బస్టాండుకు మోక్షం కలిగేనా….

బస్టాండుకు మోక్షం కలిగేనా…..?

“◆-: ఇబ్బందుల్లో ప్రయాణీకులు

“◆-: కన్నెత్తి చూడని ఆర్టీసీ అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు అస్తవ్యస్తంగా వయారైంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రజాప్రతిని ధులు, అధికారులు బస్టాండ్ నిర్మాణానికి పూనుకున్నారు. 1991 మార్చి 28న అప్పటి మంత్రి సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ బస్టాండు నిర్మాణం పూర్తి చేసు కున్న తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 1997 జూన్ నెలలో అప్పటి ఎమ్మెల్యే జంగల్ బాగన్న మెదక్ ఎంపీ స్వర్గీయ బాగారెడ్డి చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సు ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధులు అలసత్వం వల్ల బస్టాండు పూర్తిగా వాడుకలోకి రాలేదు. దీంతో బస్సులు బస్టాండ్లోకి రాకుండానే నేరుగా ఝురాసంగంలోని చౌరస్తా వద్ద బస్సులు

ఆటోలు నిలుపుతున్నారు.ఆర్టీసీ బస్టాండు ఉన్నప్పటికీ ఐస్టాండ్లోకి ప్రయాణికులు రాకపో వడంతో చౌరస్తా నుండే ప్రయాణీకులను తీసుకెళ్తున్నారు. బస్టాండ్ లో సరైన సదుపా యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బస్టాండ్ లో రెండు దురాణాలు, మరుగుదొడ్లు, బస్సులు నిలిచేందుకు స్టేజీలు, దాంతోపాటు కూర్చు నేందుకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. బస్టాండ్ లోకి బస్సులు వెళ్లకపోవడం, ఆర్టిసీ అధికారులు బస్టాండ్ వైపు కన్నెత్తి చూడకపో వడంతో బస్టాండ్ లోని రెండు దుకాణాల షటర్లు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.

వీటితోపాటు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన దిమ్మెలతో పాటు ఫోరింగ్ కు వేసిన శాబాద్ బండలను సైతం తీసుకెళ్ళారు. అయినప్పటికీ ఆర్టిసీ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించ డంతో బస్టాండ్ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పేరుకుపోయింది. గీత రెండు సంవత్సరాల క్రితం బస్టాండ్ ముందు ప్రైవేటు వ్యక్తులకు సిమెంటు స్తంబాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధి కారులు లీజుకి ఇచ్చినప్పటికీ బస్టాండ్ మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. చౌరస్తా వద్ద దుకాణాల సముదా యాలు ఉండడం వల్ల బస్సులు, ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుకుంది

ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం,

ఝరాసంగం బస్టాండ్ నిర్వహణ పై
జహీరాబాద్ డిపో మేనేజర్ స్వామి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితమే మహా శివరాత్రి పర్వదినం రోజున బస్టాండ్ ను శుభ్రం చేశామని, అక్కడికి బస్సులు వచ్చి పోతున్నాయని చెప్పడం గమనార్హం. బస్టాండ్ లోని రెండు దురా ణాల సముదాయాలకు సంబంధించి షట్టర్లు లేవని ఆడగగా తాము ఎప్పటిక ప్పుడు బస్టాండ్ ను పరిశీలిస్తున్నట్లు. తమతో పాటు తమ సిబ్బంది కూడా బస్టాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

-స్వామి, ఆర్టీసీ మేనేజర్

సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ…

సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో సిరిసిల్ల పట్టణం సాధించిన అవార్డులను మళ్లీ సాధించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛమైన, పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు…

చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

◆-: తెలంగాణ రాష్ట్రసెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఝరాసంఘం మండలం చీలపల్లీ గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గారీ కూతురు నవీత-సాయిరాం రెడ్డి గార్ల వివాహం న్యాల్కల్ ముంగి క్రాస్ రోడ్డు శ్రీఆదిలక్ష్మీ కళ్యాణ మండపం లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఝరాసంఘం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,ఉదయ్ శంకర్ పాటిల్,అశ్విన్ పాటిల్,హఫీజ్,జగదీశ్వర్ రెడ్డి,నర్సింహా యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి..

హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ను కోరారు. హద్నూరు గ్రామ శివారులో జరుగుతున్న 26వ ఉజ్జీవ కూటముల జాతరోత్సవాల్లో పాల్గొన్న ఎంపీకి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. మండలం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హద్నూర్ను మండల కేంద్రంగా ప్రకటిస్తే పరిసర గ్రామాలకు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. అలాగే హద్నూర్ రామతీర్థం, హద్నూర్ తాండాలకు చెందిన పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి, గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు.

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి…

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి

ఈనెల 18న దళిత మహాసభ విజయవంతం చేయండి

ఎం హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ తిక్కరాజు మాదిగ పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షల రూపాయలు పథకం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయ లో జరుగు దళిత మహాసభను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ తిక్క రాజు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో దళిత మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిక్క రాజు మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేవెళ్లలో జరిగిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షల రూపాయలు పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దళితులకు ఇచ్చిన హామీ ఏమైనాట్లని ప్రశ్నించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళితులకు దళిత బంధ పేరుతో 10 లక్షల రూపాయలు అందించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ పథకం అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారన్నారు ఎస్సీ కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ ల నియమించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే దళిత మహాసభ దళితులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టేవాడ సమ్మయ్య, తిక్క మల్లయ్య, రడపాక సారయ్య, మొలుగూరి సారయ్య, కార్తీక్, నర్సింహులు, విజయ్, రాజారాం, లక్ష్మీ, లావణ్య లు పాల్గొన్నారు.

ఆపదలో అండగా నిలిచిన మాధవి.. కన్నీళ్ల కుటుంబానికి ధైర్యం..

ఆపదలో అండగా నిలిచిన మాధవి.. కన్నీళ్ల కుటుంబానికి ధైర్యం..

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్.. దుఃఖంలో ఉన్న కుటుంబానికి మాధవి అండ..

కన్నీళ్ల మధ్య మానవత్వం.. బాధిత కుటుంబానికి మాధవి సహాయం..

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మికంగా దూరమైతే ఆ ఇంట్లో మిగిలేది కన్నీళ్లు… నిస్సహాయత మాత్రమే. అలాంటి దుఃఖంలో మునిగిపోయిన కుటుంబానికి ఓదార్పుగా నిలబడుతూ, “ప్రజాప్రతినిధి అంటే ఇదే” అని మరోసారి నిరూపించారు రామాయంపేట 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్. మాట ఇచ్చినప్పుడు మాత్రమే కాదు… ఆపద వచ్చినప్పుడు కూడా ప్రజలతోనే ఉంటానని చూపిస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.

 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని ఉప్పరి బస్తీకి చెందిన ముజరేకర్ నివాస్ ఈ నెల 15-02-2026న ప్రమాదవశాత్తు మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమవడంతో భార్యా పిల్లలు సహా కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ ఇంటి గడప దాటిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ కన్నీళ్లు… హృదయాల్లో బాధ మాత్రమే కనిపించింది.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన “ఆపద సంపద” హామీని నిలబెట్టుకుంటూ రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టసమయంలో అండగా నిలిచిన ఆమె చర్యకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధవి రమేష్ మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన బాధ్యత తనకు పదవి మాత్రమే కాదని, అది సేవ చేసే అవకాశం అని అన్నారు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ముందుండి సహాయం చేయడం ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లోనే ప్రజాప్రతినిధి నిజమైన బాధ్యత బయటపడుతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో అండగా నిలిచిన కౌన్సిలర్ మాధవి రమేష్ మానవత్వాన్ని చాటిన ఈ సంఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
మానవత్వమే పెద్ద రాజకీయమని… ఆపదలో చేయి అందించినవారే నిజమైన ప్రజా ప్రతినిధులని మరోసారి గుర్తు చేసింది ఈ ఘటన.

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

◆-: ఫిబ్రవరిలోనే సుర్రుమంటున్న సూర్యుడు

◆-: 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

◆-: రాత్రి పూటా పెరుగుతున్న టెంపరేచర్‌

◆-: అధికమవుతున్న కరెంట్‌ వినియోగం

◆-: వాతావరణ మార్పులతో వ్యాధులకు అవకాశం

◆-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర ఎకువగా రికార్డవుతున్నాయి. తేమ శాతం తగ్గడంతో జనం ఉకపోతతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈసారి అప్పుడే భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలో ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటలో 37 డిగ్రీలు, ఆలేరులో 36.9, బీబీనగర్‌, రామన్నపేటలో 36.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 20 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే రికార్డ్‌ అయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతున్నది.

