ఈదులపల్లి గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T134452.550.wav?_=1

 

ఈదులపల్లి గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈదులపల్లి గ్రామంలో ప్రజలు నాకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే కుల మాతలకు అతీతంగా పాలన అందిస్తానని, అభివృద్ధి తమ అభిమతం అని, కొందరు స్వార్ధం కోసం అవకాశావద రాజకీయాలు చేస్తున్నారని ఈదులపల్లి గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్ అన్నారు. మంగళవారం నాడు ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్ ఒక్కసారి అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలు నాకు అధికారం కట్టబెడితే గ్రామంలో పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యం అన్నారు. గ్రామ అభివృద్ధికి గతంలో అందరి సహకారంతో తోడ్పాటు అందించానని, తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాన్ని పట్టణన్ని తలపించేలా అభివృద్ధి చేసి చూపిస్తానని, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఈదులపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో నిలబెడతామాని, గ్రామంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్దిదారులకు అందించే బాధ్యత తమదే అని,కావున గ్రామ ప్రజలు కులమతలకు అతీతంగా తమకు ఓటు వేసి గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ఎన్నికలలో మద్యం అక్రమ రవాణా అడ్డుకోవాలి: డీఐజీ ఆదేశాలు”

సర్పంచ్ ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి డి ఐ జి ఆదేశాలు

వనపర్తి: నేటిదాత్రి .

 

సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లాఎస్పీ, ఏ ఆర్ అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లలతో జోగులంబ జోన్ డిఐజి కార్యాలయంలో డీఐజీ *ఎల్ఎస్, చౌహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తి
జిల్లాలో మద్యం అక్రమ రవాణా జరగకుండా పోలీస్ చెక్ పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల ధైర్యం నింపాలన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల నమ్మక పెంచాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ చేయాలన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి, మద్యం అక్రమ రవాణాలను గ్రామల సర్పంచ్ ఎన్నికలలో ఇబ్బందులు కలిగించే వారిని బైండోవర్ చేసి కట్టడం చేయాలన్నారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని,అన్నారు
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ, సునిత రెడ్డి,, ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిఎస్పి, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్ వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరుసీఐ, శివకుమార్ పోలీసు అధికారులు సిఐలు పాల్గొన్నారు.

ప్రచారాలకు అనుమతి తప్పునిసరి…

ప్రచారాలకు అనుమతి తప్పునిసరి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలకు అనుమతి పొందాలని తాహాసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. అభ్యర్థులు తప్పకుండా ప్రచారాలకు అనుమతి పొందాలని, శాంతిభద్రతలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఓసి తీసుకోవాలని తాహాసిల్దార్ శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవిత మల్లేష్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T114055.939.wav?_=2

 

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవిత మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

మారపల్లి కవిత మల్లేష్ సోమనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సోమనపల్లి సర్పంచి ఎస్సీ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మారపల్లి కవిత మల్లేష్ అంకుశాపురం గ్రామపంచాయతీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమనపల్లి గ్రామ ప్రజల అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తాను కావున ప్రజలు నాకు అవకాశం ఒకసారి ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని సోమనపల్లి గ్రామ ప్రజలకు కు విజ్ఞప్తి చేస్తున్న కష్టపడి పనిచేసే నాయకుడిని కావున గత 20 సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుని కావున ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది నన్ను ఆశీర్వదించి సర్పంచిగా ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ అభ్యర్థులు నాయకులు పాల్గొన్నారు

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిగ్రామంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో. లక్ష్మి రాజo.ఈ సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి.ఎంపీడీవో మండలంలో పలు గ్రామాల్లో రెండో విడత జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఏమైనా అడపా దడపసంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పరిశీలిస్తున్నార.అని తెలుసుకుంటూ నామినేషన్ల పక్రియలోఎటువంటిచెదురు మధురుసంఘటనలు జరగకుండా పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కొనసాగించాలని నామినేషన్ల ప్రక్రియ పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేస్తూ ఏదైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామినేషన్.పక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని సంబంధిత.అధికారులను ఆదేశించారు

మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం…

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు
ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు…
కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.
పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు

సర్పంచ్‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్​అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.

 

పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.

 

మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..

 

శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?

 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

 

అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.

 

ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

డిపాజిట్ తప్పనిసరి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్‌ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్​) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్​చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్​అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్​ బిల్లులు కూడా క్లియర్​ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్..

 

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్‌ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.

లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్..

