లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌.

స‌డ‌న్‌గా ఓటీటీకి.. లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌

 

 

 

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఓ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది

నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా వాస్త‌వ‌ ‘హ‌ర్ర‌ర్’ ఘ‌ట‌న‌ల‌తో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam).

అమర్ కామెపల్లి (Amar Kamepalli) దర్శకత్వం వహించగా ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి  కీలక పాత్రల్లో న‌టించారు.

 

ఎం.సి రాజు నిర్మాత.

 మే31న‌ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప‌ట్ప‌టికీ ప్ర‌చార లోపం వ‌ళ్ల జ‌నాల‌కు చేర‌లేక పోయింది.

 

బేబీ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను నిర్మించిన ఎస్ కేఎన్ మారుతితో క‌లిసి

ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం విశేషం.

అయితే ఇప్పుడీ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న తండ్రి కోరిక మేర‌కు మెడిస‌న్ చేస్తున్న కౌశిక్ ఇంట్రొవ‌ర్ట్‌.
బాగా పిరికిత‌నం, అంత‌కుమించి భ‌య‌స్తుడు కావ‌డంతో ఎవ‌రు స్నేహం చేయ‌రు. పైగా హేళ‌న చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు.
అయితే కౌశిక్ త‌న క్లాస్‌మేట్‌ను ల‌వ్ చేస్తుంటాడు గానీ త‌ను వేరే అత‌నితో ప్రేమ‌లో ఉంటుంది.
అయితే త‌న ప‌రిస్థితిని, త‌న పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాడు.
ఏ శ‌క్తులు వెంటాడుతున్నాయ‌ని ఫీల్ అవుతుంటాడు.
అదే స‌మ‌యంలో అప్ప‌టికే చ‌నిపోయిన ఘ‌టికాచ‌లం అనే వ్య‌క్తి వాయిస్ వినిపిస్తూ కౌశిక్‌ను కంట్రోల్ చేస్తుంటుంది.
ఈ నేప‌థ్యంలో హీరో ఆ స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, ఇంత‌కు త‌న‌ను వెంబ‌డించేవి, ఆత్మ‌ల‌, ఇంఏమైనా ఉన్నాయి, ఘటికాచ‌లం ఎవ‌రు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

నిర్మాత రాజు నిజ జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల అధారంగా రెడీ చేసుకున్న‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన

 

ఈ సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు ఓ ఢిప‌రెంట్ చిత్రం చూస్తున్నామ‌నే ఫీల్‌ ఇస్తుంది.

 

అక్క‌డ‌క్క‌డ లాగ్ ఉన్న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు పిల్ల‌లతో స‌రిగ్గా లేక‌పోతే ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌నే అంశంతో మంచి సోష‌ల్ మెసేజ్ అందించారు.

హ‌ర్ర‌ర్‌, సైక‌లాజిక‌ల్ సినిన‌మాల‌ను ఇష్ట‌ప‌డేవారు ఒక‌సారి ఈ మూవీని చూడ‌వ‌చ్చు.

 

ఇప్పుడీ ఘటికాచలం’ (Ghatikachalam).

 

సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో క‌లిసి చూడ‌వ‌చ్చు.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version