మొదలైన ఏసీలు, కూలర్ల వాడకం

జిల్లాలో కరెంట్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. గత నెలలో రోజుకు 8 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వాడగా, ఇటీవల 9 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరులో 10 మిలియన్‌ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులకు ఆసారం..

చలి కాలం పోయి, వేసవి వచ్చేస్తున్నది. దీంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా దరి చేరే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, అతిసారం, నీళ్ల వీరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే ఆటలమ్మ(చికెన్‌ పాక్స్‌), కామెర్లు వచ్చే ఆసారం ఉంది. గవద బిళ్లలు, టైఫాయిడ్‌ , పొంగు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ద్రవ పదార్థాలు తీసుకోవాలి..

ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి

చలి కాలం ముగుస్తున్నది. వేసవి సమీపిస్తున్నది. కాలం మారుతుండటంతో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ రమ్య ఝరాసంగం మండల వైద్యాధికారి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు సాయంత్రం సంగారెడ్డి జిల్లా పారామెడిక్స్ ఆర్.ఎం. పి , పి.ఎం .పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్…

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్

 

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. నిన్న(ఆదివారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎమోషనలయ్యాడు. ఈ ట్రోఫీని ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ… ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. రాహుల్ భారత జట్టును ఈ స్థాయికి తీసుకువచ్చాడని, అలాగే లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఆటగాళ్లకు బలమైన మార్గాన్ని నిర్మించాడని గంభీర్ వివరించాడు. అదే విధంగా తాను సోషల్ మీడియాలోని జనాలకు కాదని, జట్టుకు మాత్రమే జవాబుదారీనని గంభీర్ పేర్కొన్నాడు. అందుకే జనాలు చేసే విమర్శలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక కోచ్ అనే వాడు తన జట్టు ఎంత గొప్పగా ఆడితే అంత గొప్పగా కనిపిస్తాడని, తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది ఆటగాళ్లేనని గంభీర్ అన్నాడు.

గని సమస్యలపై సిఐటియు వినతి పత్రం…

గని సమస్యలపై సిఐటియు వినతి పత్రం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గనిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికుల అందరి చేత మూడు షిఫ్ట్ లలో సంతకాల సేకరణ చేసి శనివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తుమ్మల రాజారెడ్డి కార్మికుల సహకారంతో ఐకే వన్ ఎ ఓసిపి మేనేజర్ కోటయ్యకి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ కట్టర్ సపోర్ట్ మెన్ లకు నాణ్యమైన బిట్లు ఇప్పించాలని రీకండేషన్ డ్రిల్ రాడ్స్ రాకుండా చూడాలని, షార్ట్ ఫైర్ కు రెగ్యులేషన్ ప్రకారము మూడు నెలలకు ఒకసారి కేబుల్ ను అందించాలన్నారు.మైన్ ఆవరణలో గల చర్మ రోగాలతో ఉన్న కుక్కలను వెంటనే ఇక్కడ నుండి తరలించాలని కోరారు.ఆర్ ఎల్ సి నిర్వహించిన రెండు సంవత్సరాల ఎన్నికల కాల పరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.కార్మికులు ఏ యాక్టింగ్ చేసినా కూడా వారి యొక్క జీతం చిట్టి లలో సి4 అని రావడం వలన కార్మికులకు ప్రమోషన్ రావడంలో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని ఏ యాక్టింగ్ అయితే ఆ యాక్టింగ్ కు సంబంధించిన క్యాటగిరిని మాత్రమే పొందుపరచాలని,కాలం చెల్లిన ఎస్ డి ఎల్ యంత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్త మెషిన్లను ఏర్పాటు చేసి కార్మికుల పని భారాన్ని తగ్గించాలని,సులబ్ కాంప్లెక్స్ కు వెళ్లడానికి కూడా సరియైన దారి ఏర్పాటు చేయాలని,మైన్ ఆవరణలో లైటింగ్ సౌకర్యం కల్పించాలని, షార్ట్ ఫైర్ కు కేబుల్ ను రెగ్యులేషన్ ప్రకారం ఇప్పించాలని, ట్రామర్లకు సరైన రెస్ట్ రూమ్ కల్పించి అందులో లాకర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యజమాన్యం మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని గెలిచిన సంఘాల అసమర్ధతను యజమాన్యం అలుసుగా తీసుకొని ఉత్పత్తిపై దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ ఎన్. వెంకట్రెడ్డి,బ్రాంచ్ నాయకులు కిషన్ రెడ్డి,నవీన్,ప్రశాంత్,కృష్ణ, అనిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు…

