వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో యూనియన్ సభ్యత్వాలను ప్రారంభించారు.
కాకతీయ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్ లు కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు చేసి రసీదు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల టి.ఎస్.జే.యూ యూనియన్ నిరంతరం పనిచేస్తుందాన్నారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి రూ.5 లక్షల ప్రమాద భీమా ను రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు ఉపయోగించుకోవాలని,జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని దీనివల్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు.
జర్నలిస్ట్ ల హక్కుల సాధనే లక్ష్యంగా అందరం కలిసి ఐకమత్యంగా పోరాడాలనేదే యూనియన్ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.ఎస్.జె.యూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు రవీందర్ సంయుక్త కార్యదర్శి కడపాక రవి, పల్నాటి రాజు కోశాధికారి శేఖర్ నాని,జిల్లా సంయుక్త కార్యదర్శి,బొచ్చు భూపాల్,ఈసి మెంబెర్ కె.దేవేందర్, బొల్లపెల్లి జగన్,మారపెల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు
మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈ నెల 25,26,27 తేదీలలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను పూర్తి అయ్యాయని తెలిపారు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మహాశివరాత్రి జాతర వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు…. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.. పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించు స్వామి వారి సేవలో తరించాలని కోరారు…
ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు..
సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వేములవాడ నేటిధాత్రి
వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్న షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు,age 43y అనే వ్యక్తి పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని,జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలు అయిన ఫెస్ బుక్ , ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూప్స్ etc.. లలో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం,విద్వేషాన్ని దుష్ప్రచారం చేయడం ,ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టిన,వ్యాప్తి చేసిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాల యంలో మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం దేవాలయ ఆవరణలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రాభిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అర్చనలు అభిషేక పూజలు రాత్రి 9:30 కు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగోద్భావ పూజ అష్టోత్తర శత బిల్వార్చన నీరాజనం మంత్రపుష్పం జరుగుతాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మార్త సుమన్ కొలగాని శ్రీనివాస్ కోమటి గణేష్ నీల కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు • యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజాంపేట: నేటి ధాత్రి
కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.
ప్రయాగ్ రాజ్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మామిడిగి, గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డి ఈ), భార్య విలాసిని (40), మల్గి గ్రామానికి చెందిన మల్ రెడ్డి (40)తో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమంలో స్నానాలు చేపట్టిన అనంతరం శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించు కునేందుకు బయలు దేరుతుండగా మార్గమధ్యలో రాత్రి 10:40 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.
ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
వేములవాడ నేటిధాత్రి
ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..
ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.
మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?
ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.
రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు
సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.
అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.
అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.
2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.
ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతుందన్నారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందాని దీన్ని ఆదిశంకరాచార్యు లు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్స రసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణా ల్లో ఉన్నాయన్నారు. కోట్లాది సత్పురు షుల మధ్య స్నానం ఆచరించడం తన జీవితం ధన్యమైందని అన్నారు. అంతే కాకుండా వారణాసి అయోధ్య ఉజ్జయిని మహంకాళేశ్వరం ఓంకారేశ్వర్ ను వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు
ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..
వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.
దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.
ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..
మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.
ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..
నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-
అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫిబ్రవరి 17 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఫాస్ట్ట్యాగ్ నియమాలను ప్రకటించింది. NPCI ప్రకారం, టోల్ ప్లాజాలో ట్యాగ్ని స్కాన్ చేసిన క్షణం నుండి నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫాస్ట్ట్యాగ్ చెల్లింపులు ధృవీకరించబడతాయి. కొత్త నియమాలు మోసాన్ని తగ్గించడం మరియు టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్లోని అతని స్నేహితులు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.
అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్పిన్ ఎడ్విన్ నూన్స్తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.
గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
Shiva Parvathi
మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ‘గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.
