దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.

దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జడిమల్కాపూర్‌లో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆలయా దుర్గామాత దేవిని దర్శించుకొని సందర్శించారు.

Former Minister Harish Rao

 

ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి. గ్రామంలో హరీష్ రావుకు పూలమాలలతో భాజ భాజంత్రీలతో ఘన స్వాగతం పలికారు . గ్రామ నాయకులు భరత్ రెడ్డి ఆయనకు పూలమాలల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని
నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా, కరోనా వచ్చిన కేసీఆర్ ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి యాసంగిని మూడెకరాలకు పరిమితం చేశారున్నారు.
కేసీఆర్ పది వేలు ఇస్తే మేం రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చినా ఇప్పటివరకు రైతుబంధు ఊసే లేదు. జహీరాబాద్, నారాయణఖేడ్ లకు కేసీఆర్ హయాంలో అత్యధికంగా 100 కోట్ల రూపాయల రైతుబంధు వచ్చేది. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో గత నాలుగు నెలలుగా చనిపోయిన రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఆరోపించారు. మెదక్, సిద్దిపేటకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు సప్లై చేయాలని, మరికొన్ని జిల్లాలు స్టేట్ సీడ్ కార్పొరేషన్ సీడ్ పంపిణీ బాధ్యతలు అప్పగించారన్నారు.ఇద్దరు కలిసి స్టేట్ కు, ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు..బీరు విస్కీ ధరలు పెంచి చివరకు విత్తనాల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి రైతులకు పంచాడని అదే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైన్స్ ధరలు పెంచావు, జనుము, జీలుగ తదితర పచ్చిరొట్టె ఎరువుల ధరలు పెంచి రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతు బీమాలు ఇస్తలేవని ధ్వజమెత్తారు. ఇచ్చేది ఎగవేస్తున్నావ్ ఉల్ట రైతుల వద్ద గుంజేస్తున్నావ్ వంటూ ..ఈ వైఖరిని ఏమనుకోవాలన్నారు. ధాన్యానికి బోనస్ బోనస్ అని బోగస్ చేసేస్తున్నావని, యాసంగిలో సన్న వడ్లకు ఇచ్చే బోనస్ రూ.850 కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించ లేదని ఆరోపించారు.బోనస్ పైసలు, రైతు బంధు డబ్బులు, యాసంగిలో ఒక్క పైసా ఇవ్వని రైతులను మోసం, దగా చేసిన రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నాడనిప్రశ్నించారు. యూరియా బఫర్ స్టాక్ తగ్గిపోయిందని, గత ప్రభుత్వం వేసవిలోనే ఎరువులు కొరత లేకుండా చూసేదన్నారు. 25 శాతం ధాన్యం ఇంకా కల్లాలోనే ఉందని కరీంనగర్ మెదక్, నల్గొండ వరంగల్ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బస్తాల్లోని ధాన్యం మొలకెత్తి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అన్ని సెంటర్లలో అదే పరిస్థితి ఉందంటూ.. అధికారులు నీ మాట వినడం లేదా అని ఎద్దేవాచేశారు. అప్పుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ నీ పరువునే కాక రాష్ట్రం పరువును తీయడం అది కాదని, నీ పరువు నీవు తీసుకున్న పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయకని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు నా సొంత నిధులని కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా?జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్ ఏం ఇచ్చిండు? ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.25కోట్లను వాపస్ తీసుకున్నడు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేసీఆర్ రూ.30 కోట్లు ఇస్తే వాటిని కూడా వాపస్ తీసుకున్నాడు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నడని ఆరోపించారు.జహీరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి కి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులని వెంటనే ఇవ్వాలి. పాతవి ఇచ్చి కొత్తగా వంద కోట్ల రూపాయలని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు. సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుని పునరుద్దరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ లకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరపున డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా జాడి మల్కాపూర్ బయలుదేరి వెళ్లి దుర్గమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు, స్థానిక నేతలు ఎం.శివకుమార్, మాణిక్యం, గుండప్ప, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ ఇతర జిల్లా, స్థానిక నేతలు ఉన్నారు.

