ఊడిగం ఇంకా ఆంద్రా నాయకులకు చేద్దామనుకే నాయకులు వుండడం దౌర్భాగ్యం. కేసిఆర్‌ ఏం చేసిండు? ఏం చేసిండు? అని పదే పదే ప్రశ్నించే వారికి కళ్లు లేవా? చూడడం లేదా? కనిపించడం లేదా? ప్రగతి అంటే ఏమిటో చూడకుండానే రాజకీయాలు చేస్తున్నారా? పదేళ్ల కింద పచ్చ గడ్డికి కూడా దిక్కులేని భూముల్లో పచ్చని పైర్లు కనిపించడం లేదా? నీటి చుక్క జాడ లేని చోట పచ్చని పంటలు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు పచ్చబడితే ప్రజలు వలసలెందుకు వెళ్లేవారు? పంటలు లేని భూముల్లో పలుగు రాళ్లెందుకు తేలేవి? తొండలు కూడా గుడ్లుపెట్టవని ఆంద్రా నాయకులు ఎందుకు ఎగతాళి చేసేవారు? ఇవన్నీ నాయకులు మర్చిపోయినా, జనం మర్చిపోరు. కుప్ప మీద కూర్చొని, తిండికి గతి లేదని ఏడ్చేవారు, గుప్పెడు మెతుకులు చూడని కాలం మర్చిపోతారు. అవకాశ వాద రాజకీయాలు చేస్తారు. కేసిఆర్‌ లాంటి నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు. ప్రపంమంతా వెతికినా కనిపించరు. అంత గొప్ప పాలకుడు కేసిఆర్‌. అరవై ఏళ్లలో సాద్యం కానిది ఐదేళ్లలో చూపించారు. తెలంగాణ తెచ్చి నీళ్లిచ్చిండు. అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎందుకివ్వలేదు? కాని తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే నీళ్లిచ్చిండు. మిషన్‌ కాకతీయ తేవడానికి ముందే ప్రయోగం చేసిండు. గొలుసు కట్టు చెరువులు నింపడం మొదలు పెట్టిండు. చెరువులన్నీ నింపేందుకు తెలంగాణలో మిషన్‌ కాకతీయ తెచ్చిండు. 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చిండు. వాగులు వంకల ద్వారా చెరువులు నింపిండు. వాగుల్లో నీళ్లు పారించిండు. భూగర్భ జలాలు సమృద్ది చేసిండు. వంకలు, ఒర్రెలు, కుంటలలో కూడా నీళ్లు పారించిండు. అదీ సంకల్పమంటే…అదీ పుట్టిన గడ్డ మీద మమకారమంటే…కరంటు కష్టాల నుంచి ఒక రాష్ట్రాన్ని మూడు నెలల్లో గట్టెక్కించిన నాయకుడు, దార్శనికుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆరు నెలల్లో ఒట్టిపోయిన తెలంగాణను గంగాళం చేసిండు. అలాంటి పాలకుడు మరొకరు లేరు. తలాపున పారుతున్న గోదారికి తన కాళ్లు అడ్డం పెట్టి ఆపిండు. వాటిని నిలువ చేసిండు. చెరువులు నింపిండు. కాళేశ్వరం కట్టిండు. తెలంగాణ మొత్తం పారించిండు. అటు ఖమ్మందాకా, ఇటు కోదాడ దాక, చిట్ట చివరి పాలమూరు ఊరు దాకా కాళేశ్వరం నీళ్లు పారించాడు. ఎండి ఎండి డొక్కలీడ్చుకుపోయి వున్న తెలంగాణ కడుపు నింపిండు. తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిండు. అరవై ఏళ్లు ఎండిన బీళ్లకు దాహం తీర్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలన పుట్లకొద్ది వడ్లు పండిరచిండు. తెలంగాణలో ఒక్క గుంట కూడా పంట లేకుండా వుండకుండా సాగయ్యేలా నీళ్లిచ్చిండు. పంటతో పాటు పాడి పెంచాడు. పాడి పంటలతో తెలంగాణ తులతూగేలా చేసిండు. తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు ఆగమేఘాలమీద ప్రాజెక్టులు కట్టిండు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా, అనుమతులలో జాప్యం చేస్తున్నా లెక్క చేయలేదు. తన తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమని నీళ్లను మళ్లించిండు. అనుమతులు కోసం ఎదురుచూసుకుంటూ కూర్చోలేదు. అటు అనుమతులు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే మరో వైపు ప్రాజెక్టులు పూర్తి చేసిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు పెట్టిన తెలంగాణను అన్న పూర్ణను చేశారు. అన్న పూర్ణ అని పేరున్న ఆంద్రా ప్రాంతాన్ని వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పుకున్న పంజాబ్‌ను పక్కకు నెట్టేశాడు. బెంగాల్‌ను కిందకు తోసేశాడు. సాగు రంగంలో తెలంగాణలో పదేళ్లలో పంటల విప్లవాన్ని సృష్టించారు. ఎడారిలా మారిన తెలంగాణను ఒయాసిస్సు చేసిండు. అన్ని రంగాలలో తెలంగాణ నెంబర్‌ వన్‌ చేసిండు. ఒకప్పుడు బియ్యమే లేని కాలం. అందులోనూ సన్న బియ్యం అంటే ఆంద్రా నుంచి రావాలని అనుకునే సందర్భం. ఇప్పుడు తెలంగాణ అంతా సన్నబియ్యమే. అందుకు కారణం కేసిఆర్‌. అలాంటి నెంబర్‌ వన్‌ రాష్ట్రాన్ని పాలిస్తూ, కేసిఆర్‌కు శాపనార్దాలు పెట్టడం సరైంది కాదు. నీళ్ల విషయంలో కేసిఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ తప్పుల మీద తప్పు చేస్తోంది. కేసిఆర్‌ మీద నిందలేస్తూ పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తోంది. కేసిఆర్‌ ఆకాశమంత మహా మనిషీ. ఆయనను కన్నెత్తి చూసే అర్హత లేని వాళ్లు కూడా కవ్విస్తున్నారు. అదే సమయంలో కలలో కేసిఆర్‌ను గర్తుచేసుకుంటూ జడుసుకుంటున్నారు. పైకి మేక పోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసిఆర్‌ ముందే కుప్పి గంతులేస్తున్నారు. అసాధ్యాన్ని సుసాద్యం చేసిన యోధుడు. ప్రజలకు సంక్షేమం అందించిన వారే నిజమైన పాలకుడు. ఆ పాలకుడు ఒకే ఒక్కడు. కేసిఆర్‌. ఆ పేరే తెలంగాణకు సూపర్‌ పవర్‌.

