టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్…

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్

 

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. నిన్న(ఆదివారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎమోషనలయ్యాడు. ఈ ట్రోఫీని ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ… ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. రాహుల్ భారత జట్టును ఈ స్థాయికి తీసుకువచ్చాడని, అలాగే లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఆటగాళ్లకు బలమైన మార్గాన్ని నిర్మించాడని గంభీర్ వివరించాడు. అదే విధంగా తాను సోషల్ మీడియాలోని జనాలకు కాదని, జట్టుకు మాత్రమే జవాబుదారీనని గంభీర్ పేర్కొన్నాడు. అందుకే జనాలు చేసే విమర్శలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక కోచ్ అనే వాడు తన జట్టు ఎంత గొప్పగా ఆడితే అంత గొప్పగా కనిపిస్తాడని, తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది ఆటగాళ్లేనని గంభీర్ అన్నాడు.

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

 

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది (Ahmedabad pitch conditions).

కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట (IND vs NZ final pitch analysis).
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version