రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి..

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు నడపాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నిదానంగా ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు సిగ్నల్‌ను అతిక్రమించవొద్దన్నారు. రోడ్డుపై పార్కింగ్‌ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌ మా ట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ పత్రాలు, లైసెన్సులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డైవర్లు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల కు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై దీకొండ రమేష్..

ఆటో డ్రైవర్ల కు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని తగ్గించడంలో వాహనదారుల పాత్ర కీలకమన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, ఓవర్‌లోడింగ్ చేయరాదని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పారు.అలాగే వేగ నియంత్రణ, సిగ్నల్ నియమాల పాటింపు వంటి అంశాలపై విపులంగా వివరించారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ సంఘ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన జాతీయ రహదారి మాసోత్సవం

ఘనంగా జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు

జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని

భూపాలపల్లి నేటిధాత్రి

మహదేవపూర్ మండలంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఎస్పీ నరేష్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
విద్యార్థులు రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి సమాజంలో అవగాహన పెంచే బాధ్యత తీసుకుని రహదారి ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, ఐఎంవిఐలు సుందర్ లాల్, శ్రీనివాస్, ఐరాడ్ డిపిఎం లక్ష్మణ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఓదెలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు…

ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాశీనాథ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుల ఘనంగా నిర్వహించారు.జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల ముగ్గులు వేసి పోలీస్ స్టేషన్లో ప్రాంగణం అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ ఆయన మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటు పాలు కార్యక్రమాలు

నిర్వహించారు సంక్రాంతి పండుగ మహిళా పోలీసులకు మరియు ప్రజలకు పోలీసు అధికారులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముగ్గులలో సైబర్ క్రైమ్ అవగాహన చైనా మాంజా మద్యం సేకరించి వహానము నడపరాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సేఫ్టీ హెల్మెట్ అవగాహన హోదా చిన్నదైనా బాధ్యతలు వహించాలి ఈ ముగ్గులలో మరిన్ని అవగాహనలు ఉన్నాయి ప్రజలు ఈ అవగాహన దృష్టిలో పెట్టుకొని పాటించగలరన్నారు,

రోడ్డు సేఫ్టీ వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్

సేఫ్టీ వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామంలో జరిగిన రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో స్థానిక ఎస్సై క్రాంతి పటేల్ మరియు గ్రామ సర్పంచ్ వినోద బాలరాజు పాల్గొని గ్రామ ప్రజలను మరియు ఆటోడ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.సర్పంచ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు వారోత్సవాలు భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ఆక్సిడెంట్లను నివారించాలని వారు వారి వారి కుటుంబాల్లో ఆనందం ఉండాలంటే యాక్సిడెంట్లు జరగకూడదని సభను ద్వేషించి గ్రామ సర్పంచ్ వినోద బాలరాజు గారు మాట్లాడడం జరిగింది.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రోడ్డు భద్రతా మాసంలో భాగంగా, కోహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ( జడ్. పి. హెచ్. ఎస్ ) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమాద కారణాలు, ముఖ్యమైన రోడ్డు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతలను జహీరాబాద్ మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య గారు, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన తుడా చైర్మన్…

*గరుడ టూ వీలర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన….

+తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి గరుడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల విన్నపం మేరకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో బాలాజీ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ”* ని ఆయన పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ ఒక కవచంలా పనిచేస్తుందని, కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గరుడ టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా,ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలోని ప్రధాన కూడళ్లలో గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది,మెకానిక్ సోదరులు హెల్మెట్లు ధరించి, భద్రతా నిబంధనలపై ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
అంతకముందు బాలాజీ కాలనీ కూడలి వద్దకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులు దుశ్శలావతో సత్కరించి, క్యాలెండర్ ప్రతిని అందించారు. ​
ఈ కార్యక్రమంలో గరుడ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పోలీస్ అధికారులు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version