ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ.!

ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ఈద్గలో ముస్లిం మైనారిటీ తో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అనంతరం మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలాగే బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ విద్యార్ధిని విద్యార్థుల కోసం వారి చదువుల అభ్యున్నతికోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు నిర్మాణం చేశారు. ప్రతి రంజాన్ పండుగకు అందరికీ దుస్తువులు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఇచ్చేవారు అంతే కాకుండా వారి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు అదంతా మీరు కళ్లారాచూశారు కనివిని ఎరుగని రీతిలో అన్నింటా పురోగతి సాధించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ముందుకు నడిచారు మన జిల్లా కేంద్రంలోని నా వంతు పాత్ర పోషించి గతంలో మీ కోసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటానో మీరు చూశారు… రానున్న మన బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పెదవారికోసం అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తాం అని తెలుపుకుంటూ నెల రోజుల నుండి ఎంతో భక్తిపవిత్రతతో పెద ధనిక అని అని బిన్న అభిప్రాయాలు లేకుండా మంచి మనస్తత్వంతో ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఓకె దగ్గర ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి పాల్గొని మిమ్మల్ని కలిసిందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరొక్క మారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తెలిపారు

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి పంచాంగశ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుం దని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండు తాయని ఆహారధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి, ఏంశెట్టి ప్రభాకర్ నల్లెల్లవిజేందర్ ,గాదే రాజేందర్, బాసని చంద్రమౌళి దిండిగాల వంశీ, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు

@ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

 

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

ముస్లింలకు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్ కావడంతో నెక్కొండ లోని ముస్లిం సోదరులు నెక్కొండ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ముస్లిం సోదరులతో అలైబాలై తీసుకుంటూ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెల రోజుల నుండి ఉపవాసం ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత పవిత్రతో జరుపుకునే పండగ రంజాన్ పండగని ఈ రంజాన్ పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అలాగే ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని పాడిపంటలతోని ఆ అల్లా కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల మహేష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కీ అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, రామాలే కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, తాళ్లూరి నరసింహస్వామి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సింగం ప్రశాంత్, ముస్లిం సోదరులు రఫీ, మహమ్మద్ అమీర్ , మహమ్మద్ హమీద్, ఎండి అన్వర్ పాషా, యాకుబ్ పాషా, ఇబ్రహీం, ఎండి అఫ్జల్, సలీం, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని జర్నలిస్టులు వార్తలకే పరిమితం కాకుండా సామాజిక సేవ చేయడం అభినందనీయమని అలాగే పాత్రికేయులు కీర్తిశేషులు మాస్ రాజయ్య రామ్ రెడ్డి స్మారకార్థం ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు, ఈ చలివేంద్రానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య, జర్నలిస్టులు రమేష్ రామచంద్ర మూర్తి, రవితేజ, సత్యం , రాజశేఖర్, కట్కూరి శ్రీనివాస్, బుర్ర రమేష్ రాజమౌళి,బొల్లరాజేందర్, సరిగొమ్ముల రాజేందర్ ,రంగన్న సంపత్, తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం జిల్లా నాయకులు

చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని ఆయన స్వగృహంలో మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసినారు.

ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మేర కులానికి అందవలసిన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా, నియోజకవర్గంతో పాటు మండల కేంద్రంలో మేరు సంఘ భవన నిర్మాణంతోపాటు జనగాం జిల్లాలోని మేరు కుటుంబాలకు జూకి మిషన్లు అందించాలన్నారు.

దీంతోపాటు ఇల్లు లేని మేరు కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాలోని మేరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మేర సంఘం కమిటీ సభ్యులు పేర్కొంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమోరండం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు దీకొండ మురళి, కార్యదర్శి వెన్ను సంపత్, కోశాధికారి సోమ రాజేందర్, పట్టణ అధ్యక్షులు దీకొండ సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు గూడూరు నరేందర్,రాపర్తి సుధాకర్, మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు రాపర్తి ప్రశాంత, కొత్తకొండ అజయ్ కుమార్,దీకొండ విష్ణు తో పాట లింగాల గణపురం, రఘునాథ్ పెళ్లి, జఫర్గడ్, చిల్పూర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే గారి తనయుడు,యువ నాయకులు మిథున్ రాజ్,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,నాయకులు నరేష్ రెడ్డి ,అశోక్ రెడ్డి ,విజయ్ రాథోడ్ నిఖిల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

BRS leaders

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా అనంతరం మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,మొహిద్దిన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, సీనియర్ నాయకులు కలిమ్, జుబేర్ ,నాయకులు కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని ప్రార్థించడం జరిగింది.