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

నర్సాపూర్ ప్రాంతంలోని అభ్యాస కిడ్స్ స్కూల్ లో శనివారం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యా భూషణ్ డాక్టర్ సుధతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ద్వారా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.పాఠశాలలు విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి వేదికలుగా నిలవాలని తెలిపారు.అనంతరం విద్యా,క్రీడా, ఇతర కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కవితా బాపురెడ్డి అభ్యాస కిడ్స్ ప్రిన్సిపల్ కవిత బాపిరెడ్డి,గౌరవ అతిథి రమణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

 

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది (Ahmedabad pitch conditions).

కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట (IND vs NZ final pitch analysis).

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక…

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రెటరీ అలీ లారిజానీ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ (Ali Larijani) తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ, ప్రజల రక్తం చిందినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సన్నిహితుల్లో ఒకరిగా అలీ లారిజానీకి పేరుంది.

అమెరికా సైనికులు కొందరు తమకు చిక్కారని కూడా అలీ లారిజానీ సంచలన ప్రకటన చేశారు. వారు ప్రస్తుతం జైళ్లల్లో ఉన్నారని అన్నారు. ఇరాన్ దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులే మరణించారంటూ ట్రంప్ ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఇరాన్ దాడుల్లో 500 మందికి పైగా అమెరికన్లు మరణించారని అన్నారు. సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. ఇరాన్ మోసాలు, అసత్య ప్రకటనలకు ఇది నిదర్శనమని పేర్కొంది.

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి…

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి

 

 

 

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

 ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.

లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం…

లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం

 

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట చిన్నారి ఫ్యాన్ వీడియోపై స్పందించింది.

ఇంటర్‌నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో అతి కొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. రిసెప్షన్‌కు కంటే ముందు విజయ్, రష్మికల జంట దేశ వ్యాప్తంగా అభిమానుల కోసం స్వీట్లు పంపిణీ చేసింది. విరోష్ టీమ్ ఎంపిక చేసిన పలు నగరాల్లో చిన్న చిన్న స్వీట్ బాక్స్‌లు పంచి పెట్టింది.

వైరల్ వీడియోపై స్పందించిన విరోష్

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ‘విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అయింది కదా.. అప్పుడు మనల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్లికి. ఫ్యాన్స్‌కు లడ్డూలు పంచారు.. అన్నదానం చేశారు. నేను కూడా ఫ్యాన్సే కదా.. మీరు కూడా రీల్సే చేస్తున్నారు కదా.. నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా.. పిలిస్తే ఏమైతుందంట. ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి.’ అని ఆ చిన్నారి అంది. ఈ వీడియో వైరల్‌గా మారి విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట ఈ వీడియోపై స్పందించింది. ‘బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు. అన్నీ ఇంటిలో చేపించి మంచిగా తిందాము’ అని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. ‘అయ్యో.. నీకు స్పెషల్‌గా ఇంట్లో చేపిద్దాం’ అంటూ ఇన్‌స్టాలో రష్మిక ఓ స్టోరీ పెట్టారు. ఓ చిన్నారి ఫ్యాన్ రిక్వెస్ట్‌పై విజయ్, రష్మిక స్పందించటం.. భోజనానికి పిలవటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఊరించే వరుగులు….

ఊరించే వరుగులు

 

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది. నీటిని పిండేసి, ముక్కల్ని ఎండలో ఒరగబెడ్తే బాగా ఎండుతాయి. లేదా, ఉప్పు వేసిన నీళ్లలో ఉడకబెట్టి నీటిని వార్చేసి ఎండబెడతారు. ఒరగబెట్టి ఎండించినవి కాబట్టి వరుగులు. ఈ ముక్కల్ని ఎండించే మేదరి తట్టని ‘దాగర’ (ప్రసేవం) అంటారు.

ఇప్పటి కాలంలో ‘డీప్‌ ఫ్రీజర్‌’లో ఉంచి ఫ్రోజెన్‌ చేసి కూరగాయల్ని అన్‌ సీజన్లో వాడు కునే సౌలభ్యం వచ్చింది. కానీ, మన పూర్వులు ఉప్పులో ఊరవేసి ఎండించి నిలవబెట్టుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఆహార కొరత రాకుండా చూసుకునే వాళ్లు. ఫ్రోజెన్‌ చేయటం కన్నా వరుగుల పద్ధతిలో ఎక్కువ పరిమాణంలో నిలవబెట్టుకోవచ్చు.

