ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం జిల్లా నాయకులు

చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని ఆయన స్వగృహంలో మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసినారు.

ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మేర కులానికి అందవలసిన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా, నియోజకవర్గంతో పాటు మండల కేంద్రంలో మేరు సంఘ భవన నిర్మాణంతోపాటు జనగాం జిల్లాలోని మేరు కుటుంబాలకు జూకి మిషన్లు అందించాలన్నారు.

దీంతోపాటు ఇల్లు లేని మేరు కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాలోని మేరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మేర సంఘం కమిటీ సభ్యులు పేర్కొంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమోరండం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు దీకొండ మురళి, కార్యదర్శి వెన్ను సంపత్, కోశాధికారి సోమ రాజేందర్, పట్టణ అధ్యక్షులు దీకొండ సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు గూడూరు నరేందర్,రాపర్తి సుధాకర్, మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు రాపర్తి ప్రశాంత, కొత్తకొండ అజయ్ కుమార్,దీకొండ విష్ణు తో పాట లింగాల గణపురం, రఘునాథ్ పెళ్లి, జఫర్గడ్, చిల్పూర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version