VOICE భారత్ను స్పోర్ట్స్ పవర్హౌస్గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పంపించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. భారత్లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహిస్తే ఐఓసి లాభం చేకూరే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అందుకే ఐఓసి కూడా భారత్కే ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత క్రీడా రంగానికి కొత్త జోష్ లభించడం ఖాయం
కలెక్టర్ కార్యాలయంలో కరెంట్ వృధా చేస్తున్న ఉద్యోగులు?
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం G24లో, ప్రత్రి రోజు మధ్యాహ్నం 1నుండి 2.30 గంటల వరకు లంచ్ పేరుతో ఉద్యోగులు బయటకు వెళ్ళే క్రమంలో, వెళ్ళే ముందు తమ కార్యాలయంలోని లైట్లు, ఫ్యాన్లు బందు చేయకుండా వెళ్తున్న పరిస్థితి.
కార్యాలయంలో ఖాళీ కుర్చీలు, తిరుగుతున్న ఫ్యాన్లు, వేసి ఉన్న లైట్లు, ఆఫ్ చేయకుండా బయటకు వెళ్తున్న ఉద్యోగులు.
కరెంట్ ఆదా చేయాలనే ఆలోచన లేదా!!!, లేక ప్రభుత్వ కార్యాలయం అని ధీమా ఏమో…? ఆ సమయంలో ఏదైనా పని మీద ఆఫీసుకు వచ్చే ప్రజలకు ఖాళీ కుర్చీలు, తిరుగుతున్న ఫ్యాన్లు దర్శనం ఇస్తున్నాయి.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానానికి శంఖారావం పూరించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారాయన. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు విజయ్. ఇందులో భాగంగానే విల్లుపురంలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏకంగా 5 లక్షల మందికి పైగా వచ్చారని సమాచారం. ఇక తన స్పీచ్తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్. మొత్తానికి విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే విజయ్ కు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా టీవీకే అధినేతకు అభినందనలు తెలిపారు. ‘సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఈపోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో కోలీవుడ్ లో విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంది. వీరిద్దరి ఒకరు సినిమాలు ఒకరు రీమేక్ చేసుకుని సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అలా జన సేన పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు పవన్ కల్యాన్. మరి విజయ్ కూడా పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి
`ప్రభుత్వం మారగానే శైలజా రామయ్య మళ్ళీ కమీషనర్ కుర్చీలోకి ఎలా వచ్చారు?
`అలుగు వర్షిణిని తప్పించి శైలజా రామయ్య మళ్ళీ ఎందుకొచ్చారు?
`అలుగు వర్షిణి గురుకులాకు ఎందుకు వెళ్లారు?
`గత ప్రభుత్వంలో శైలజా రామయ్యను ఎందుకు తప్పించారు?
`అవతవకలపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించారు?
`జయేష్ రంజన్ రాసిన లెటర్లు చిత్తు కాగితాలా?
`గతంలో టెస్కోలో అవినీతిపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అబద్దమా?
`అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విచారణ బుట్టదాఖలేనా?
`మంత్రి తుమ్మల మాటలకు విలువ లేదా?
`అవినీతి జరిగిన విషయం దృష్టికొచ్చిందన్న మాటలు అబద్దాలా!
`ప్రజా ప్రభుత్వంలో మంత్రికన్నా కమీషనరే పవర్ ఫుల్లా!
`విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పిన వెంటనే శైలజా రామయ్య ఎందుకొచ్చారు?
`మళ్ళీ శైలజా రామయ్యను ఎందుకు తెచ్చి పెట్టారు?
`ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నలా?
`ఇప్పుడు అవినీతి అధికారులకే పెద్ద పీటలా?
`అవినీతి చేసిన వారికి అందలాల!
`ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసిన వారికి కష్టాలా?
