యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు. సృజనాత్మకత. న్యాయకత్వ. లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికి తీసే కార్యక్రమం ద్వారా. అగ్రి యూత్ ఫెస్ట్. (యువజన ఉత్సవాలు) ఈనెల .18.వ తేదీ నుండి .21.వ. తేదీ వరకు మూడు రోజులపాటు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన. వారిని. గ్రీన్ ఎక్స్కో. స్టోరీ టెల్లింగ్. జానపద గీతాలు. ఒగ్గు కథ. డ్యాన్స్. బీట్ లైవ్ పోటీలలో. ప్రథమ స్థానంలో. నిలవగా. ఉపన్యాసం వ్యాసరచన. దేశభక్తి గీతరచన. స్పెల్ బి. ఏకో రంగోలి. లవ్ పెయింటింగ్ పోటీలలో. ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద .నృత ప్రదర్శనలో. తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు సృజనాత్మకతకు. ఈ యువజన ఉత్సవాలలో. ఓవరాల్ ఛాంపియన్షిప్ లను. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలు సొంతం చేసుకుంది. వీటిని.PJTAU. యువజన ఉత్సవాలలో.BJR. అగ్రికల్చర్ కాలేజీ .ఓవరా ల్. ఛాంపియన్షిప్ గా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ . డా. కె. బి. శ్వేతా దేవి. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు.ఇటువంటి కార్యక్రమాలు. నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తమ కళాశాలకు మంచి పేరు తీసుకోవడానికి కృషిచేసిన విద్యార్థులకు బోధన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మహిళలని కళాకారులుగా తీర్చి దిద్దడం హర్షనీయం..

మహిళలని కళాకారులుగా తీర్చి దిద్దడం హర్షనీయం..

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం పట్టణంలో మహిళలకు గత 37 సంవత్సరాలుగా ముగ్గుల పోటీ నిర్వహిస్తూ మహిళ లను కళాకారులు గా తీర్చిదిద్దడం హర్షనీయమ ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నటరాజ్ కళానికేతన్ కేసముద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతి ప్రధానో త్సవము కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవితంలో ఎన్ని వడు దోడుకులు ఎదురైనప్పటికీ నీతి నిజా యితీలను వదిలిపెట్టకుం డా జీవిస్తున్నానన్నారు. మీరు కూడా అలాగే సమస్యలకు భయపడకుం డా కష్టాన్ని నమ్ముకుని జీవించాలని అన్నారు. కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు మాట్లాడు తూ మహిళలలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు దోహదపడతా యని అన్నారు. మహబూబాబాద్ జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ మనం మార్కెట్లో వస్తువు కొనేటప్పుడు మోసపో కూడదన్నారు. ప్రతి డబ్బాపై ఉండే ఎమ్మార్పీ తదితర అంశాలు పరిశీలించాలన్నారు.
అనంతరం ముఖ్య అతిధులు గుమ్మడి నరసయ్య,డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు, మైస శ్రీనివాసులు చేతుల మీదుగా ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో నటరాజ కళానికేతన్ అధ్యక్షులు చీకటి వెంకట్రాo నరసయ్య, ఉపాధ్యక్షులు నాగనబోయిన వెంకటేశ్వర్లు,కోశాధికారి కుర్న హరినాథ్,వేల్పుల రేవంత్, రేణిగుంట సుధాకర్, శీలం సత్యనారా యణ,జక్కుల కృష్ణమూర్తి, గొల్లపల్లి రాజేష్, మహమ్మద్ రఫీ, కందుకూరి రవీంద్ర చారి తదితరులు పాల్గొనగా సమన్వయకర్తగా నల్ల కిరణ్ కుమార్ వ్యవహ రించారు.

ముగ్గుల పోటీ బహుమతి విజేతలు వీరే…

పెద్ద బజార్: ప్రధమ బహుమతి నాగనబోయిన సృష్టి యాదవ్, ద్వితీయ బహుమతి కస్తూరి శివాని, తృతీయ బహుమతి భూక్య అనూష.
మార్కెట్ బజార్: ప్రధమ బహుమతి శివరాత్రి శ్రీలక్ష్మి, ద్వితీయ బహుమతి రామగిరి భాగ్యలక్ష్మి, తృతీయ బహుమతి అర్వపల్లి జయశ్రీ.
కిష్టాపురం: ప్రధమ బహుమతి మామిడి శెట్టి సౌజన్య, ద్వితీయ బహుమతి వేల్పుల తేజశ్రీ, తృతీయ బహుమతి ఆగే రమ్య.లక్ష్మీ నగర్: ప్రథమ బహుమతి పిడుగు అఖిల, ద్వితీయ బహుమతి సింగంశెట్టి ప్రియాంక, తృతీయ బహుమతి రేణిగుంట్ల హరిణి గెలుపొందగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో బహుమతులు అందజేసిన సర్పంచ్

