కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు….

 

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు

◆”-: ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్

◆”-: మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడం పట్ల ఝరాసంగం మండల్ మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో పోలీసులు సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ చర్యల వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, నిమ్జ్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఈ విధమైన రద్దీ నెలకొంటే, పనులు ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు మరింత పెరిగి ప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారంగా ఆ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని జగదీశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version