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని వ్యవస్దలకు ఏం మాయ రోగమొచ్చింది. చేస్తున్న ఉద్యోగాలకు నెల నెల వేలాదిరూపాయల జీతాలు తీసుకుంటూనే వున్నారు. అయినా అవినీతి అవతారం ఎత్తుతున్నారు. లంచాలు తీసుకోవడం తమ హక్కు అన్నంతగా మారిపోతున్నారు. ప్రజల సొమ్ముతినడం అన్యాయమని అనిపించదు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా తినడం అక్రమని అనిపించదు. కాని వేలెత్తి చూపితే మాత్రం ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తుంది. అవినీతి జరిగిందని చెబితే ఆక్రోషమొస్తుంది. అన్యాయం జరుగుతుందని అంటే కోపాలొస్తాయి. ప్రజల సేవ కోసం వున్న, ప్రజల పన్నుల మీద జీతాలు తీసుకుంటున్న వాళ్లు అవినీతికి పాల్పడమమే నేరం. ఆ సంగతి తెలిసి కూడా అన్యాయానికి తెగబడతాం…అవినీతిని విచ్చలవిడిగా చేస్తాం..అవకాశాన్ని బట్టి కోట్లు మింగేస్తామనుకుంటున్నారు. మింగుతున్నారు కూడా.. సహజంగా ఎక్కడైనా ఒకప్పుడు అవినీతి అధికారి అని ఎక్కడ ముద్రపడుతుందో అని భయపడేవారు. ఉద్యోగ విధినిర్వహణ కర్తవ్యంగా సాగించేవారు. కాని ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటేనే గొప్ప అన్నట్లు మారిపోయింది. అలాంటి వారికి జేజేలు పలుకుతున్నారు. వారికే అటు ప్రజలు, ఇటు తోటి ఉద్యోగులు భయపడుతున్నారు. నేటిధాత్రి ఇటీవల చేనేతలో చేతి వాటం అనే శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం తప్పైతే ఆ అధికారులు వార్తలను ఖండిరచొచ్చు. నిజానిజాలు వెల్లడిరచి వార్తను తప్పు పట్టొచ్చు. కాని ఒక ఉన్నతోద్యోగి దేవత అంటూ కింది స్దాయి ఉద్యోగులు కీర్తించడం ఎక్కడా విన్నది లేదు. చూసింది లేదు. ఒక ఉన్నతాధికారి ఎలా దేవత అవుతుందో తెలియదు. వ్యక్తిగతంగా ఉన్నతోద్యోగి మీద గౌరవం వుంటే అలా సంబోధించుకోవడానికి అభ్యంతరం లేదు. కాని అది కార్యాలయంలో ఉన్నతోద్యోగి అయిన ఆ దేవత మీద వార్తలు రాస్తారా? అంటూ చిందులు తొక్కే కింది స్ధాయి ఉద్యోగులు కూడా వుంటారని ఎక్కడా వినలేదు. కాని ఇప్పుడు వింటున్నాం.. చూస్తున్నాం..చేనేత .జౌళి శాఖ కమీషనర్గా వున్న శైలాజా రామయ్యను దేవతగా కీర్తిస్తూ కార్యాలయంలోని ఉద్యోగులు ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న వార్త రాయించిన వాళ్ల పాపం పోదని నిందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు వార్త రాసిన నేటిధాత్రికూడా ఆ పనిచేయాలని ఓ సుధాకర్ రెడ్డి అనే ఉద్యోగి ఇతర ఉద్యోగుల మీద చిందులు వేశాడట. కారణం ఆ ఉద్యోగి కూతురుకు ఎలాంటి నోటిఫికేషన్ అవసరంలేకుండానే టెస్కొలో కమీషనర్ శైలజా రామయ్య ఆశీస్సులతో ఉద్యోగం కల్పించారు. ఆ కృతజ్ఞత వుంటే వ్యక్తిగతంగా పూజించుకోవచ్చు. కాని టెస్కొలో ఎలాంటి ఉద్యగమైనా నియామకాల మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగం కల్పించాలి. కాని అది జరగలేదు. తన కూతురుకు అప్పనంగా ఉద్యోగం సంపాదించుకున్నామన్న బెరుకులేదు. మీడియాకు తెలిస్తే