లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం…

లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం

 

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట చిన్నారి ఫ్యాన్ వీడియోపై స్పందించింది.

ఇంటర్‌నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో అతి కొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. రిసెప్షన్‌కు కంటే ముందు విజయ్, రష్మికల జంట దేశ వ్యాప్తంగా అభిమానుల కోసం స్వీట్లు పంపిణీ చేసింది. విరోష్ టీమ్ ఎంపిక చేసిన పలు నగరాల్లో చిన్న చిన్న స్వీట్ బాక్స్‌లు పంచి పెట్టింది.

వైరల్ వీడియోపై స్పందించిన విరోష్

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ‘విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అయింది కదా.. అప్పుడు మనల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్లికి. ఫ్యాన్స్‌కు లడ్డూలు పంచారు.. అన్నదానం చేశారు. నేను కూడా ఫ్యాన్సే కదా.. మీరు కూడా రీల్సే చేస్తున్నారు కదా.. నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా.. పిలిస్తే ఏమైతుందంట. ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి.’ అని ఆ చిన్నారి అంది. ఈ వీడియో వైరల్‌గా మారి విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట ఈ వీడియోపై స్పందించింది. ‘బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు. అన్నీ ఇంటిలో చేపించి మంచిగా తిందాము’ అని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. ‘అయ్యో.. నీకు స్పెషల్‌గా ఇంట్లో చేపిద్దాం’ అంటూ ఇన్‌స్టాలో రష్మిక ఓ స్టోరీ పెట్టారు. ఓ చిన్నారి ఫ్యాన్ రిక్వెస్ట్‌పై విజయ్, రష్మిక స్పందించటం.. భోజనానికి పిలవటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఊరించే వరుగులు….

ఊరించే వరుగులు

 

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది. నీటిని పిండేసి, ముక్కల్ని ఎండలో ఒరగబెడ్తే బాగా ఎండుతాయి. లేదా, ఉప్పు వేసిన నీళ్లలో ఉడకబెట్టి నీటిని వార్చేసి ఎండబెడతారు. ఒరగబెట్టి ఎండించినవి కాబట్టి వరుగులు. ఈ ముక్కల్ని ఎండించే మేదరి తట్టని ‘దాగర’ (ప్రసేవం) అంటారు.

ఇప్పటి కాలంలో ‘డీప్‌ ఫ్రీజర్‌’లో ఉంచి ఫ్రోజెన్‌ చేసి కూరగాయల్ని అన్‌ సీజన్లో వాడు కునే సౌలభ్యం వచ్చింది. కానీ, మన పూర్వులు ఉప్పులో ఊరవేసి ఎండించి నిలవబెట్టుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఆహార కొరత రాకుండా చూసుకునే వాళ్లు. ఫ్రోజెన్‌ చేయటం కన్నా వరుగుల పద్ధతిలో ఎక్కువ పరిమాణంలో నిలవబెట్టుకోవచ్చు.

ఎండబెట్టిన ఒరుగులను ఒక రేకు డబ్బాలో పోసి, మూత బిగించి, అటకమీద భద్రపరుస్తారు, ఊష్మం ఎక్కువగా ఉండి ఫంగస్‌ పట్టకుండా ఉంటాయని! ఎండబెట్టే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, ఆమ్‌ చ్యూర్‌లా ఇతర కూరగాయల వరుగుల్ని కూడా వ్యాపార పరంగా తయారు చేసి అందించడానికి అవకాశం ఉంది

ఎండించినందువలన కూరగాయలు నీటి భాగాన్ని, కొంతవరకూ ‘సి- విటమిన్‌’ ని కోల్పోయినా, ఖనిజాలు, ఇతర విటమిన్లూ, పీచు పదార్థాలు (ఫైబర్‌) చాలావరకు నిలిచే ఉంటాయి. చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ వీటిని కొద్దిగా నూనె వేసి వేగించి వేపుడు కూరలు చేసుకుంటారు. కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి పప్పు, ఇగురు కూర, పచ్చడి కూడా చేసుకుంటారు. దప్పళం, పులుసు, సాంబారు ల్లోకి వరుగులు అనుకూలంగా ఉంటాయి. వరుగుల్ని, వడియాల్ని నూనెతో వేగించి పెట్టిన పచ్చిపులుసు రుచిగా ఉంటుంది. వరుగుల్ని మిక్సీ పట్టిన పొడితో సూపు కాచుకోవచ్చు, చారు కూడా కాచుకోవచ్చు.

వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకర, మామిడి, కామంచి, ఆదొండ, ఆగాకర, దోస, మిరప, టమాటా, ఆలు, పెండలం,కంద… వీటితో వరుగులు పెట్టుకుంటారు. ఈ వరుగులకి ఆ కూరగాయల లక్షణాలే ఉంటాయి. కాకపోతే ఆర్ద్రత (నీటి శాతం) కోల్పోయి శుష్కత్వం పొందుతాయి కాబట్టి, ఇవి శరీరాన్ని శుష్కింప చేస్తాయి. అందుకని డైటింగ్‌ చేసే వారికి అనుకూలం. శరీరంలో అదనంగా పేరుకున్న నీటిని పీల్చేసే గ్రాహి స్వభావం కలవి కాబట్టి, నీరుపట్టినవారికి వరుగులు మేలు కలిగిస్తాయి. నీళ్ళ విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. కఫాన్ని వేడినీ పోగొడతాయి. కానీ వాతాన్ని పెంచుతాయి. కీళ్లవాత రోగులు తక్కువ తినాలి.

ఆదొండకాయ వరుగులు వేడిని కలిగిస్తాయి. కాకర వరుగులు కఫాన్ని తగ్గిస్తాయి. గజ్జల్లో ఏర్పడే హెర్నియాని తగ్గిస్తుందని భోజన కుతూహలం పేర్కొంది. నేలములక కాయల తోనూ వరుగులు పెట్టుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. వాతవ్యాధుల్లో తినదగినవి.

తక్కువ ఖరీదులో కూరగాయలు దండిగా దొరికినప్పుడు వరుగులు పెట్టుకుంటే, ఎక్కువ ఖరీదుకి కూరలు కొనాల్సిన పరిస్థితి వచ్చిన ప్పుడు వాడుకోవటానికి ఉపయోగపడతాయి. మధ్యతరగతి మందహాసానికి వరుగులు ఒక సాక్ష్యం. మిగిలిపోతున్న, వడిలిపోతున్న, పండి పోతున్న కూరగాయల్ని పాడైపోకమునుపే పారేసే పరిస్థితి రాకుండా వరుగులుగా మార్చుకోవటం అనేది మన పూర్వులు పాటించిన ఆచారం. మన కాలానికీ అవసరమైన ఉపాయమే!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version