37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని 37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ మే 22 (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37 వ వార్డులో ని ఈ రోజున ఉదయం 10-30 సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహాయ నిధి (CMRF)నుండి స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహాయ సహకారంతో 37.వ పరిధిలో గల లబ్దిదారులైన బూర్ల ప్రతాప్ 24000/- రూపాయలు దాసరి కళావతి విఠల్ 6500/-
రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ లను వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కి తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు మరియు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు..

మబ్బులు తొలగిపోతున్నాయి…ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలకు హైడ్రా తార్కాణం.

కమిషనర్‌ రంగనాథ్‌ దూకుడు పెంచారు.

`హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి.

`హైడ్రా పని తీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.

`హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు.

`ఆరంభంలో అవాంతరాలు సహజం.

`ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం.

`ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెరకపోవడమే రేవంత్‌ వ్యక్తిత్వం.

`పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్‌.

`ఎన్ని అవాంతరాలెదురైనా ఎదుర్కొంటున్నారు.

`ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమింగుకుంటున్నారు.

`మంచిపని ఎప్పుడూ తప్పుకాదు.

`అంతిమంగా విజయం దక్కకపోదు.

`హైదరాబాదు పర్యావరణ పరిరక్షణలో మొదటి స్థానం దక్కకపోదు.

`పచ్చిన హైదరాబాదు సాధ్యం కాకుండా పోదు.

`రేవంత్‌ కల నెరవేరే తరుణం ఎంతో దూరంలో లేదు.

`జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో పేరున్న నాయకుడు పల్లం రాజు ఇల్లు కూల్చారు.

`జయభేరి అక్రమ అప్పార్టుమెంట్లు

`మొదట్లో కొన్ని ప్రశ్నలు.

`ఎన్‌ కన్వెన్షన్‌ తో జనంలో కేరింతలు.

`తర్వాత కొన్ని వివాదాలు.

`పేదల నుంచి కూడా విమర్శలు.

`ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు!

`న్యాయ స్థానాలనుంచి కొన్ని అభ్యంతరాలు.

`ఇప్పుడు హైడ్రా మీద అన్ని వర్గాల నుంచి అభినందనలు

`ఏపి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అక్రమ కట్టడాలు నేల మట్టం చేశారు

`హైడ్రాకు ప్రత్యేక పోలీసు స్టేషను ఏర్పాటు చేశారు.