ఇబ్బంది అవుతుందన్న భయం లేదు. నిరుద్యోగులకు తెలిస్తే అలా ఉద్యోగం ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నిస్తారన్న ఆందోళన అసలే లేదు. తప్పు చేసి, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒక రకంగా నేరం చేశారు. అయినా ఉన్నతాధికారి ఐఎఎస్ అదికారి అండగా వున్నారన్న ఆలోచనతో ఒక ఉద్యోగి తోటి ఉద్యోగుల మీద చిందులు తొక్కుతున్నాడని తెలిసింది. ఇక ఇదిలా వుంటే టెస్కొలో అవినీతి జరిగిందనే వార్తలు అనేకం వున్నాయి. ఇప్పుడు అదికారంలో వున్న కాంగ్రెస్ నేతలు చేసిన అనేక ఆరోపణలున్నాయి. ఆనాడు అవి తప్పని కమీషనర్ నోరు విప్పలేదు. తప్పు జరగలేదని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల టెస్కొలో నిధులు గోల్ మాల్ అయిన సంగతి స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడిరచారు. అంటే ఇక్కడ మంత్రి చేసిన వ్యాఖ్యలు తప్పా? ఆయన జరిగిన దానిపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పడం అబద్దమా? దాంతో టెస్కొ విషయంలో మంత్రి మాటలకే చెల్లుబాటు లేకుండాపోయిందా? ఎవరు సమాదానం చెబుతారు? సాక్ష్యాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కొలో బోగస్ సహకార సంఘాలున్నట్లు గుర్తించినట్లు కూడాచెప్పారు. అసలు వాటి గుట్టు రట్టు కావాల్సిన అవసరం వుంది. ఇక పోతే గత ప్రభుత్వమే టెస్కొలో ఏదో జరిగింది. కోట్ల రూపాయల గోల్ మాల్ కనిపిస్తుందని అనుమాన పడి అప్పటి మంత్రి కేటిఆర్ కమీషనర్ శైలాజా రామయ్యను బదిలీ చేశారు. ఆ స్దానంలో ఐఏఎస్ అధికారి బుద్ధ ప్రకాష్ను కమీషనర్గా నియమించారు.కొంతకాలం తర్వాత బుద్ధ ప్రకాష్ ను వేరే శాఖకు కేటీఆర్ బదిలీ చేసి టెస్కో కమీషనర్ గా అలుగు వర్షీణీని నియమించారు. ఆ తర్వాత జరిగిన తంతు గురించి ఆమె విచారణ మొదలు పెట్టింది. దాంతో టెస్కొలో విస్తుపోయే అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. వీటిలో లెక్కలు తేల్చాలంటే నిజాయితీ అధికారులుగా పేరున్న కొంత మందిని ఆమె తనశాఖలోకి తీసుకున్నారు. వారిలో కిరణ్మయి, క్రిష్ణప్రసాద్, కళావతి, మధు అనే ఉద్యోగులున్నారు. వీరి సహాకారంలో అలుగు వర్షిణి విచారణ మొదలు పెట్టింది. టెస్కోలో జరిగిన అవకతవకలు తన విచారణలో తెలిసిన వెంటనే లోతైన అధ్యయనం చేసే ముందు ఓసారి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్కు లేఖ రాశారు. ఆయన విజిలేన్స్ విచారణ జరపాలంటూ జీఏడికి సూచించారు. లోతైన విచారణ మొదలైంది. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా విచారణ వేగవంతం చేయాలనే చూసింది. ఇంతలో టెస్కొలో జరిగిన అవినీతి బైటకు వస్తుందన్న ఆలోచనతో ఇతర శాఖలు చూస్తున్న శైలాజా రామయ్య పట్టుబట్టి మళ్లీ చేనేత జౌళి శాఖ కమీషనర్గా వచ్చారు. కమీషనర్గా వున్న ఐఏఎస్ అలుగు వర్షిణిని గురుకులకు పంపించారు. తర్వాత ఇతర ఉద్యోగుల మీద శైలాజా రామయ్య తమ ప్రతాపంచూపారు. తనపైనే విచారణ చేస్తారా? అని వచ్చిన వెంటనే కిరణ్మయిని గురుకుల