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్​’ జాబితాను తెలంగాణ గెజిట్‌లో ఎస్‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్‌ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

శనివారం కలెక్టర్ కార్యల్యములో పి ఒ, ఏ పీ ఓ లకు అక్టోబర్ 6న ఒకరోజు శిక్షణ కార్యక్రమం పై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు గదులు మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారుఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓ లకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు

సర్పంచ్ ఎన్నికలపై బకాయిల ఎఫెక్ట్..! పోటీ చేసేందుకు ఆసక్తి చూపని నేతలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-04T114543.514.wav?_=3

 

సర్పంచ్ ఎన్నికలపై బకాయిల ఎఫెక్ట్..! పోటీ చేసేందుకు ఆసక్తి చూపని నేతలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నెల 31వ తేదీ నుంచి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అయితే గత (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయనీయ పరిస్థితులను గమనించిన నాయకులు.. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు.

అప్పుల భారంతో..

సరిపడా నిధులు విడుదల చేయకుండానే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట గ్రామాల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పార్కులు, రోడ్లు, మొక్కల పెంపకం, ట్రాక్టర్ల కొనుగోలు వంటి పనులు చేపట్టింది. పనులు చేయకుంటే సస్పెండ్ చేస్తామని బెదిరించడంతో.. అప్పటి సర్పంచులు అప్పులు చేసి మరి పనులు చేపట్టారు. ఆ తర్వాత బిల్లులు కోసం ఏండ్ల తరబడి ఎదురుచూశారు. బిల్లులు రాక విసిగి వేసారిపోయారు. అప్పులు తీర్చలేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.

బుజ్జగిస్తున్న పార్టీలు

సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కాగా, చాలా చోట్ల బరిలో దిగేందుకు నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తాము ఎన్నికల్లో ఖర్చు చేయడం, ఆ
తర్వాత అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించి, అవి విడుదల కాకుండా ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో
పోటీ చేయాలంటే పార్టీనే మొత్తం ఖర్చు పెట్టుకోవాలంటూ.షరతు విధిస్తున్నట్లు తెలిసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ముఖ్య
నాయకులకు ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. పోటీ చేయగలిగిన వారిని ముఖ్య నేతలు పిలిపించి మాట్లాడగా.. తాము విధించే షరతులకు ఒప్పుకోవాలని వారు చెప్పినట్లు
తెలిసింది. దీంతో బుజ్జగించి, ఒప్పించి, మెప్పించి పోటీలో ఉండే విధంగా చేసినట్లు సమాచారం. గత అనుభవాలు తమ కండ్ల ముందు కదలాడుతుంటే.. ప్రత్యేకంగా తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉంటుందని గ్రామాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, ఇంకా ఎన్నికల్లో నిలబడితే అప్పుల పాలు కావడం తప్ప మరొకటి ఉండదని అంటున్నారు. దీంతో
ముఖ్య నాయకులకు ఏం చేయాలో పాలు పోవడంలేదని.సమాచారం. చివరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న
వారిని బుజ్జగించి, వారికి భరోసా కల్పించి ఎన్నికల్లో నిలబడేలా చేస్తున్నారని సమాచారం.

ఆశావహులకు పండుగల ఎఫెక్ట్

రిజర్వేషన్లు ఖరారు కావడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఆశావహులపై పండుగల ఎఫెక్ట్ పడుతుందని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరాకు ఖర్చు భారీగానే ఉంటుంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఆశావాహులు మటన్, చికెన్, మద్యం బాటిళ్లతో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎవరికి తోచిన స్థాయిలో వారు, తమకు నమ్మకమున్న, తనతో పాటు తిరిగే, పార్టీ ముఖ్య నేతలను సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు ఖర్చు పెట్టడంలో ముందున్నారనే చర్చ జరుగుతున్నది.

విజయదశమి శుభాకాంక్షలు తెలిపినబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు.

విజయదశమి శుభాకాంక్షలు తెలిపినబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

మొగుళ్ళపల్లి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు మొగుళ్లపల్లి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు దసరా పండగను కుటుంబ సభ్యుల తో కలసి సంతోషంగా జరుపుకోవాలని విజయ దుర్గా దేవిని కోరుకుంటున్నాను అని అన్నారు మొగుళ్లపల్లి మండల ప్రజలకు స్థానిక ఎలక్షన్ రావడం జరిగింది ప్రజలందరూ వారి గ్రామాఅందరిపైలలో సర్పంచ్లను ఎంపీటీసీలను గెలిపించాలని కోరారు దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తెలంగాణలో ఎన్నికలు జరిగినా తమ పార్టీ విజయం సాధిస్తుందని మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు దీమ వ్యక్తిగతం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆ మోసాన్ని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి…

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 23 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) సన్నద్దత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ..ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ఎస్.ఐ.ఆర్ సన్నద్దత రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితా, 2002 ఎస్.ఐ.ఆర్ లో ఉన్న ఓటర్ల కామన్ డెటాతో కెటగిరి ఏ, 2002 ఎస్.ఐ.ఆర్ లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరి బి, పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించి బూత్ స్థాయి అధికారులు రిపోర్టును సెప్టెంబర్ 23 లోపు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ రెవిన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు రాధాబాయి అన్ని మండలాల తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version