`సంబంధిత అధికారులకు వాహనాలు అందించారు

`మల్లారెడ్డి అక్రమ భవనాలు మటాష్‌

`అసదుద్దీన్‌ ఓవైసీ చెరువు కబ్జా కహానీ ఖతం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అబద్దాలు అందంగా వుంటాయి. నిజాలు లోతుగా వుంటాయి. అబద్దాలు తియ్యగా వుంటాయి. నిజాలు చేదుగా వుంటాయి. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. నిజాలు తేలేందుకు కొంత సమయం పడుతుంది. అబద్దం నమ్మడానికి కొద్ది సమయమే తీసుకుంటుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. హైడ్రా వల్ల ఏదో జరిగిపోతోందన్న భావన ప్రతిపక్షాలు కల్పించాయి. హైడ్రా పెద్దోళ్లను ఒదిలిపెట్టి, పేదోళ్ల మీద పడిరదన్నారు. హైడ్రా పక్కదారి పట్టిందన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కాని నిజం నిలకడ మీద తేలుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైడ్రా విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సహించారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నారు. ఏ విషయంలో సిఎం. స్పందించినా హైడ్రా మీద ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోలేదు. అంతిమంగా హైదరాబాద్‌కు మంచి జరగాలనుకున్నప్పుడు మౌనమే శరణ్యమని అనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో పట్టుదల కలిగిన మనిషి. నిజంలాగా ఎంతో లోతైన నాయకుడు. ఏ విషయానైన్నానా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి నిజం వైపు నిలిచారు. రాజకీయ జీవితంలో ఎవరూ అందుకోలేని విజయాలు అందుకున్నారు. అందుకే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా సరే ప్రజలకు మంచి జరుగుతుందనుకున్నప్పుడు ఎవరి మాట వినని సీతయ్యగా పేరు పొందారు. ప్రజల కోణంలోనే ఆయన ప్రతి విషయాన్ని చూస్తారు. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా ఎదురిస్తారు. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరూ ఎదుర్కొనన్ని విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఇంటా, బైట ఎంత మంది వేలెత్తి చూపినా పట్టించుకోరు. ప్రజలకు మరింత న్యాయం జరగాలనుకున్నప్పుడు కొంత ఓపిక అవసరం అనుకున్నారు. ఇప్పుడు హైడ్రా విషయంలో అదే చేస్తున్నారు. తాను హైడ్రాపై ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో అవి నెరవేరుతున్నాయి. ఆయన కలలు సాకారమౌతున్నాయి. హైదరాబాద్‌కు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే దిశలు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే హైడ్రామీద మబ్బులు తొలగిపోతున్నాయి. ప్రజలు నిజాలు తెసుకుంటున్నారు. వాస్తవాలు పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు సామాన్యులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన ప్రతిపక్షాలను కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. హైడ్రా వల్ల ఎంత మేలు జరుగుతుందో కూడా కళ్లారా చూస్తున్నారు. ప్రజల నుంచి హైడ్రాకు ప్రశంసలు మొదలౌతున్నాయి. హైడ్రా వల్ల పర్యావరణ పరిరక్షణ అన్నది ఎలా సాద్యామౌతుందో కూడా కళ్లతో చూస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారి గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తుతున్నాయి. అన్యాయం చేసిన వాళ్లే తమకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. గతంలో అయితే ఇలాంటి విషయాల్లో ఎంతో మంది దూరిపోయేవారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి ఏదైనా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే చేస్తారు. పోకిరి సినిమాలు ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేలా సిఎం. రేవంత్‌ ముందుకు సాగుతున్నారు. అందుకే అక్రమార్కులను ఎవరూ కాపాడలేకపోతున్నారు. తప్పు చేశామని ఒప్పుకునే పరిస్దితి తెచ్చుకుంటున్నారు. తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకునే క్రమంలో కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయిస్తూ స్టేలు తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కాని వాటిపై న్యాయ పోరాటం కూడా హైడ్రా తరుపున కమీషనర్‌ రంగనాధ్‌ కూడా చాలా పట్టుదలతో చేస్తున్నారు. అలాంటి కేసులు వీగపోయేలా, కోర్టులు కూడా హైడ్రాకు అనుకూలంగా తీర్పులిచ్చేలా నిజాలను న్యాయ స్దానం ముందు వుంచుతున్నారు. దాంతో అక్రమార్కులు పప్పులు ఉడకడంలేదు. తప్పులు చేసిన వారికి న్యాయం స్దానాల్లో కూడా చుక్కెదురౌతోంది. వారి అక్రమ నిర్మాణాలు నేలమట్టమౌతున్నాయి. ఇప్పుడు మాత్రం హైడ్రా మీద పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. మొన్నటి వరకు ప్రజల్లో వున్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. హైడ్రా