పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు..!

◆ నిషేధిత మందులు అంటగడుతున్న వైనం

◆ వందల నుంచి వెయ్యిలో దోపిడీ

◆ పట్టించుకోని సంబంధిత అధికారులు

◆ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Medical shop owners are looting poor people.

జహీరాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో ఆయా మండలాల మెడికల్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతలేని మందులను విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై జిల్లా ద్రగీ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. నిర్లక్ష్య ధోరణితో అనేక మెడికల్ షాపులు నిబంధనలను అతిక్రమించి నిషేధిత మందులు సైతం విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించిన మందులు, అబార్షన్ కిట్ లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పూర్తిగా వా ణిజ్యపరంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఏది ఎక్కువ లాభం తెస్తుందో ఆ మందులను రోగులకు అందిస్తున్నారు. ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత మందులు సైతం గుట్టుచ ప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబందిత అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహీరాబాద్ లో కొన్ని ఏజెన్సీలు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఉన్నా, మెడికల్ షాపులను తనిఖీ చేసిన దాఖలాలు కని పించడం లేదు. తనిఖీలకు భయపడాల్సిన మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. మందుల సర ఫరాలో పారదర్శకత లేక పోవడం, నాణ్యత లేని ఔషధాలను విక్రయించడాన్ని నియంత్రించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్రజలు వాపోతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version