మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.

Iftar dinner

సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. మసీద్ లభివృద్ధిపై మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.

మసీదుల అభివృద్ధికి, ఆలయాల నిర్మాణాల స్థలాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని మత పెద్దలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డాక్టర్ సలీం, లాడెన్, పట్టణంలోనీ ముస్లిం మత పెద్దలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version