వల్ల ప్రజలకు పూర్తి స్దాయిలో మంచి జరుగుతున్న నమ్మకం బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రజలు హైడ్రాను ఆహ్వానిస్తున్నారు. అలా ఈ మధ్య కొన్ని కూల్చివేతల మూలంగా ఎంతో మంది ప్రజలకు మేలు జరగింది. ఏపికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్‌ ఏకంగా రోడ్డును కూడా కబ్జా చేసి, 49 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు హైడ్రా తేల్చింది. వెంటనే అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసినా సరే, వాటిని కూడా పూర్తి స్దాయిలో నేల మట్టం చేసింది. ఆయన మూసేసిన రోడ్డును తెరిపించి, ప్రజలకు ఎంతో మేలు చేసింది. దాంతో ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిజేశారు. ఇటీవల కూకట్‌ పల్లిలో కూడా పెద్ద భూ బాగోతం వెలుగులోకి విచ్చింది. ఓ వ్యక్తి, చెరువు స్థలాన్ని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి, రియల్‌ వ్యాపారం సాగిస్తున్నారు. హైడ్రా రంగంలోకి దిగడంతో ఆయన బండారం బైట పడిరది. అక్కడ కూడా రోడ్డు మూయడంపై ప్రజలు ఎప్పటినుంచో అభ్యంతరం తెలియజేస్తున్నారు. కాని ఎవరూ పట్టించుకున్నది లేదు. ఇటీవల హైడ్రాకు ప్రత్యేకమైన పోలీస్‌ స్టేషన్‌ సిఎం. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వారికి వాహనాలు అందించారు. అప్పటి నుంచి హైడ్రా కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. భూ అక్రమాలపై పిర్యాదలు పెద్దఎత్తున అందజేస్తున్నారు. వివరాలు తీసుకున్న హైడ్రా వెంటనే రంగంలోకి దిగుతోంది. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లిలో ఓ ప్రైవేటు స్కూలు రోడ్డును ఆక్రమించి, భవనాలు నిర్మాణం చేసింది. దాన్ని ఎప్పటినుంచో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ స్కూల్‌ యజమాని పట్టించుకోలేదు. రాజకీయ పలుబడితో అందర్నీ బెదిరిస్తూ వచ్చారు. దానిపై పిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. రోడ్డు సౌకర్యం పునర్దురించింది. దాంతో ప్రజల్లో హర్షం వ్యక్తమౌతోంది. సహజంగా ఎంత మంచి పని చేపట్టినా అవాంతరాలు ఎదురు కావడం సహజం. వాటిని అధిగమించేందుకు కొంత సమయం పడుతుంది. వాటన్నింటినీ అధిగమించేందకు కొంత సమయం పట్టింది. ప్రజలకు నిజా, నిజాలు తెలియడంతో హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి విషయాలో ఆదిలో ఎన్నో ఒత్తిళ్లు సిఎం.రేవంత్‌రెడ్డికి వచ్చాయి. ఖైరతాబాద్‌ ఏమ్మెల్యే సైతం హైడ్రాను అడ్డుకున్నారు. హైడ్రాకు అడ్డంతిరిగారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరినీ లెక్క చేయలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న సందర్భంలో మన, తర బేదాలు చూసుకోవద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన, జాతీయ స్దాయిలో పార్టీ అధిష్టానానికి ఎంతో సన్నిహితుడైన నాయకుడి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. దాంతో పార్టీలో ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కాని సిఎం. రేవంత్‌రెడ్డి ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆది నుంచి సిఎం. రేవంత్‌ ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా దిగిమింగుకున్నారు. మంచి పని ఎప్పుడూ తప్పు కాదని ముందుకు సాగారు. అంతిమంగా హైదరాబాద్‌ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్నారు. అంతిమంగా హైడ్రాకు విజయం దక్కకపోదన్న నమ్మకంతోనే రేవంత్‌ రెడ్డి వున్నారు. హైడ్రా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే దేశంలోనే హైద్రాబాద్‌ పర్యావరణ పరిరక్షణలో మొదటి స్దానంలో వుంటుంది. గతంలో బెంగులూరు నగరాన్ని పర్యావరణ ప్రాంతంగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు హైదరాబాద్‌ను చెప్పుకునే రోజులు తప్పకుండా వస్తాయి. హైదరాబాద్‌ విషయంలో పర్యావరణ పరిక్షణ అంశంలో రేవంత్‌రెడ్డి కల నెరవేడానికి పెద్దగా సమయం కూడా పట్టేలా లేదు. ఆ తరుణం ఎంతో దూరం కూడా లేదు. ఎందుకంటే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చినప్పుడు ప్రజలు కేరిం తలు కొట్టారు. రాం నగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చినప్పుడు కొంత మంది అడ్డుకున్నారు. మూసీ నదిలో అక్రమంగా ఇండ్లు కట్టుకొని వున్నవారిని తరలిస్తే రాజకీయం చేశారు. ఇప్పుడు వాళ్లందరికీ హైడ్రా పనితీరు పూర్తిగా అర్ధమైంది. హైడ్రాతో సుందరమైన, అందమైన నగరం మారుతుందన్న విశ్వాసం పెరిగింది. మూసీనది పరిరక్షణ, సుందరీకరణతో హైదరాబాద్‌ సరికొత్త సొగబులు దిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టదు. దటీజ్‌ సిఎం. రేవంత్‌ రెడ్డి అని అందరూ కొనియాడే రోజు దగ్గర్లోనే వుంది.