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..*

*నర్సంపేటను అభివృద్ధి చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి

నియోజకవర్గలో విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ నాయకులు

విద్య ,వైద్య,సాగు,త్రాగు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నర్సంపేట నియోజకవర్గలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని టిఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ, మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆసాధనకై అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధినీ ఆకాంక్షించే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఖబర్దార్ అంటే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో తెలపాలన్నారు.పాకాల సరస్సు, రంగయచెరువు, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల నాటి కలను సహకారం చేసిన జలసాధకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధికై రూ. 42 కోట్ల టియుఎఫ్ఐయు డబ్ల్యూ నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికై పట్టం కట్టారని తెలిపారు.నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని విద్యా,వైద్య హబ్ గా తీర్చిదిద్దిన ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొరియాడారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ పనులు,9 కిలోమీటర్ల మేర అంతర్గత బిటి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.నర్సంపేట పట్టణానికి పాకాల ఆడిటోరియం,మోడల్ వెజిటేబుల్ మార్కెట్,మినీ స్టేడియం,పట్టణ పకృతి వనం,పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మించారని తెలిపారు.
ఖానాపురం మండలంలో గల అశోక్ నగర్ గ్రామానికి సైనిక్ స్కూల్ తెచ్చిన ఘనత పెద్దిదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి నయా పైసా కూడా తీసుకురాని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు.శాసనసభ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే తరిమి కొడతారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్,పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశెట్టి ప్రసాద్,దేవోజు సదానందం,రాయిడి దుష్యంత్ రెడ్డి, పెండం వెంకటేశ్వర్లు, పుల్లూరు స్వామి,వార్డు అధ్యక్షులు రావుల సతీష్,బీరం నాగిరెడ్డి,సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పల సుదర్శన్,రాంప్రసాద్,కడారి కుమారస్వామి, మద్దెల సాంబయ్య,మంద ప్రసాద్, ఆంబోతు రాజు,తోటకూరి సదానందం, గిరగాని సాంబయ్య, పైసా ప్రవీణ్,ముచిక రాజు,బుస రాజు ,చేరాల గోవర్ధన్, గోనెల కరుణాకర్, మాదాసి శ్రీనివాస్, మాదాసి ప్రవీణ్, దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి….