కొత్త సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల సమరం!

కొత్త సంవత్సరం.. స్థానిక సంస్థల ఎన్నికల సమరం!

పార్టీల మధ్య గట్టిపోటీ!

శాయంపేట నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్తును తేల్చనుంది మండలంలో గల అన్ని గ్రామాల్లో సర్పంచ్ ,వార్డు నెంబర్, మరియు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరుగు తాయి. కాబట్టి రాజకీయ నాయకులు ప్రజాసేవకై ఆసక్తి ఉన్నవారు దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది ప్రజాప్రతి నిధులకు ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఈ విషయంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సర్పంచ్ ఈసారి నిలబడడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. ఇంకా ఎవరెవరు ఎన్నికల బరిలో నిలబడడానికి ఆసక్తిగా ఉన్నారో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే పలువురు పేర్లు వినబడు తున్నాయి. వారిలో ఎవరికీ చాన్స్ లభిస్తుందని సీక్రెట్ గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రజల్లో తన పట్ల ఏ విధంగా ఉందో సర్వేలు చేసుకుని, తనమీద పూర్తి నమ్మకం అనేది ఏవిధంగా ఉందో తెలుసుకుం టున్నారు. పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చు అయితే పర్వాలేదు కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలువాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు ఇంకొందరు అయితే ఏమా ఏమీలుసైతం ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు గ్రామాల్లో మంచి పేరు కోసం పలు కార్యక్రమాలలో పాల్గొంటు న్నారు.

పార్టీల మధ్య గట్టి పోటీ!

ఇదివరకు ఎన్నడి లేని విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతం గా జరిగే ఎన్నికలు ఎప్పుడైనా పరోక్షంగా మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొం ది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు సంఖ్య ఎక్కువగా ఉండటం ఈసారి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులకు నిలబెట్టడంలో పార్టీ అనుకున్నది ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికి పలువురు ఆశావా దులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తమ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ మద్దతు తన వారికి వచ్చే విధంగా చూడాలని కోరుతు న్నారు అధిష్టానం పెద్దల సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై చాలా నుంచి పోటీకి సిద్ధమవు తున్నారు రాజకీయంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు బ్రహ్మరథం పడుతున్నారు వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయం అవసరమైన ఉద్దేశంతో పలువురు సర్పంచులు బరిలో నిలబడుతున్నారు.

పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.

17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన
ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ 

సిరిసిల్ల టౌన్  ( నేటి దాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో
హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది.
41 సంవత్సరాల 4 నెలలు పోలీస్ వృత్తిలో విధులు నిర్వహించారు. ఇతను 2023 లో పోలీస్ పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమండెంట్ శ్రీ M.I. సురేష్ గారు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో పనిచేసి పదవి విరమణ చేస్తున్న ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ
గారికి అభినందనలు తెలియజేశారు. కర్తవ్యం నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగం చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో కుటుంబసభ్యుల బాధ్యత ఎంతో ఉంటుందని , రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందముగా గడపాలని సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని , వీలైతే సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు .రిటైర్ మెంట్ డబ్బును భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. పోలిస్ శాఖ తరుపున అందాల్సిన ఇతర ప్రయోజనాలు అన్ని త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్
శ్రీ సాంబశివరావు గారు ,RI & RSI లు మరియు బెటాలియన్ సిబంది పాల్గొని వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

 

రామాయంపేట మార్చ్ 31 నేటి ధాత్రి (మెదక్)

 

మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు.
అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యులను ఆదుకునేదేవరు.?

అభాగ్యులను ఆదుకునేదేవరు.?

పగలు చెట్ల కింద.. రాత్రిదుకానాలవద్ద.

మెదక్ జిల్లాలో 200కు పైగా నిరాశ్రయులు.

పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

రామాయంపేట డిసెంబర్ 31 నేటిధాత్రి (మెదక్)

వారు ఎవరికి పట్టని అభాగ్యులు..
అనారోగ్యంతో కొందరు, మతిస్థిమతి లేక మరికొందరు ఏ ఆసర లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపు నిండేది.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఏ ఆశ్రయం లేక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక..
పగటిపూట చెట్ల కింద, రోడ్ల పైన.. రాత్రి అయితే దుకాణాల అరుగుల మీద సేదతీరుతున్న వీరిని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం మెదక్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అనాధలు నిరుపేదలు సుమారు వందమందికి పైగా ఉంటారని అంచనా. రోడ్ల వెంట బస్టాండు చర్చి పలు దేవా దేవాలయాల పరిసరాల్లో వీరు సంచరిస్తుంటారు. ఇండ్లు ఓటర్ల వెంట తిరిగి ఎవరైనా దయతలిచి అన్నం పెడితే కడుపు నింపుకుంటారు. లేదంటే పస్తులు తప్పవు. రాత్రి వేళల్లో పలువురు దాతలు అన్నం ప్యాకెట్లు అందిస్తారు దీంతో ఆ పూట గడుస్తుంది. మరుసటి రోజు ఎవరైనా దయతలస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆలన పాలన చూసేవారు లేక చాలామంది అభాగ్యులు వానకు నాన్నతో ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.

బల్దియాదే బాధ్యత..

Municipal officials.

అనాధలు నిరాశ్రయులకు జీవించే హక్కు కనిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పట్టణాలు నగరాల్లో రాత్రి బస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రతి కేంద్రంలో నీరు ఆహారం మరుగుదొడ్లు పడుకునేందుకు వసతి కల్పించాలని సూచించింది. వీటిని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అనాధలకు ఆవాసం కల్పించి వారికి ఇంత తిండి పెట్టించాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీలదే.
పట్టణంలో ఎక్కడో ఒకచోట వారికి ఆవాసం ఏర్పాటు చేసి వారు ఉండటానికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆకలి తీర్చాలి. అయితే ఏ ఆశ్రయం లేక రోడ్లమీద దుకాణాల వద్ద సేద తీరుతున్న వీరిని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులైన స్పందించి అనాధలు అభాగ్యుల గురించి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నామమాత్రంగా పునరావాస కేంద్రం.

Municipal officials.

జిల్లా కేంద్రమైన మెదక్లో అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు పట్టణానికి దూరంగా ఉన్న పిల్లి కొట్టాల్ వద్ద పునారావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే అందులో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు కూడా మున్సిపల్ అధికారులకు తెలియదు. అసలు ఆ సెంటర్ పనిచేస్తుందా లేదా అనేది కూడా సమాచారం ఇవ్వలేని దుస్థితిలో అధికార గణనం ఉంది. ఈ విషయమై మెదక్ మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ రెడ్డిని కోరగా తనకు పూర్తి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు

దుకాణాల ముందు ఇలా..

ఏ ఆశ్రయం లేని వారికి దుకాణాల ఆవరణలు చెట్లే దిక్కవుతున్నాయి. రాత్రివేళ వ్యాపారులు తమ వ్యాపారాలను ముగించుకొని దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోగానే అనాధలు అభాగ్యులంతా ఆ దుకాణాల వద్దకు చేరుకుంటారు. అక్కడే అరుగుల మీద నిద్రకు ఉపక్రమిస్తారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేట తూప్రాన్ పట్టణాల్లో ఊరికి దూరంగా చెట్ల కింద చిన్నపాటి తాడిపత్రిలతో నివాసం ఏర్పాటు చేసుకుని ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఉన్నారు.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటి ధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.

Congress

 

ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.

వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

Congress

అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.

లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్.

 

 జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీమంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణం లోని ఈద్గా లో రంజాన్ వేడుకల్లో పాల్గోన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారాక్ అంటు శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు ఉగ్గేల్లి రాములు పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ….