ఎండబెట్టిన ఒరుగులను ఒక రేకు డబ్బాలో పోసి, మూత బిగించి, అటకమీద భద్రపరుస్తారు, ఊష్మం ఎక్కువగా ఉండి ఫంగస్‌ పట్టకుండా ఉంటాయని! ఎండబెట్టే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, ఆమ్‌ చ్యూర్‌లా ఇతర కూరగాయల వరుగుల్ని కూడా వ్యాపార పరంగా తయారు చేసి అందించడానికి అవకాశం ఉంది

ఎండించినందువలన కూరగాయలు నీటి భాగాన్ని, కొంతవరకూ ‘సి- విటమిన్‌’ ని కోల్పోయినా, ఖనిజాలు, ఇతర విటమిన్లూ, పీచు పదార్థాలు (ఫైబర్‌) చాలావరకు నిలిచే ఉంటాయి. చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ వీటిని కొద్దిగా నూనె వేసి వేగించి వేపుడు కూరలు చేసుకుంటారు. కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి పప్పు, ఇగురు కూర, పచ్చడి కూడా చేసుకుంటారు. దప్పళం, పులుసు, సాంబారు ల్లోకి వరుగులు అనుకూలంగా ఉంటాయి. వరుగుల్ని, వడియాల్ని నూనెతో వేగించి పెట్టిన పచ్చిపులుసు రుచిగా ఉంటుంది. వరుగుల్ని మిక్సీ పట్టిన పొడితో సూపు కాచుకోవచ్చు, చారు కూడా కాచుకోవచ్చు.

వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకర, మామిడి, కామంచి, ఆదొండ, ఆగాకర, దోస, మిరప, టమాటా, ఆలు, పెండలం,కంద… వీటితో వరుగులు పెట్టుకుంటారు. ఈ వరుగులకి ఆ కూరగాయల లక్షణాలే ఉంటాయి. కాకపోతే ఆర్ద్రత (నీటి శాతం) కోల్పోయి శుష్కత్వం పొందుతాయి కాబట్టి, ఇవి శరీరాన్ని శుష్కింప చేస్తాయి. అందుకని డైటింగ్‌ చేసే వారికి అనుకూలం. శరీరంలో అదనంగా పేరుకున్న నీటిని పీల్చేసే గ్రాహి స్వభావం కలవి కాబట్టి, నీరుపట్టినవారికి వరుగులు మేలు కలిగిస్తాయి. నీళ్ళ విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. కఫాన్ని వేడినీ పోగొడతాయి. కానీ వాతాన్ని పెంచుతాయి. కీళ్లవాత రోగులు తక్కువ తినాలి.

ఆదొండకాయ వరుగులు వేడిని కలిగిస్తాయి. కాకర వరుగులు కఫాన్ని తగ్గిస్తాయి. గజ్జల్లో ఏర్పడే హెర్నియాని తగ్గిస్తుందని భోజన కుతూహలం పేర్కొంది. నేలములక కాయల తోనూ వరుగులు పెట్టుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. వాతవ్యాధుల్లో తినదగినవి.

తక్కువ ఖరీదులో కూరగాయలు దండిగా దొరికినప్పుడు వరుగులు పెట్టుకుంటే, ఎక్కువ ఖరీదుకి కూరలు కొనాల్సిన పరిస్థితి వచ్చిన ప్పుడు వాడుకోవటానికి ఉపయోగపడతాయి. మధ్యతరగతి మందహాసానికి వరుగులు ఒక సాక్ష్యం. మిగిలిపోతున్న, వడిలిపోతున్న, పండి పోతున్న కూరగాయల్ని పాడైపోకమునుపే పారేసే పరిస్థితి రాకుండా వరుగులుగా మార్చుకోవటం అనేది మన పూర్వులు పాటించిన ఆచారం. మన కాలానికీ అవసరమైన ఉపాయమే!

మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్….

మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్

 

మటన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రత్యేక వేడుకలు, పండుగలలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తారు. సరైన పదార్థాలు, సరైన విధానం పాటిస్తే హోటల్‌ స్టైల్ మటన్ బిర్యానీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: మటన్ బిర్యానీ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. ప్రత్యేక సందర్భాలు, పండుగలు లేదా కుటుంబ వేడుకల్లో ఎక్కువగా మటన్ బిర్యానీ తయారు చేస్తారు. హోటల్‌లో తినే రుచిని ఇంట్లోనే పొందాలంటే సరైన పదార్థాలు, సరైన విధానం పాటించడం చాలా ముఖ్యం. మరి ఇంట్లోనే రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు
  • మటన్ – 500 గ్రాములు
  • బాస్మతి బియ్యం – 2 కప్పులు
  • ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
  • టమాటాలు – 2
  • పెరుగు – 1 కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి – 4
  • కారం పొడి – 1 టీస్పూన్
  • పసుపు – అర టీస్పూన్
  • బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – 1 టీస్పూన్
  • పుదీనా ఆకులు – కొద్దిగా
  • కొత్తిమీర – కొద్దిగా
  • నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి లేదా నూనె – అవసరమైనంత
  • ఉప్పు – రుచికి సరిపడా
  • దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు – కొద్దిగా

తయారు చేసే విధానం

  • ముందుగా మటన్‌ను బాగా కడిగి ఒక పాత్రలో పెట్టాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి. కనీసం 30 నిమిషాలు మెరినేట్ అయ్యేలా ఉంచాలి.
  • బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిని వంపేయాలి.
  • కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు వండాలి. ఇప్పుడు మెరినేట్ చేసిన మటన్ వేసి కొంతసేపు వేయించాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మటన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  • మటన్ ఉడికిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. సరిపడా నీరు పోసి ఉప్పు చూసి కలపాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై బియ్యం పూర్తిగా ఉడికే వరకు వండాలి. ఆ తర్వాత కొద్దిసేపు దమ్‌లో ఉంచితే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది.
  • వేడివేడిగా మటన్ బిర్యానీని ఉల్లిపాయ, ఉడికించిన గుడ్లు లేదా సలాడ్‌తో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది.
  • ఇలా సులభంగా ఇంట్లోనే రుచికరమైన మటన్ బిర్యానీని తయారు చేసుకుని కుటుంబంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

ఇటీవల చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడుతున్నారు. అయితే ప్రతి ఛాతీ నొప్పి గుండె సమస్యకే సంబంధించినదిగా ఉండదు. మరి ఛాతీ నొప్పికి గుండెపోటు కాకుండా ఉండే ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చాలా మంది తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి వస్తే చాలామంది వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడతారు. కానీ వాస్తవానికి ఛాతీ నొప్పి రావడానికి గుండె సమస్య మాత్రమే కారణం కాదు.

రైతమ్మలకు జేజేలు..

రైతమ్మలకు జేజేలు

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. పొలాల్లో విత్తనాలు చల్లటం నుంచి, కుటుంబాన్ని నడిపించే దాకా… వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా మోస్తున్న ఎందరో రైతమ్మల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. నేడు (మార్చి 8) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొందరు మహిళా రైతుల విజయగాథలకు నీరాజనాలు పలుకుదాం…

ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండలం సొవ్వ, కరకవలస గ్రామాల్లో 45 మంది మహిళా రైతులు… 13 పురాతన దేశీయ వరి రకాలను సాగు చేయడంతో పాటు, కరకవలస గ్రామంలో గెడ్డ వాగు వరదలకు మునిగిపోకుండా తట్టుకునే 4 నుంచి 6 అడుగుల వరకు పెరిగే దేశీయ వరిని సాగు చేస్తున్నారు. ఇక్కడి కుటుంబాలకు ఎకరం నుంచి రెండు ఎకరాలకు మించి ఉండదు. ‘‘ఇవి దేవుడు ఇచ్చిన ధాన్యపు రకాలు అని మా నమ్మకం. బస్నా సోప్పూర్‌, బుడమ ధాన్యం, దేశీ పెద్దధాన్యం, దేశీ రాజముడి, ఎర్ర ధాన్యం, గుడుం ధాన్యం, ఇసుకరవ్వలు, జోజోర్కి ధాన్యం, మాస్టర్‌ ధాన్యం, నల్ల ధాన్యం, పసుపు సన్నాలు, సోర్‌ ధాన్యం, తేటం ధాన్యం ఇలా 13 రకాలు పండిస్తున్నాం.

error: Content is protected !!
Exit mobile version