శాఖకు పంపించారు. కృష్ణ ప్రసాద్ను తిరిగి పంపించేశారు. ఆయనకు రెండు నెలల్లో 35 మెమోలు, 8 చార్జిమెమోలు జారీ చేసి వేదిస్తున్నారని తెలుస్తోంది. ఒక కలావతి అనే ఉద్యోగికి నాలుగు నెలల నుంచి జీతం ఆపేశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసినందుకు వీరికి కష్టాలు మొదలయ్యాయి. వేదింపులు మొదలయ్యాయి. నాలుగు నెలలుగా జీతం రావడం లేదని శైలజా రామయ్య ముందు కళావతి బోరున విలపించినా ఆమె కనికరించలేదు! ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్యాలయం ముందు వేచి వుంచి, చివరికి నా దగ్గరకు రావొద్దని హెచ్చారించారు. ఇకమధు అనే ఔటోర్సింగ్ ఉద్యోగి విషయంలో మరీ విచిత్రం చేశారు. ఔట్సోర్సింగ్ ఏజేన్సీకి మధు అనే ఉద్యోగి రాజీనామా చేశారని లెటర్ పంపించారు. ఆఫీసులోనే అతన్ని తీసేశామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 19న ఉత్తర్వులు తయారు చేసి, జూలై 27 వరకు మధుకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా వుంటే ఈ ఉద్యోగులకు వేధింపులు ఆగాలన్నా, వారి వారి కొలువులు సజావుగా చేసుకోవాలనుకుంటే శైలజా రామయ్య మీద అప్పటి కమీషనర్ అలుగు వర్షిణి మా మీద ఒత్తిడి తెచ్చి నివేదికలు తయారు చేయించిందని ప్రభుత్వానికి లెటర్లు రాయాలి? అందులో మా తప్పేంలేదని అప్పటి కమీషనర్ ఒత్తిడి మేరకు చేశామని ఒప్పుకోవాలి. శైలజా రామాయ్య కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా మీరు చేసిన పాపం పోదని హెచ్చరిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారు. ఇదిలా వుంటే ఏ ఉద్యోగుల మూలంగా టెస్కొలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయో ఆ ఉద్యోగులైన రఘునందన్ రావును అప్పట్లో బదిలీ చేశారు. ఆయనతోపాటు తత్వానంద చారి, కలింగరెడ్డి, సుధాకర్రెడ్డి, పురాణం శ్రీనివాస్ను బదిలీ చేశారు. ఎప్పుడైతే శైలజా రామయ్య మళ్లీ చార్జి తీసుకున్న వెంటనే రఘనందన్ రావుకు పోస్టింగ్ వచ్చింది. ˜తత్వానంద చారికి డివో నుంచి ఏడి అయ్యారు. కళింగ రెడ్డి డివో నుంచి ఏడి అయ్యారు. సస్పెండ్ అయిన పురాణం శ్రీనివాస్కు ఎంవో నుంచి లివరీ డివిజన్కు ప్రమోషన్ ఇచ్చారు. ఇలా టెస్కొలో అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలిన వారికి ఇప్పుడు ప్రమోషన్లు వచ్చాయి. ప్రభుత్వం విచారణ కోసం తీసుకున్న టీమ్ ఉద్యోగులకు మాత్రం బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు, జీతాలు ఆపడాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మధుకు ఉద్యోగమే లేకుండా చేశారు. ఇదంతా నిజమా? కాదా? అన్నది కమీషనర్ చెప్పాలి. లేకుంటే అసలు టెస్కొలోఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వంతో చెప్పించాలి. కింది స్దాయి ఉద్యోగులను వేధిస్తే తప్పు ఒప్పు కాదు. జరిగిన అవినీతి లెక్కలోకి రాకుండాపోదు. నేటిధాత్రి మీద నిందలేస్తే సరిపోదు. ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.