హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి..

హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ను కోరారు. హద్నూరు గ్రామ శివారులో జరుగుతున్న 26వ ఉజ్జీవ కూటముల జాతరోత్సవాల్లో పాల్గొన్న ఎంపీకి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. మండలం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హద్నూర్ను మండల కేంద్రంగా ప్రకటిస్తే పరిసర గ్రామాలకు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. అలాగే హద్నూర్ రామతీర్థం, హద్నూర్ తాండాలకు చెందిన పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి, గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version