ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

జడ్చర్ల : పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

 

జడ్చర్ల /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం డీసీసీ కార్యాలయంలో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మినహా .. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్, ఉర్కొండ, జడ్చర్ల, నవాబుపేట మండలాల అధ్యక్షులు హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం వ్యక్తిగత కారణమా.. పార్టీపై అలక? అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గాండ్ల ఓదెలు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఓదేలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, గుండ్రపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ మండల నాయకులు రావుల మైపాల్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, కనపర్తి రమేష్, ఇటికల సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట:

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి:

సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

నేర్మట గ్రామపంచాయతీ, బస్టాండ్ ముందుమురికి కాలువ సరిగ్గా లేకపోవడంతో మురికి కాల్వ యందు ఈగలు, దోమలు ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారంచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతకాలంగా గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలలో పలు వార్డులలో గతంలో సిసి రోడ్లు వేసినారు గాని ఆ రోడ్లు వర్షం వస్తే గుంతల మయంగా మారుతుందని, మురికి కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, గొల్లగూడెం, బంగారిగడ్డ, లెంకలపల్లి, శేరి గూడెం, ఈ గ్రామాలకు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అధికారులు గ్రామాలలో ఇప్పటికప్పుడు సమాచారం తీసుకోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బల్లెం వెంకన్న,ఈరగట్ల నరసింహ, బొమ్మరగోని యాదయ్య, దాసరి రాములు, నారపాక నరసింహ, శంకర్, గ్రామ ప్రజలు బొమ్మరగోని నాగరాజు,సతీష్,బుర్కల నవీన్, బొడిగె నగేష్, బుర్కల సైదులు, రావుల రవి, పగిళ్ల స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్బంగా శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరాభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని, ముస్లిం సోదరులు నెలరోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా దయతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాసన్ని విరమింప చేశారు.

Iftar dinner

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తాంజిమ్,మాజి పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్,డి ఆర్ యు సిసి మెంబర్ షేక్ ఫరీద్ , మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , పాక్స్ చైర్మన్ మచెందర్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,న్యాల్కల్ మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,మాజి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.

Iftar dinner

సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. మసీద్ లభివృద్ధిపై మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.

మసీదుల అభివృద్ధికి, ఆలయాల నిర్మాణాల స్థలాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని మత పెద్దలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డాక్టర్ సలీం, లాడెన్, పట్టణంలోనీ ముస్లిం మత పెద్దలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, ఎన్నికల్లో గెలుపు కోసం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, గోనె రాజేందర్, గాజుల చంద్ర కిరణ్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ అర్ధరాత్రి విద్యార్థులపై నిర్భందఖాండ అమలు చేస్తున్నదని శనివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. జహీరాబాద్ లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్వీ నాయకులు రాకేష్, ఓంకార్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

అక్రమ అరెస్టులను సహించేది లేదు…

అక్రమ అరెస్టులను సహించేది లేదు బిఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టుల అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు త్వరలో బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
మధుసూదన్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్ అరెస్టయ్యారు

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి…

– చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే

– అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

– 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది

– ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు

– ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం

– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

 

మంథని:- నేటి ధాత్రి

 

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్‌బాబుకు కల్పించిన మంథని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఆయన మొండి చేయి చూపించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.

శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో కుటుంబం, బంధువులు లేని మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40ఏండ్లు అవకాశం కల్పించారని,

ఈనాటి మంత్రికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గానికి బడ్జెట్‌లో ఒక్కరూపాయి కేటాయించకపోగా ఈప్రాంత ప్రజలకు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహరం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషదమూలికలు లభించే రామగిరి ఖిల్లాను అభివృధ్ది చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృధ్దికి ప్రాధాన్యత ఇస్తానని మెడికల్‌ కళాశాల తీసుకువస్తానని హమీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వం రాగా సీఎం రేవంత్‌రెడ్డి తన నియోకవర్గానికి మెడికల్‌కళాశాల తీసుకువెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్‌కళాశాలను మంజూరీచేయించలేక పోయారని ఎద్దేవా చేశారు.

పోతారం లిఫ్ట్‌ అయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందుతుందనే ఆలోచనతో ఆనాడు సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఆనాడు ప్రతిపాదనలు కూడా చేశామని ఆయనగుర్తు చేశారు.

కానీ మంత్రిగా పోతారం లిఫ్ట్‌ గురించి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరంను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి హోదాలో మాట్లాడి ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరణ చేయలేదన్నారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులను వాడుకుంటున్నాడే తప్ప ఈ నియోజకవర్గంలో 80శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయడం లేదని, వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదని విమర్శించారు.

బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే బదనాం చేసి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే ఉండే మంత్రి వంత పాడకుండా ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారేది కాదన్నారు.

కేవలం ఇసుక దందాను కొనసాగించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు.

అయితే ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్‌ అని ప్రకటించారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.

ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్వయంగా తమకు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదంటూ మాట్లాడిన తీరు రాష్ట్ర పరువు పోయిందని ఆయన అన్నారు.

అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీడియాపై అక్కసు వెల్లబోసుకున్న ముఖ్యమంత్రి బట్టలూడదీసి కొడుతానని మాట్లాడుతుంటే మంథనిలోమాత్రం మంత్రి ప్రెస్‌క్లబ్‌లను ఏర్పాటు చేయిస్తున్నాడని, దేశంలో ప్రెస్‌క్లబ్‌లకు పార్టీలను అంటగట్టిన చరిత్ర మంత్రికే దక్కిందన్నారు.

మంథని ఎమ్మెల్యే ఎప్పుడు అదికారంలో ఉంటే అప్పుడు కొత్త పద్దతులను చూపించే అలవాటు నాటి నుంచే ఉందన్నారు.

ఆనాడు మంత్రి తండ్రి సైతం ప్రజలను హింస ఏవిధంగా పెట్టాలే, నక్సల్స్‌ పేరుమీద ఎలా మట్టుబెట్టాలనే కొత్త పద్దతులు అవలంబిస్తే ఈనాడు మంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టాలని చూశాడన్నారు.

మనలోమనకు వైషమ్యాలు పెంచి దాన్ని వాడుకుని గొప్పగా వర్థల్లాలనే చూస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐటీ మంత్రిగా పది మందికైనా ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతూనే ఉన్నామన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కుటుంబానికి ఇన్నేండ్ల అవకాశం కల్పిస్తే కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.

రెండుసార్లు మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంథని ప్రాంత అబివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆనాలోచిత విధానాలతో గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లోని పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.బీద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చేస్తామన్నారు.

అనంతరం మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో 23న కరీంనగర్ లో జరిగే భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం గురించి నాయకులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిశా నిర్దేశం చేశారు

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

 

#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.

 

#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.

 

#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు

రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల

కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు.!

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర నాయకులు జన్నె మొగిలి మాతృమూర్తి జన్నె దుర్గమ్మ మధ్యాహ్నం మృతి చెంది నాట్లు తెలియగానే వచ్చి వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిషిధర్ రెడ్డి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం యుగదీశ్వర్ రాష్ట్ర నాయకులు బట్టు రవి గణపురం బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు భాస్కర్ రావు రామచంద్ర రావు సోమా దామోదర్ దుప్పటి భద్రయ్య మంద మహేష్ దుగ్గిశెట్టి పున్నం చందర్, భూక్యా హరిలాల్, మాదాసు మొగిలి, పెండ్యాల శ్రీకాంత్ వేణు రావు రాజు శివరాత్రి వేణు, రాకేష్ రెడ్డి శాస్త్రాల తిరుపతి తదితరున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version