వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..

వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

పరకాల నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురంకు చెందిన కుసుంబ మోతే రావు రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.రోజువారి లాగే ఏప్రిల్ 8న కూలి పనికి వెళ్తూ వడదెబ్బ తాకడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.కుటుంబ యజమాని మరణించడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.మోతే రావుకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు

కొన్నేళ్లుగా భయపేడు తున్న వేసవి ఎండల తీవ్రత

ఏప్రిల్ ,మే నెలలో మండే సూర్యుడి భగభగలు తెలిసిందే

ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు

శాయంపేట నేటిధాత్రి:

 

ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇలాంట ప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఇప్పటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది వేసవికాలం కావడంతో పిల్లలు బయటికి ఆడుకోవ డానికి వెళ్తుంటారు అలాంట ప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు బయటికి రాకుండా ఉండ డానికి తగు జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు. మామూలుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు వల్ల వడగాల్పులు వస్తుంటాయి దీనివల్ల శరీరంపై ఉన్న శ్వేతా రంధ్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకు రాకుండా ఉండిపోతుంది దీంతో శరీరంలో ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యి అస్వస్థతకు గురవుతారు. స్పృహ కోల్పో వడం వంటి జరుగుతుంది . నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరం చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

సరైన వైద్య నిపుణులను నియమించాలి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, పేరుకే 100 పడకల ఆసుపత్రి అని నాతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా గుర్తించలేదని, 30 పడకల ఆసుపత్రికి పరిమితమైందని, బడ్జెట్ విషయంలోనూ అదే విధంగా ఉందని, స్పెషలిస్టు డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనరల్ ఫిజీషియన్ కూడా లేరని, సరైన డాక్టర్లు,వైద్య పరికరాలు లేక జబ్బులతో వచ్చిన రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారని, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని, పలుమార్లు సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ 30 పడక ల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు తీసుకొని బడ్జెట్ను ఇప్పించాలని, ఆసుపత్రికి సరిపోయే సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని,24/7 గంటలు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని,టెక్నీషియన్ లను అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరొక గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించి ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సమస్యలను తెలుసుకుంటూ ఉండాలని, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం.

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజ్ పల్లి గ్రామంలో గురువారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని సుమారు 200 మందికి ఉచిత టాబ్లెట్లు అందించారు. అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి ముక్కు,గొంతు,థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు గట్టు ప్రశాంత్,ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాములు, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం డాక్టర్ అఖిలేష్,భవ్య,స్టాఫ్ నర్స్ లు అరుణ,ప్రవణి,ఫార్మా అంకిత,మార్కెటింగ్ మేనేజర్ ఎండి.మహమ్మద్,నాగప్ప, గ్రామస్తులు అంజయ్య,నక్క రవి,బోడపట్ల శ్రీనివాస్, హంసమ్మ,పాల్గొన్నారు.

కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం గ్రామ నీకి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు కల్లుగీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడటం జరిగింది. తోటి మిగతా కార్మికులు చూసి హాస్పిటల్కు తీసుకుపోగా సీరియస్ గా ఉన్నాడు వరంగల్కు తీసుకుపోవాలి తెలిపారు గార్డెన్ హాస్పిటల్ లో ఉన్నాడు ఈ ప్రమాదంలో గీతకార్మికుడైనా గడ్డమీది వెంకటేశ్వర్లు కి ప్రక్కటేముకలు,తొంటెముక, వెన్నుముక,భుజం ఎముకలతో పాటుగా కాలు కి గాయాలు కావడం జరిగింది.. నిరుపేద గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు.

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు అనే గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీది నుంచి జారి కింద పడగా తోటి కార్మికులు చూసి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించగా గాయాలు పరిస్థితి తీవ్రంగా ఉండడం వలన వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు..!

◆ నిషేధిత మందులు అంటగడుతున్న వైనం

◆ వందల నుంచి వెయ్యిలో దోపిడీ

◆ పట్టించుకోని సంబంధిత అధికారులు

◆ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Medical shop owners are looting poor people.

జహీరాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో ఆయా మండలాల మెడికల్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతలేని మందులను విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై జిల్లా ద్రగీ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. నిర్లక్ష్య ధోరణితో అనేక మెడికల్ షాపులు నిబంధనలను అతిక్రమించి నిషేధిత మందులు సైతం విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించిన మందులు, అబార్షన్ కిట్ లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పూర్తిగా వా ణిజ్యపరంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఏది ఎక్కువ లాభం తెస్తుందో ఆ మందులను రోగులకు అందిస్తున్నారు. ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత మందులు సైతం గుట్టుచ ప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబందిత అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహీరాబాద్ లో కొన్ని ఏజెన్సీలు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఉన్నా, మెడికల్ షాపులను తనిఖీ చేసిన దాఖలాలు కని పించడం లేదు. తనిఖీలకు భయపడాల్సిన మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. మందుల సర ఫరాలో పారదర్శకత లేక పోవడం, నాణ్యత లేని ఔషధాలను విక్రయించడాన్ని నియంత్రించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్రజలు వాపోతున్నారు.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్

#పాములకు పక్షులకు నివాసంగా!

#భయభ్రాంతులకు గురవుతున్న రోగులు

#కానరాని అధికారులు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది.

అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది.

వెల్ నెస్ సెంటర్ కి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.

Hospital

 

ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ చెట్ల తీగలతోభయంకరమైన చెట్ల తీగలతో ఉండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నామని ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఈ సమస్యపై అధికారులకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వ దావఖాన పట్టింతే లేకుండా పోయిందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం L.O.C మంజూరు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్. ఓ. సి మంజూరు

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి కృషితో

సిరిసిల్ల టౌన్(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలోని స్థానిక పోచమ వీధి లో నివాసం ఉంటున్న పెంటమ్ కవిత భర్త నర్సింగ్ అనారోగ్యరిత్య నిమ్స్ లో చేర్చడం జరిగింది. వారియొక్క అనారోగ్య పరిస్థితిని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. వారు వెంటనే స్పందించి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆది శ్రీనివాస్ నిమ్స్ లో వైద్యఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయిల ఎల్. ఓ. సి ని మంజూరు చెయ్యడం జరిగిందని తెలిపారు. 2,50,000 రూపాయలు ఎల్. ఓ. సి ని మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డికి పెంటమ్ కవిత భర్త నర్సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు కాలమానం ప్రకారం 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంటుందని అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరమని అన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి తెలుగు వారు షడృచులతో పచ్చడి తయారు చేస్తారు. భక్ష్యాలు అనే ప్రత్యేక పిండివంటలు తయారుచేసి కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకోవడం తెలుగు వారి ఆనవాయితి అని,ప్రతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునే గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,

టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,

సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,

రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే

TB disease

ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం.!

ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…

300 మందికి పైగా రోగులకు పరీక్షలు….

 

రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)

 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్ టి సీనియర్ మేనేజర్ కిషోర్ కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపికృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తాము రెడ్ క్రాస్ సంస్థతో కలిసి కంపెనీ పరంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామనీ వారు తెలియజేశారు..

Medical health camp

 

గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. రెడ్ క్రాస్ సంస్థ
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందించడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకొని ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించింది.. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య బృందంలో ఐశ్వర్యా రెడ్డి, రోనిత్ రెడ్డి, డాక్టర్ తేజస్వారి, కే అమూల్య రెడ్డి, శ్రేయ సింగ్,రమాదేవి, షాదిన్ మహాదీన్, లిఖిత, సుమానియాతో పాటు పనులు డాక్టర్లు ఉన్నారు.
ఈ వైద్య పరీక్షల్లో సుమారు 300 వందల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దంత పరీక్షలు, నరాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు, దగ్గు ,దమ్ము రోగులను డాక్టర్ల బృందం పరిశీలించిoది..
ఈ కార్యక్రమం లో మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి,మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,
కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వంగరి కైలాసం,సభ్యులు తోట శ్రీనివాస్ గుప్తా,వి. సతీష్ రావు తో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన.

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అధికారి రజిత మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలపైఅన్ని ప్రోగ్రాంలో పై రివ్యూ చేసి ఆరోగ్య మహిళ క్లినిక్ పై సంబంధించి హాస్పిటల్ కి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా చూడాలని రిజిస్టర్ను పరిశీలించి అన్ని ప్రోగ్రాములపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హార తీశారు ఇట్టి సందర్శనలు జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్ రజిత తంగళ్ళపల్లి వైద్యాధికారి డాక్టర్ అఫీజ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

టి బి వ్యాధి పై అవగాహనా..