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలతో కలిసి నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీఓ రామకృష్ణ
స్లాబ్‌ స్థాయి వరకు పూర్తయిన ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన ఎంపీడీఓ రామకృష్ణ,నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను లబ్ధిదారులతో కలిసి ఎంపీడీఓ రామకృష్ణ,సర్పంచ్ కోంగంటి తిరుపతి పంచాయతీ కార్యదర్శి శ్రీమతి భార్గవి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు, ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించాలని తెలియజేశారు.అనంతరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు, అలాగే మరుగుదొడ్లు లేని వారు వెంటనే నిర్మించాలని తెలిపారు,పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం అయినా ఎంపీడీఓ వారి సమస్య కు న్యాయం చేస్తా అని మాట ఇచ్చారు.గ్రామ పంచాయతీ పరిసరాలను పరిశీంచారు,అంగన్వాడీ సెంటర్ కిరాయి లో ఉన్నందున్న చిన్న బడి లో వచ్చే విధంగా మార్చాలి అని ఎంపీడీఓ కి సర్పంచ్ కోంగంటి తిరుపతి తెలిపారు.

మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య…

మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా,జహీరాబాద్ నియోజకవర్గ (ఎం పి పి ఎస్) రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా భాగ్యసాములుగా పాల్గొన్నారు,

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ పథకానికి గాంధీజీ పేరు చరిత్రాత్మకంగా అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం..

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.

సజావుగా రైతులకు యూరియా పంపిణీ…

సజావుగా రైతులకు యూరియా పంపిణీ…

రైతు భరోసా పోర్టల్ నుంచే రైతులకు యూరియా

రైతులు ఎవరు అధైర్య పడవద్దు… మండల వ్యవసాయ అధికారి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు, ప్రైవేటు డీలర్ల ద్వారా కేసముద్రం మండల రైతులకు గ్రామాల వారిగా రైతు భరోసా పోర్టల్ నుంచి రైతుల లిస్టులు
ఒకరోజు ముందు గ్రామాలకు పంపించి మరుసటి రోజు శనివారం సుమారు 2844 బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేయడం జరిగింది.
కేసముద్రం మండల లోని వివిధ యూరియా పంపిణి సెంటర్ల ను మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న పంపిణి విధానాన్ని పరిశీలించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఎవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండలానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడతలవారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందని కావున రైతులు ఎవరు అధైర్య పడవద్దని వారు సూచించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా పంపిణీ చేసే విధానంలో రెండో విడతలో ఉన్నందున త్వరలో యాప్ అందుబాటులోకి వస్తుందందున కేసముద్రం మండలంలోని ప్రతి రైతు గూగుల్ ప్లే స్టోర్ నుండి యూరియా బుకింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీసు శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు జిపిఓ పాల్గొన్నారు.

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మర్రిపల్లి సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మర్రిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ పాల్గొని ఘన
నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి త్యాగం, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడి ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని చూపారాన్నారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గాజు శివాజీ,కుక్కమూడి కవిత,డ్యాగం రాణి నర్సింగం,రాజేందర్ అపర్ణ,మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాపరెడ్డి,మహిళా సంఘం సీసీ వేల్పుల సుజాత,గ్రామ పెద్దలు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,కుక్కమూడి సాంబయ్య,గ్రామ మహిళలు కశివొజ్జువుల రాజేశ్వరి,కుక్కమూడి కర్ణ,తలారి రజిత,మైదం స్రవంతి,ఆశా వర్కర్ మైదం సరోజన,యూత్ సభ్యులు డ్యాగం శివాజీ,పొన్నాల మైపాల్,కుక్కమూడి గోవర్ధన్,చిరంజీవి,మైదం దిలీప్,కుక్కమూడి స్వామి,శ్రీనివాస్,ప్రదీప్,సిద్దు,ఇల్లందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం….