వర్షమా… శాపమా.!

వర్షమా… శాపమా.!

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం.

అల్పపీడ ప్రభావం భారీ వర్షం పుష్కరాల్లో గందరగోళం.

నెల కొరిగిన తాత్కాలిక పనులు.

గాలి బీభత్సవానికి పలువురికి గాయాలు.

కూలిపోయిన తోరణాలు, బుడదగా మారిన పార్కింగ్ స్థలాలు.

వాహనాలు జామ్, ఎక్కడికి వెళ్లాలో తెలవక భక్తుల్లో గందరగోళ పరిస్థితి.

కొనసాగుతున్న వర్షం ఆగిన ఎదురుగాలు.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

 

అల్పపీడన ప్రభావం భారీ ఈదురుగాలులతో వర్షం రైతులకు ఒక శాపంగా మారింది, మరోవైపు పుష్కరాల్లో గందరగోళ పరిస్థితిని నెలకొల్పింది. బుధవారం రోజు నాలుగు గంటల నుంచి తుఫాను ప్రభావంతో మండలంలో భారీ వర్షంతో పాటు ఎదురుగాలు, ఉరుములు మెరుపులు కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం కాలేశ్వరం పుష్కరాల ఏడవ రోజు పెద్ద మొత్తంలో భక్తులు ఉండడంతో, వర్షం పుష్కరాల్లో వచ్చిన భక్తుల పరిస్థితిని గందరగోళంగా మార్చేసింది. భారీ వర్షంతో పుష్కరాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతులు నేలకొరకడం జరిగియి, అంతేకాకుండా గాలి వాన బీభత్సవానికి భారీ ఫ్లెక్సీలు తెగిపోవడంతో భక్తులకు గాయాలు కావడం జరిగింది.

Rain… curse!

ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షం, మండలంలోని రైతులకు ఒక శాపం గా మారింది, గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షంతో అనేక రైతులు ఇబ్బందులకు గురై, కొనుగోలు కేంద్రాల్లో వరి చెరువులను తలపించడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికీ మండలంలో పిఎసిఎస్, ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో వడ్లను రవాణా చేయలేదు. మొదట్లో పడిన వర్షానికి తడిసిన ధాన్యం ఇప్పటికీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లర్లకు తరలించలేదు, నేడు కురిసిన భారీ వర్షానికి, రాబోయే రోజుల్లో అల్పపీడన ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగడం, జరుగుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఇంకెప్పుడు తరలిస్తారు, అధికారుల నిర్లక్ష్యం ఈ తుఫాను ప్రభావం వల్ల పడుతున్న వర్షాలు మాకు శాపంగా మారిందని రైతులు ముత్తుకుంటున్నారు.

Rain… curse!

