స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

శనివారం కలెక్టర్ కార్యల్యములో పి ఒ, ఏ పీ ఓ లకు అక్టోబర్ 6న ఒకరోజు శిక్షణ కార్యక్రమం పై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు గదులు మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారుఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓ లకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు శిక్షణ…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు శిక్షణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పిఓలు, ఏపీవోలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వం సన్నదంగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా న నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆర్ ఓ, ఏఆర్వోలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరో విడత రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిర్వహించిన శిక్షణపై ఎన్నికల సంగం సూచనలు మేరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలు ఉంటాయని పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని, ఏదేని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, సిపిఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీవో నాగరాజు, ఆర్వోలు, ఏ ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version