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోవెలిసినటువంటి స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమన్.శ్రీనమిలికొండ రమణాచారి స్వామి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులుగా బండి చైతన్య. అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగా పాలకవర్గంచే రమణ చారి ప్రమాణ స్వీకారం చేయించి దేవాలయానికి సంబంధించి నూతన కమిటీ గురించి ఇదివరకు చేసిన కమిటీ గురించి ప్రజలకు వివరిస్తూ కొన్ని సలహాలు సూచనలు చేశారు గ్రామంలో పార్టీలకతీతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అలాగే పాలకవర్గ సభ్యులుగా చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని అలాంటి సేవ చేయడం మన అదృష్టంగా భావించి స్వామి వారి సేవలో నిమగ్నం కావాలని తెలియజేస్తూ ఇకముందు కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి కతీతంగా మన నరసింహ స్వామిని అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు ఆ స్వామి వారి సేవలో ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని దేవాలయంలో పనిచేసే అర్చకులకు విశ్రాంతి నిమిత్తం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని దేవాలయ పరిసరాలలో చుట్టుపక్కల సిసి రోడ్డు నిర్మాణంతోపాటు గిరి ప్రదర్శన చేసే విధంగా సౌకర్యాలు కల్పించాలని. ఆలయ అభివృద్ధి కొరకు ఏ పార్టీ వారైనా ఎవరైనా వారి వారి నాయకుల ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధిలో ముందు ఉంచాలని తెలియజేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో జనాలు విచ్చేస్తున్నారని భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న కాటీజీలు నిర్మించాలనిఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కమిటీ అధ్యక్షులుగానియమించబడిన బండి బండి చైతన్య తన ఎల్.ఎల్.బి చదువుకొని వృత్తిరీత్యా వ్యాపారo చేస్తూ ఉన్నాడని ఇలాంటి వ్యక్తి మన ఆలయ అభివృద్ధి కొరకు అధ్యక్షులుగా నియమించబడగా వారి భాగ్య స్వామిరాలు కూడా ఎంతోకొద్దో గొప్పగా చదువుకొని విజ్ఞాన వంతురాలిగా తన భర్త దేవస్థానం అధ్యక్షుడిగా నియమవగా ఆలయ అభివృద్ధిలో భాగంగా తను కూడా ఆయన వెంట ఉండి అభివృద్ధి చేయాలని తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని భగవంతునికి సేవ చేయడం మన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో జన్మలు పుణ్యము చేసిన ఇలాంటి అరుదైన గౌరవం దక్కదని అందుకు అనుగుణంగా బండి చైతన్యకు ఈ అవకాశం దక్కడం తమ చేసుకున్న అదృష్టంగా భావించాలని అలాగే గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా శ్రీ మాన్ శ్రీ నమిలికొండ రమణ చారి స్వామి వారి చేతుల మీదుగా ఆలయ కమిటీ రమణ చారి ప్రమాణస్వీకారం చేయించారుఆలయ కమిటీ అధ్యక్షులుగా బండి చైతన్య. ప్రధాన కార్యదర్శిగారాపల్లి ఆనందం.ఉపాధ్యక్షుడిలుగా ఎగుమామిడి వెంకటరమణారెడ్డి. కోడంరమేష్.బత్తినిమల్లేశం. సామల గణేష్. కోశాధికారిగా సుద్దాల కర్ణాకర్. ఆసాని లక్ష్మారెడ్డి. సంయుక్త కార్యదర్శిగా. మచ్చ విజయ్ జగత్. సంస్కృతిక కార్యదర్శిగా.పడిగలరాజు. జూకంటి శివశంకర్ ప్రచార కార్యదర్శులుగా. చేన్నమనేని ప్రశాంత్. ఎడమల శ్రీధర్ రెడ్డి. కార్యవర్గ సభ్యులుగా. ఎడమల బాల్రెడ్డి. రంగు అంజయ్య. ఆంజనేయులు. జిందం సంతోష్. దొందడి రమేష్. పరికిపండ్ల రమేష్. విశ్వనాధుల రమేష్. సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్. మాజీ పాలకవర్గ బృందం. ఆలయ కమిటీ సభ్యులు. గ్రామ ప్రజలు రాజకీయ పార్టీల కత్తితంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తద్వారా భక్తులకు ప్రజలకు పాలకవర్గానికి మధ్యాహ్నం భోజన సదుపాయాలు కల్పించిన ఆలయ కమిటీ భాగ్యస్వామ్యం. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఈరోజు ప్రమాణస్వీక కార్యక్రమంలో స్వామివారిని ప్రార్థించడం వేడుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా…

