సీతగా సాయిపల్లవి.. అందుకే

 

సీతగా సాయిపల్లవి.. అందుకే

రామాయణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా..

రామాయణ’.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా గురించే అంతా చర్చించుకుంటున్నారు. ‘నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ అట.. ‘అవతార్‌’ సినిమా బడ్జెట్‌ కంటే ఇది ఎక్కువట.. వర్కవుట్‌ అవుతుందా?’

అనేది వారి చర్చ. సినిమా బాగా ఆడాలని, భారతీయ సినిమా గొప్పతనాన్ని ‘రామాయణ’ మరోసారి చాటి చెప్పాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. అయితే ఎందరో హీరో హీరోయిన్లు ఉండగా రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను, సీతగా సాయిపల్లవిని తీసుకోవడం ఏమిటనే విమర్శలు వినిపించకపోలేదు. దీనిపై సినిమా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ చబ్రా స్పష్టత ఇచ్చారు. ‘రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం.. ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం, గొప్పగా నటించగల నైపుణ్యం. అలాగే సీత పాత్రకు సాయిపల్లవిని ఎన్నుకోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. మొదటి నుంచీ ఆమె గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటున్నారు. అందం కోసం సర్జరీలు చేయించుకోలేదు. కృత్రిమం కంటే సహజ అందమే మేలు అనే భావన ఆమెది. తెరపై సీతారాముల్ని చూడగానే ఓ పవిత్రమైన భావన కలగాలని ఆ పాత్రలకు వీరిద్దరినీ ఎంపిక చేశాం’ అని వివరించారు. ‘రామాయణ’లో రావణుడిగా కన్నడ హీరో యశ్‌ నటిస్తున్నారు. ఆయన ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడా. ఆయన సరసన మండోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. సన్నీ డియోల్‌ హనుమంతుడిగా నటిస్తున్నారు.

హాన్స్‌ జిమ్మర్‌తో రెహమాన్‌

‘రామాయణ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం కోసం జర్మనీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హాన్స్‌ జిమ్మర్‌తో చేతులు కలిపారు ఏఆర్‌ రెహమాన్‌. ఇప్పటివరకూ జిమ్మర్‌తో కలసి లండన్‌, లాస్‌ఏంజెల్స్‌, దుబాయ్‌లో సంగీత చర్చలు జరిపాననీ, భారతీయ కళావైభవాన్ని చాటే గొప్ప చిత్రం ‘రామాయణ’కు పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు రెహమాన్‌ వెల్లడించారు. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా, యశ్‌ కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నిర్మాత గోవాలో ఆత్మహత్య

NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్‌లోని అతని స్నేహితులు చెప్పారు.

ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్‌తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్‌లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.

అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్‌లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ నూన్స్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.

గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్‌ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version