ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు…

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

నర్సాపూర్ ప్రాంతంలోని అభ్యాస కిడ్స్ స్కూల్ లో శనివారం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యా భూషణ్ డాక్టర్ సుధతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ద్వారా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.పాఠశాలలు విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి వేదికలుగా నిలవాలని తెలిపారు.అనంతరం విద్యా,క్రీడా, ఇతర కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కవితా బాపురెడ్డి అభ్యాస కిడ్స్ ప్రిన్సిపల్ కవిత బాపిరెడ్డి,గౌరవ అతిథి రమణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version