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో బహుమతులు ఇచ్చిన సర్పంచ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ ఉప సర్పంచ్ కానిపర్తి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని అప్పయ్య పల్లె గ్రామ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంతో పోటీపడి ముగ్గులు వేసిన అక్క చెల్లెళ్లకు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సర్పంచ్ తెలిపారు వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ముగ్గుల పోటీలు జరుపుకుంటున్నాము ఈ సంక్రాంతి ముగ్గులు వేసినటువంటి ఆడపడుచులకు బహుమతులు గ్రామ పెద్దల ముందు పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 1516 రూ కాసర్ల మేనక రెండో బహుమతి ఎలుక పెళ్లి కళ్యాణి మూడో బహుమతి తొట్ల అఖిల సర్పంచి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొడారి రవీందర్ పిఎసిఎస్సి మాజీచైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు మార్నేని ఉపేందర్ రావు ఐలోని రామచందర్ రెడ్డి ఓం బోల్లెండ్ల ప్రభాకర్ రెడ్డి దోమల రాజయ్య దోమల రవీందర్ మారేపల్లి మహేందర్ రెడ్డి కొత్తగట్టు రమేష్ ఇనుగాల మొగిలి వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పాల్గొన్నారు

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అదేవిదంగా వేశాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకెట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంక్ ఏర్పాటు చేయగా నల్లా తిప్పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన ఇప్పకాయల మనస్విని మొదటి బహుమతి రూ. 5016,పొట్ల రజని ద్వితీయ బహుమతి రూ. 3016/-,నల్ల మౌనిక తృతీయ బహుమతి రూ. 2016/- లను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజలందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.
ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఇదే స్పూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు.
మన ప్రతిభను,మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఈ రోజు ముగ్గుల పోటీల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు, ఐదో తరగతి చిన్నారులు, డిగ్రీ చదువుతున్న యువతులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ తరం ఆ తరం మధ్య ఏర్పడిన ఈ కలయిక మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

వైభవంగా ముగ్గుల రంగవల్లి పోటీలు

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల రంగవల్లి పోటీలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దంపతులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి పండుగ వెనుక గొప్ప పరిమార్తం ఉందని సంక్రాంతి రైతుల పండుగని నాగర్ కర్నూల్ నియోజవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగవల్లిలో ప్రతిభ చూపిన మహిళలకు అభినందనలు తెలిపారు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ముగ్గుల పోటీల్లో మహిళల సృజనాత్మకత

ముగ్గులు వేయడం మహిళల సృజనాత్మకతకు నిదర్శనం

విజేతలకు బహుమతులు అందజేసేన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. మకర
సంక్రాంతి సందర్భంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ,వీరా రెడ్డి, వనపర్తి డి ఎస్పీ, వెంకటేశ్వరావు, డిసిఆర్బి డిఎస్పి,బాలాజీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు

సంక్రాంతి ముగ్గుల పోటీల ప్రారంబించిన దోసకాయల…

సంక్రాంతి ముగ్గుల పోటీల ప్రారంబించిన దోసకాయల

మేడ్చల్, నేటిధాత్రి :

 

 

 

సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ముగ్గుల పోటీల ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. ముడుచింతల పల్లి పరిధిలోని పొన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఏఎంసి చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి మెంబర్ గోగుల సరిత లతో కలసి దోసకాయల వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంప్రదాయ పండుగలుగా సంక్రాతి పండగా సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు వేదికగా నిలుస్తాయని అభినందించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి మెడబోయిన జ్యోతి రూ. 10000, రెండవ బహుమతి జజల పూర్ణిమ రూ. 6000, మూడవ బహుమతి మర్యాల బాల లక్ష్మీ రూ 3000, నాల్గవ బహుమతి రూ.2500 జి. శ్రీవాణి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లతరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తూ. శుభోదయం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరగగా దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్. తమిళనాడు. తెలంగాణలో. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవడం. జరుగుతుందని .ముందుగా భోగి పండుగ రోజున ప్రతి మనిషి. తలంటు స్నానం చేయాలని చిన్నపిల్లలకు భోగి పండ్లతో.స్నానం చేయించాలని కుటుంబానికి పట్టిన నరదృష్టి తీసివేయడానికి భోగి మంటలు మండించాలని ఇంటిముందు మధ్యలో రంగులు వేసి మధ్యలోభోగి పండ్లను గొబ్బెమ్మలను పెట్టాలని దానివలన గోవు ప్రత్యేకత తెలుపుతుందని భోగి మంటలు కాలిన తర్వాత బూడిదను చిన్న పిల్లలకు బొట్టు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మాట్లాడుతూ ముందస్తుగా ఇట్టి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మమ్మల్ని సిబ్బందిని పిలవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పండగలను పిల్లల మధ్య జరపకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెబుతూ రెండవ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం దాంట్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మూలంగా పండగ జరుపుకోవడం జరుగుతుందని శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం మూలంగా మంచి ఫలితం వస్తుందని చరిత్ర చెబుతుందని పితృదేవతలకు సంబంధించిన శ్లోకం చదివినట్లయితే పితృ దేవతలకు సంబంధించిన పండుగలు ఒకటి దీపావళి రెండవది దసరా మూడవది అమావాస్య పే త్రమాస్య ఈరోజుల్లో పితృదేవతలను పూజించినట్లయితే కుటుంబానికి అనుగ్రహం వలన మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతూ ఇలాంటి సంక్రాంతి సంబరాలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రంగోలి కార్యక్రమంలో బహుమతులు మా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మూడవరోజు అయినటువంటి కనుమ రోజున గోవులను సంరక్షించడం జరుగుతుంది ఆరోజు గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమ లాంటివి శరీరానికి రాసి వాటికి కొత్త దుస్తులు కప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న పేర్లు పెట్టి వాటిని పిలవడం జరుగుతుంది దేశాన్ని సైనికులు ఏ విధంగా రక్షిస్తారో మనము కూడా రైతుల రక్షించుకునే బాధ్యత అందరి పైన ఉంది ఎందుకనగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు మనందరికీ అన్నం పెట్టలేకపోవడం జరుగుతుందని అప్పుడు పెద్ద ప్రళయం వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆలోచించి మనము వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా పాఠశాల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అది కూడా పిల్లల మధ్యల దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక తంగళ్ళపల్లి మండల ఎస్సై ఉపేంద్ర చారి సిబ్బందితో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సంబరాల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి. ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ. పి ఈ టి అజయ్ కుమార్. కంప్యూటర్ శ్రీనివాస్. సిరిసిల్ల బ్రాంచ్ పాఠశాల ఇన్చార్జి లావణ్య. అకాడమిక్ ఇన్చార్జి సాయి ప్రియ . విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

నేతాజీ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ మరియు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను ఉత్సాహపరిచారు.

 

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం లో రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు.

ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

బోనాల రోజా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కలలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తున్నాను అన్నారు. అదేవిధంగా ఉమన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వకళాశాల లో ముందస్తు సంక్రాంతి వేడుకలు…

ప్రభుత్వకళాశాల లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేశారు అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటిల్లో పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కళాశాల ఆవరణలో తీరొక్క ముగ్గులు వేయాదంతో కళాశాలలో పండగ వాతావరణం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.సంపత్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎండీ సర్దార్,మహిళా అధ్యాపకులు,లత,రమాదేవి, భవాని,పద్మ,తిరుమల,జ్యోతి, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పాకాల మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీలు మ్యాక్స్ అధ్యక్షులు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విభిన్న రకాల ఆలోచనలతో మహిళలు తీర్చిదిద్దిన అందమైన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈసందర్భంగా పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని రాజేశ్వరి అన్నారు.100 మంది పైగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి బహుమతి తాటిపాముల నాగలక్ష్మి, రెండవ బహుమతి క్యాథమ్ స్రవంతి, మూడవ బహుమతి గుమ్మపెళ్లి శైలజ లకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మ్యాక్స్ కార్యదర్శి ఇమ్మడి పద్మ, దేవులపల్లి వాణి, గుడిశాల వనజ,బొమ్మగాని మంజుల, గొర్రె రాదా,కీసర,విజయ,ప్రసన్న,నల్ల భారతి,కుడిపూడి అరుణ,గుర్రపు అరుణ, పెండెం స్పందన,పాలడుగుల అనితతో పాటు మ

భారతీయ సాంప్రదాయం ముగ్గుఎంపీఓ _మార్గవి…

భారతీయ సాంప్రదాయం ముగ్గుఎంపీఓ _మార్గవి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడికూడ మండలం ఎంపీఓ మార్గవి విచ్చేసి మాట్లాడుతూ ముగ్గు అనేది ఇంటి వాకిలి ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం అని అన్నారు.ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే పిండితో ముగ్గులు వేస్తారనీ,ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారనీ,గచ్చులు వేసిన ఇంటి వెలుపలి,లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని,సుద్ధముక్కలను గాని తడిపి వేస్తారని అన్నారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింట్తో వేస్తున్నారని ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయని కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటున్నారని అన్నారు.

ప్రైవేటుకు దీటుగా చర్లపల్లి పాఠశాల

నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కున్సోత్ హనుమంతరావు,ఎంపీ ఓ మార్గవి విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో కూడిన క్యాలెండర్ ను ముద్రించడం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుందని నిదర్శనమని అన్నారు అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో లకవత్ దేవ,పుల్లూరి రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి నందిపాటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version