 

ఏడవ రోజు పుష్కరాల సందర్భంగా పెద్ద మొత్తంలో గోదావరి పుణ్య స్థానాలు ఆచరిస్తున్న భక్తులు ఒకేసారి, తుఫాను ప్రభావంతో ఏర్పడిన గాలి దువారం వర్షానికి, కాలేశ్వరం కేంద్రం కాస్త గందరగోళ పరిస్థితిని లోకి వెళ్ళిపోయింది. గోదావరి వద్ద ఏర్పాటు చేసిన స్థాన ఘట్టాలు చలవ పందిర్లు, నెలకు ఓరగడం తో భక్తుల పరిస్థితి గందరగోళానికి మారింది. ఒకవైపు వర్షం మరోవైపు వర్షం నుండి రక్షణ కొరకు, ఎక్కడికి వెళ్లాలో తెలవని పరిస్థితిలో భక్తులు పరుగు పందెం మొదలుపెట్టారు. మరోవైపు గాలి ద్వారానికి ప్రచార నిమిత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పడడంతో కొందరికి గాయాలు కావడం జరిగింది. అలాగే వాహనాలు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థావరాలన్నీ బురద మా ఇంకా మారిపోయి, వాహనాలు బయటికి వచ్చి పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు కూడా వాహనాల వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, ఆర్టీసీ బస్టాండ్ తో పాటు దేవాలయ పరిసర ప్రాంగణంలో వర్షానికి తడుచుకుంటూ నిలబడడం జరిగింది. తుఫాను ప్రభావం చే వచ్చిన అకాల వర్షం గాలి దువారానికి పెద్ద ప్రమాదం లాంటి వి సంభవించడం జరగలేదు కానీ, దామమాత్రంగా కొందరు భక్తులు కటౌట్లు పడడంతో గాయాల పాలు కావడం, ఒకేసారి వర్షం ప్రభావం ప్రారంభం కావడంతో జనసంధారం ఎక్కువ ఉండడంతో, గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Rain… curse!

 

 

అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై భక్తులకు ఇబ్బందులు కలగకుండా, వాహనాల రాకపోకల తో పాటు, పడిపోయిన తాత్కాలిక పనులను తిరిగి మొరబత్తు చేసి కార్యక్రమంలో నిమగ్నం కావడం జరిగింది.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఏ.చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్దంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.,ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత,ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ , గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ గారి జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ , శ్రీనివాస్ రెడ్డి , రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, సామెల్ గారు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగెల్లి రాములు , శుక్లవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ , జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఉదయ్ శంకర్ పాటిల్ మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ

⏩ పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ గాంధీ

⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ

⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం

⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ

దుపాకి సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు,
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు.
వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ

– ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి, ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అతిపిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలా లుఅందిస్తున్నాయన్నారుయువతలో శక్తివంతమైన మార్పు ను కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శానం కుమారస్వామి, మార పెల్లి కట్టయ్య, రమేష్, రాజేం దర్, వరదరాజు, మార్కండే య, రంగుబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని. లక్ష్యాలు సాధించాలని సూచించారు. అకాల వర్షాలతో వైరస్ ప్రజలకు సుజనల్ వ్యాధులు వాటికప్పుడు అందజేయాలని విష జ్వరాలు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారణ జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తూ వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ ఆసిఫా వైద్య సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు.

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు

పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయిగీత- శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు రాష్ట్ర,మండల బిజెపి నాయకులు పాల్గొని ఆశీర్వ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సి లింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి,మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సుమన్ చంద్రమొగిలి, నవీన్, రవి, మురళి పాల్గొన్నారు.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

నేటిధాత్రి, రేగొండ..

 

 

రేగొండ మండలంలోని రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం జగన్, ఉపాధ్యక్షుడిగా దండవేన రమేష్, రాజయ్య, సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా మంద మొగిలి, క్యాతం రమేష్, అశోక్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యాతం సదయ్య, పున్నం రవి, బొజ్జం రవి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. మండలంలో. పలు గ్రామాలకు చెందిన. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు రెండో విడత కింద 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దసరా దీపావళి పండుగలకు నూతన గృహప్రవేశం జరుపుకోవాలని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలంలో ప్రజలకు రెండో విడత ఇండ్ల మంజూరు జారీచేశామని పెట్టుబడి లేని నిరుపేదలకు స్వయం మహిళ సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేశామని. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. లబ్ధిదారులు విడుదల విధిగా నిర్మించుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు…

* ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా…

*మొలకలు వస్తున్న ధాన్యం…

*పట్టించుకోని సొసైటీ పాలకవర్గం,
అధికార యంత్రాంగం…

*ధర్నా చేయుచున్న పైతర గ్రామ రైతులు…

కొల్చారం( మెదక్ )నేటి ధాత్రి:

రైతన్నలు కష్టపడి ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. ధాన్యం తూకం కొనుగోలు కాకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్న కూడా ఇటు సొసైటీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకోకపోవడంతో పండించిన ధాన్యం.

cheating farmers

మొలకలు రావడంతో చివరికి మాకు పురులమందే దిక్క అంటూ కొల్చారం మండలంలోని పైతర గ్రామ రైతులు మెదక్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మొలకలు వచ్చిన ధాన్యమును చూపిస్తూ రైతులు ధర్నా చేయుచున్నారు ఒకవైపు తూకం వేసిన ధాన్యము లారీలు రాకపోవడంతో సొసైటీ పాలకవర్గం నురైతులు అడుగుచుండగా లారీలు వస్తలేవు మేమేం చేయాలి అని పాలకవర్గం తప్పించుకుంటున్నారు మా రైతుల గోడును అధికార యంత్రాంగం అర్థం.

cheating farmers

చేసుకొని మేము పండించిన ధాన్యమును కొనుగోలు చేసి లారీలు పంపించి తూకం వేసిన ధాన్యమును రైస్ మిల్లర్లకు చేరవేయాలని పైతర గ్రామ రైతులు రోడ్డుపైన మొలకలు వచ్చిన ధాన్యము చూపిస్తూ అధికారులను వేడుకొనుచున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా చేశారని,దానివల్ల ఎంతో మానసిక వేదనకు గురయ్యానని,తన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కృంగిపోతున్నారని అన్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని,విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేశానని,నేను తప్పు చేసినట్లు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరూపిస్తే నేను అధికారులు చేపట్టే చర్యలకు సహకరిస్తానని అన్నారు.కానీ ఇలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు.

జైపూర్ ఆర్ఐ పై వచ్చిన వార్తకి స్పందించిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్ ఆర్ఐ తిరుపతి పై వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని తహసిల్దార్ వనజా రెడ్డి తన కార్యాలయంలో బుధవారం తెలియజేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మా పరిధిలో ఉంటే తప్పకుండా వెంటనే స్పందిస్తామని,సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే తమ పై అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చునని,అందులో నిజం ఉంటే అధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతారని తెలిపారు.తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ తో పాటు మిగతా అధికారులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నామని,ప్రజా సమస్యలను తీర్చడంలో ఒక అడుగు ముందే ఉన్నామని తెలియజేశారు.ఇలా సోషల్ మీడియా ద్వారా అధికారులను అపరాదులుగా చూపిస్తూ,అసత్య ఆరోపణలు,ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన వారిపై తప్పకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు.

‘ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు’

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆరు మండలాల పాత్రికేయ బృందం 100 వాహనాలతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం త్రివేణి సంగమం శ్రీ సరస్వతి నదిలో స్థానం ఆచరించి.. శ్రీ ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భావాలతో దైవారాధన చేయాలన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని, ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత, ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ, గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది. పలువురు నాయకులు రాజీవ్ జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల,నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు.

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బస్వ రాజుపల్లి గ్రామానికి చెందిన కుక్క ముడి పోచమ్మ పోశయ్య కుమారుడు కుక్క ముడి సంపత్ వైద్య రీత్యా కొత్తగూడెం లో నివసిస్తున్నారు ఈయన గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి కుక్కమూడి సంపత్ ను రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక రాజు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు కు సుపరిచితులుగా ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తూ పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు డయాబెటిస్ రోగులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఏర్పాటు చేస్తున్నారు సంపత్ కు ఈ అవార్డు దక్కడం పట్ల బస్వ రాజు పల్లి కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు దక్కిన పురస్కారం గా అభివర్ణించారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని కోరుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version