టి బి వ్యాధి పై అవగాహనా కల్పించిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకొని,మండల వైద్యాధికారి రాయిని అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ముత్తారంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా ప్రజలకి క్షయ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి అనగా ఏమిటి, అది ఎలా సోకుతుంది, ఎవరికి సోకే అవకాశం ఉంది , క్షయ(టీబీ) సోకిన వారికి ఎటువంటి చికిత్స అందించబడుతుంది సమాజంలో టీబీ వ్యాధి యొక్క తీవ్రత మరియు దాని నివారణ మార్గాలు, మరియు ప్రపంచ టీబీ డే యొక్క ప్రధాన ఉద్దేశం, గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించినారు . దీనిలో భాగంగా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నను ప్రతిరోజు సాయంత్రము జ్వరం వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని మరియు టీబీ వ్యాధి పైన ప్రజలతో ఒక ప్రతిజ్ఞ చేయించారు టి బి సోకిన వారు భయపడవద్దని ప్రజలు టి బి వ్యాధి పై పూర్తి అవగాహనగా కలిగి ఉండి వారి యొక్క కుటుంబంలో తద్వారా సమాజంలో టీబీ వ్యాధి బారిన పడకుండా ఉండాలని ,తద్వారా ప్రతి గ్రామము టీబీ రహిత గ్రామంగా ఏర్పడాలని తెలియచేశారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఖమ్మంపల్లి మచ్చుపేట సెంటర్స్ లో లావణ్య ఎం ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి ఎం ఎల్ ఎచ్ పి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పై అవగాహనా కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ గ్రేసీ మనీ . సూపర్వైజర్ రమాదేవి ఏ నేమ్స్ స్రవంతి రమాదేవి సునీత ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ సుస్మిత ఏఎన్ఎం లో శృతి పుష్పలత మరియు ఆశ కార్యకర్తలు శశికళ లత రజిత కల్పన విజయలక్ష్మి జయ అల్లం స్రవంతి ప్రజలు పాల్గొన్నారు