నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు

టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు,ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి నీలగిరి వనాలను రక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్,వాచర్లుమొండి,సత్తయ్య,రవి సిబ్బంది షాహిద్,సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version