ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం.!

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్
శేరిలింగంపల్లి,

నేటి ధాత్రి:-

 

నల్లగండ్లలో ఇందూ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభం

ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, మందుల ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అన్నారు. నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందు ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాచీన వైద్య చికిత్సలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద హాస్పిటల్ ను అందరికీ అందుబాటులో ఉండేలా నల్లగండ్లలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, దీని ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఎంతోకాలంగా ఆయుర్వేద చికిత్స విధానాలను అనుసరిస్తున్నానని, తద్వారా 35 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వానికి సేవలందించానన్నారు. మానసిక, శారీరక రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక రోగాలకు సైతం మెరుగైన వైద్య చికిత్సలో ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయని వైద్యులు ప్రదీప్ నోరి అన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాడి,,

పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.

17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన
ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ 

సిరిసిల్ల టౌన్  ( నేటి దాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో
హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది.
41 సంవత్సరాల 4 నెలలు పోలీస్ వృత్తిలో విధులు నిర్వహించారు. ఇతను 2023 లో పోలీస్ పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమండెంట్ శ్రీ M.I. సురేష్ గారు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో పనిచేసి పదవి విరమణ చేస్తున్న ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ
గారికి అభినందనలు తెలియజేశారు. కర్తవ్యం నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగం చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో కుటుంబసభ్యుల బాధ్యత ఎంతో ఉంటుందని , రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందముగా గడపాలని సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని , వీలైతే సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు .రిటైర్ మెంట్ డబ్బును భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. పోలిస్ శాఖ తరుపున అందాల్సిన ఇతర ప్రయోజనాలు అన్ని త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్
శ్రీ సాంబశివరావు గారు ,RI & RSI లు మరియు బెటాలియన్ సిబంది పాల్గొని వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version