అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మచ్నూర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది,