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి ని పురస్కరించుకొని,గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు,ప్రతి జిల్లాలో 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో,జిల్లాలోని 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,డిఇఓ వెంకటేశ్వర్లు ,నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా,ఎం పి పి ఎస్ రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా తమ విద్యా సేవలకు గాను,జిల్లా కలెక్టర్ డిఇఓ నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం జరిగింది.

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

సెంటర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల అధ్యక్షులు గోపాల శ్రీధర్ మాట్లాడుతూ..వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు.ఇప్పటికే చాలా కాలయాపన జరిగిందని, పీఆర్సీ సమయం దాటి రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటివరకు రావాల్సిన 5 డిఏ లను వెంటనే ప్రకటించాలని గోపాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని,పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ,ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహా యింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కర్, హరినాథ్, గోపాల్, రాహుల్ కుమార్, హరి సింగ్, సత్యనారా యణ,రఫీ భాష, శోభ, పద్మశ్రీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత…

మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన బొమ్మ బాబు మాతృమూర్తి బొమ్మ విజయ(63) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.తన మిత్రుడి తల్లి దశ దినకర్మ కి హాజరైన 2005 – 06 ఎస్ ఎస్ సి పూర్వ విద్యార్థులందరూ తోటి స్నేహితుడు బాబుకి రూ.20500 లు..ఆర్థిక సహాయం అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో మిత్రులందరు పాల్గొనడం జరిగింది.

గ్రామాలను అభివృద్ధి చేయాలి..మానవులంతా సమానమే..

గ్రామాలను అభివృద్ధి చేయాలి..మానవులంతా సమానమే..

ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య..

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామంలో సర్పంచ్ ల పాత్ర కీలకమని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సర్పంచ్ లు పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలలో ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామానికి సర్పంచ్ వెన్నుముక లాంటి వాడని, గ్రామ అభివృద్ధి సర్పంచ్ చేతిలోనే ఉంటుందన్నారు. భారతదేశంలో మానవులంతా సమానమేనని ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అందరు సమానమేనన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే బాటలో నడవాలన్నారు. స్థానిక ఎస్సై రాజేష్, డీఎస్డీఓ సింధు, డీబీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ తదితరులు ఉన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం…

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం

నేటి ధాత్రి అయినవోలు:-

 

సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాతో సత్కరించిన నాగుర్ల…

సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాతో సత్కరించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలో నూతనంగా ఎన్నికైన ఆరెకుల ముద్దు బిడ్డలు నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,వరికోల్ గ్రామ ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు లకు హనుమకొండ లోని భవాని నగర్ లో ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్ల ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేయడం జరిగింది.అనంతరం నూతన సర్పంచ్ మలహల్ రావు, ఉపసర్పంచ్ భుజంగారావు లను శాలువాతో సత్కరించి నాగూర్ల వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకటి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ ఆరెకుల యువ నాయకులు మోకిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యాలపై అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలన…

భక్తుల సౌకర్యాలపై అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలన
నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరం జాతర ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. దేవాలయ ఆవరణలో చేపట్టాల్సిన వివిధ పనులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్‌.ఐ. శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కిషోర్, దేవాలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, సిబ్బంది కిరణ్ కుమార్ పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు.

ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.

ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.
చందుర్తి, నేటిదాత్రి:

 

చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ (R. M. P) అత్యవసర సమయంలో 30వ సారి రక్తదానం చేశాడు. కనగర్తి గ్రామానికి చెందిన బాలలక్ష్మీకి అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నందువలన డాక్టర్ ఆనంద్ రెడ్డి హాస్పిటల్ లో
B poistive blood ని డొనేట్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు రక్తదానం చేసిన వనపర్తి సతీష్ ని గ్రామస్తులు అభినందించారు. అలాగే వనపర్తి సతీష్ మాట్లాడుతూ రక్తదానం అనేది అందరూ చేయాలని రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాలను కాపాడుతామని తెలియజేశారు.

error: Content is protected !!
Exit mobile version