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఈద్గా ప్రాంతంలో సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినంలో భాగంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…

Muslim

రంజాన్ పండుగ మతసామరస్యానికి,సుహృ ద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ధాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రార్థనలో భాగంగా ముస్లింలు అందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలలో ఉంటారని తెలిపారు. చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈద్గా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు, యాకుబ్ ఆలీ,డాక్టర్ సలీం, లాడెన్, ఎం డి పాషా, ఖలీం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, ధీకొండ శ్యాం గౌడ్,శ్రీనివాస్, గోపతి భానేశ్, సత్యపాల్, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి

సన్మానం చేసిన ఆలయ అయ్యలూరి రగునాథం శర్మ

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగం శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి పాల్గొన్నారు .

Temple

 

సందర్భంగా ఆలయ ఆలయ చైర్మన్ అయ్యలు రఘునాథ శర్మ చిన్నారెడ్డిని శాలువతో సన్మానించారు ఆలయ పూజారులు ఆశీర్వదించారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు గంధం నాగరాజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి పంచాగ కర్త నాగరాజు సిద్దాoతి ని ఆలయ చైర్మన్ అర్చకులను శా లువతో సన్మానించారు

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్.

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్

 

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్ విజయం సాధించారు..ఈ సందర్బంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో &వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక తిరుమల ఫోటో స్టూడియో మందమర్రి పాత బస్టాండ్ లో శాలువా తో సన్మానించి పూలుబొకే అందించడమైనది
కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకట స్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్. ఉపాధ్యక్షులు లక్కీరెడ్డి అనిధర్ రెడ్డి. గౌరవ సలహాదారులు. నక్క తిరుపతి. పట్టి సతీష్ బాబు జాడి ముకుందo కార్యదర్శి పసుల రవి. మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. తాళ్లపల్లి రమేష్ చింతకింది రవి తదితరులు పాల్గొన్నారు

నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు.

— నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు

• ఈద్ శుభాకాంక్షలతో అలింగనం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో రంజాన్ పండగను పురస్కరించుకొని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జనాబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అలైయి, బలైయి చేపట్టడం జరిగిందన్నారు. మతసామరస్యానికి ప్రతీక గా రంజాన్ పండుగను కొలుస్తామన్నారు. సమానత్వం, పరమత సహనం, సహాయగుణం, దయాగుణం వంటి విషయాలపై వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య

 

నిజాంపేట: నేటి ధాత్రి

పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ చారిని మందలించగా మనస్థాపానికి గురై క్షణికావేశంలో రాత్రి ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని నానమ్మ కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. రాచన్న స్వామిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్.

ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్

మందమర్రి నేటి దాత్రి

 

ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో నిర్వహించిన మహాసభలకు సింగరేణి నుండి 30 మంది సిఐటియు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహా సభలలో ఆఫీస్ బేరర్ లను ఎన్నుకోగా, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ని ఉపాధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు కమిటీ సభ్యుడు మంద నరసింహారావు ను కార్యదర్శిగా, యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ ను ఆఫీస్ బేరర్ గా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ఎనిమిది మందికి సైతం వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించారు. ఈసందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వీరి నాయకత్వం లో యూనియన్ నిర్మాణం పెంచే విధంగా కమిటీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందమర్రి బ్రాంచ్ నుండి అల్లి రాజేందర్ ను ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నందుకు ఫెడరేషన్ కమిటీకి, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బ్రాంచ్ నుంచి ప్రతినిధికి ఫెడరేషన్ లో మంచి అవకాశం కల్పించడం హర్షనీయమని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాజేందర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి, యూనియన్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లి రాజేందర్ కు బ్రాంచ్ తరపున శుభాకాంక్షలు తెలిపారు.

మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రంజాన్‌.. మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్‌ పర్వదినాన్ని జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ మండలంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నారు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆయా గ్రామాలలో ఆవరణలో ఉన్న మసీదులో ఈద్గా లో ఉన్న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్‌ పురస్కరించుకుని గ్రామాలలోని మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా, రంజాన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

Ramadan

మహ్మద్‌ ప్రవక్త ద్వారా అల్లాహ్‌ తరపున ఖురాన్‌ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ. జీవన గ్రంథమైన ఖురాన్‌కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్‌ మాసం.అల్లా దీవెనలతో మన భారతదేశ ప్రజలందరూ జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version