టి బి వ్యాధి పై అవగాహనా కల్పించిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకొని,మండల వైద్యాధికారి రాయిని అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ముత్తారంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా ప్రజలకి క్షయ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి అనగా ఏమిటి, అది ఎలా సోకుతుంది, ఎవరికి సోకే అవకాశం ఉంది , క్షయ(టీబీ) సోకిన వారికి ఎటువంటి చికిత్స అందించబడుతుంది సమాజంలో టీబీ వ్యాధి యొక్క తీవ్రత మరియు దాని నివారణ మార్గాలు, మరియు ప్రపంచ టీబీ డే యొక్క ప్రధాన ఉద్దేశం, గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించినారు . దీనిలో భాగంగా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నను ప్రతిరోజు సాయంత్రము జ్వరం వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని మరియు టీబీ వ్యాధి పైన ప్రజలతో ఒక ప్రతిజ్ఞ చేయించారు టి బి సోకిన వారు భయపడవద్దని ప్రజలు టి బి వ్యాధి పై పూర్తి అవగాహనగా కలిగి ఉండి వారి యొక్క కుటుంబంలో తద్వారా సమాజంలో టీబీ వ్యాధి బారిన పడకుండా ఉండాలని ,తద్వారా ప్రతి గ్రామము టీబీ రహిత గ్రామంగా ఏర్పడాలని తెలియచేశారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఖమ్మంపల్లి మచ్చుపేట సెంటర్స్ లో లావణ్య ఎం ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి ఎం ఎల్ ఎచ్ పి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పై అవగాహనా కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ గ్రేసీ మనీ . సూపర్వైజర్ రమాదేవి ఏ నేమ్స్ స్రవంతి రమాదేవి సునీత ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ సుస్మిత ఏఎన్ఎం లో శృతి పుష్పలత మరియు ఆశ కార్యకర్తలు శశికళ లత రజిత కల్పన విజయలక్ష్మి జయ అల్లం స్రవంతి ప్రజలు పాల్గొన్నారు

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు.!

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు బలి..

మందుబాబులు ఇకనైనా మారండి..

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే.

ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్..

రామాయంపేట మార్చి 19 నేటి ధాత్రి (మెదక్)

Drunk driving

మద్యం తాగి వాహనాలునడిపితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. తాగే వారు మాత్రం తాగక మానడం లేదు. వాహనాలు నడిపేవారు మాత్రం నడపక మానడం లేదు. నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. అధికారులు వారు తగిన విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తాగి నడపడం మాత్రం మానుకోవడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ అధికారులు ఆదేశించిన ప్రయాణీకుల్లో మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాహనాదారులు మాత్రం తాగిన మైకంలో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైలుకు పోతున్న సందర్భాలు ఉన్న, ప్రయాణికుల్లో మాత్రం చలణం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగినడపడమే అని చాలామంది వాదిస్తున్న వారికి ఆలోచనలు మాత్రం రావడం లేదు. తాగిన మైకంలో ద్విచక్ర వాహనదారులు వారి ఇష్టాను రీతిలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారిపై వాహనాల జోరు పెరిగింది. విందులు, వినోదాల పేరుతో దైవదర్శనాలకు వెళుతూ వచ్చేవారు కొంతమంది అయితే, తాగినడిపేవారు ఎక్కువగా ఉన్నారు.

వాహనదారుల తీరు మారాల్సిందే..

Drunk driving

తాగి నడిపిన పాపానికి కేవలం మనమే ఒకరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీని ప్రభావం ఎన్నో కుటుంబాల పైన పడుతుంది. దీనితో వాహనదారులు సైతం తాగి వాహనాలు నడిపే ధోరణిని మానుకోవాలి, రామాయంపేట మండల ప్రాంతంలో తరచు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు మారితే అందరికీ మేలు కలుగుతుంది.

తాగి నడిపితే జైలు శిక్ష తప్పదు..
ఎస్సై బాలరాజు రామయంపేట.

మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడెక్కుతున్నారా అయితే మీకు జైలు శిక్ష తప్పదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిని కఠినంగా శిక్షించి జైలు శిక్షలు విధిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ న్యాయస్థానాలు కఠినంగా ఆదేశాలు జారి చేసిన వాహనదారుల్లో మాత్రం భయం ఏర్పడడం లేదు. ఇటీవలె మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకమైన వారి ప్రాణాలు బలిగొన్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, వారికి కోర్టుల్లో జరిమానాలు జైలు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. అయినా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం సేవించి రోడ్డుపై వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి మద్యం సేవించిన వారిని పట్టుకుని కేసులు చేస్తున్నాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version