జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

◆-: పట్టణంలో రహదారుల విస్తూర్ణం మారబోతున్న జహీరాబాద్ రూపురేఖలు

 

మాస్టర్లోన్తో మారనున్న పట్టణ రూపురేఖలు అమృత్ 2.0 నిధులతో రోడ్లు, నాలాల విస్తరణకు కార్యాచరణ మున్సిపల్ యంత్రాంగం సిద్ధం.. ఈ ఏడాది పూర్తిచేయాలని లక్ష్యం

జహీరాబాద్, నేటి ధాత్రి:

ఏడు దశాబ్దాల చరిత్ర కలి గిన జహీరాబాద్ పట్టణం అన్ని రంగాల్లో విస్తరిస్తున్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. పట్టణం 12 వార్డుల నుంచి 37 వార్డులకు చేరు కుని, 21.13 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినా, దశాబ్దాల క్రితం నాటి ఇరుకైన రోడ్లే ఉండటంతో నేటికీ ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కార ణంగా మారుతున్నాయి. ఏ రోడ్డు చూసినా ఇరుకుగా ఉండటం, నిర్మాణాలు, సెబ్బ్యాక్ లు లేని రోడ్లపైనే పార్కింగ్లు.. వెరసి వాహనదారులకు, స్థానికులకు నిత్యం నరకప్రాయంగా మారింది. అయితే, తాజాగా అమృత్ 2.0 పథకం జహీరాబాద్ అభివృద్ధికి కొత్త ఆశలను చిగు రింపజేస్తోంది.

అమృత్ 2.0తో అభివృద్ధి వేగం

పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2021 లోనే అమృత్ 20 పథకం కింద రూ.18 కోట్ల నిధు లను మంజూరు చేసింది. పలు కారణాల వల్ల

ప్రజల సహకారం అవసరం

జహీరాబాద్ అభివృద్ధికి మాస్టర్న్ అత్య వసరం. ఇది పూర్తిస్థాయిలో అమలైతే జహీరా బాద్ రూపురేఖలు మారి అద్భుతంగా అభి వృద్ధి చెందుతుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలను చెల్లించి ప్రజలు అభివృద్ధికి సహకరించాలి.

– జైత్రం నాయక్, మున్సిపల్ కమిషనర్-జహీరాబాద్

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం

ఆలస్యమైనా 2023 నుంచి అధికారులు ఈ ప్రాజెక్టును వేగవంతం చేశారు. ఈ పథకం ద్వారా రోడ్ల వెడల్పు, మాస్టర్న్ అమలు, మంచి నీటి సర ఫరా, అండర్ గ్రౌండ్ డైక్రేజీ వ్యవస్థ, ప్రభుత్వ భూముల్లో కార్యాలయాల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి 2026 మార్చి గడువుగా ఉంది. దీని కోసం మొత్తం 24 శాఖల నుంచి సమాచారం సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 13 శాఖల నుంచి డేటాను అధికారులు సేకరించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ, కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో పక్కాగా అమలు చేయా లని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేనిపక్షంలో యంత్రాంగమే కూల్చివేతలకు సిద్ధమని అధికా రులు హెచ్చరిస్తున్నారు. మాస్టర్హౌన్ పూర్తిగా అమలయితే జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తా మని పేర్కొంటున్నారు.

ప్రాధాన్యత క్రమంలో రోడ్ల విస్తరణ

పట్టణంలో ఉన్న 15 ఇరుకైన రోడ్లను అధికా రులు గుర్తించగా, ఇందులో ఐదు రోడ్లను

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version