చనిపోయిన పాప కోసం కొవ్వొత్తులతో ర్యాలీ…

చనిపోయిన పాప కోసం కొవ్వొత్తులతో ర్యాలీ

గణపురం రజక కుల సంఘం నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులస్తురాలు చంద్రకళ కుటుంబం పై దాడి చేసి రెండు నెలల చంద్రకళ కుమార్తెను కాలుతో తన్ని పాప చనిపోవడానికి కారణమైన రెడ్డి కులానికి చెందిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తూ చనిపోయిన పాపకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన రజక కుల సంఘం నాయకులు.ఇలాంటి దాడులు మరి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణపురం రజక సహకార సంఘం నాయకులు వైనాల వెంకటేశ్వర్లు, పసునూటి వెంకన్న, ఎన్నిండ్ల సమ్మయ్య, వైనాల భాస్కర్, పసునూటి రాజు, నేరెళ్ల సారయ్య, సభ్యులు పసునూటి శంకర్, నేరెళ్ల శంకర్, ఎన్నిండ్ల శంకర్, పసునూటి రాజు,ఎన్నిండ్ల శ్రీకాంత్, వైనాల లింగయ్య, పసునూటి మొగిలి, పసునూటి సాయి తేజ, మామిడి అజయ్, కాశీ మల్లు, రాచర్ల శంకర్ పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి..

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మేర గ్రామంలో మూడు రోజుల కిందట 18 -2-26 తేదీన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రజక కుటుంబం ,స్వామివారి దర్శనం కోసం టికెట్టు లేకుండా గుడిలోకి ప్రవేశించారని,గ్రామ సర్పంచ్, మరియు ,అగ్రకుల పెత్తందారులు,రజకులను దుర్భాషలాడుతూ, విచక్షణ రహితంగా దాడి చేసి, అసభ్య పదజాలం తో దూషించి , రెండు నెలలు నిండిన పసిపాపన్ని నిర్దాక్షణంగా, కిరాతకంగా తన్ని, పాపని చంపడం దురహంకార చర్య అని, ఇంత దారుణానికి ఒడి కట్టిన అగ్రకుల పెత్తందారులకు అధికారులు, పోలీస్ లు సహకరిస్తూ, కొమ్ము కాస్తున్నారని,రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుండి దళితులు, బలహీన వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ కరువైందని,ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిందితులపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ,మాలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి

భూపాలపల్లి యాదవ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను చూడకుండా కఠినంగా శిక్షించాలి తన చావుకు కారణమైన అగ్రవర్ణ కుల అహంకారాన్ని యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే బిసి కులాలన్నీ ఐక్యంగా ఉద్యమాలు చేయాలని అందులో యాదవుల పాత్ర ముందు వరసలో ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పెంట సదానందం పోలవేణి అశోక్ యాదవ్ నలినీటి సతీష్ యాదవ్ మెరుగుల మహేందర్ యాదవ్ గారవేన సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…?

గణపురం నేటి ధాత్రి

 

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా, కమ్మెర గ్రామంలో రజక (చాకలి )కులస్తులు గుడిలోకి వచ్చారని రెడ్డి కులానికి చెందిన తుకారాం రెడ్డి తన అనుచరులు, రజకులను విచక్షణ రైతంగా కొట్టి రెండు నెలల పసికందును కాలితో తన్ని చంపిన విషయాన్ని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెడ్డి వెలమలకు ఓట్లు వేస్తే గుడికి వెళ్లిన బడికి వెళ్లిన అణగారిన వర్గాలకు చెందిన వారు చనిపోవాలా? ఇదేనా ప్రజా పాలన అంటే? రెడ్డి అగ్ర కులానికి చెందిన వీరిపై మర్డర్ కేస్ నమోదు చేయాలి .సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగం కల్పించిన సమన్యాయం కల్పించాలని పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అక్రమ కేసులపై తాహసిల్దార్ కి వినతిపత్రం…

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అక్రమ కేసులపై తాహసిల్దార్ కి వినతిపత్రం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉప్పల వెంకటేష్ పాపిశెట్టి రామకృష్ణ లపై పెట్టిన అక్రమ కేసులను బే షరతుగా వెంటనే ఎత్తివేయాలని కల్వకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ స్వచ్ఛందంగా వారి యొక్క వ్యాపార సముదాయాలను మూసివేసి బంద్ పాటించి స్థానిక వాసవి మాత దేవాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్యవైశ్య మహాసభ నాయకులు పట్టణంలోని ఆర్య వైశ్యులు అందరూ పాల్గొన్నారు.

కల్వకుర్తిలో ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

కల్వకుర్తిలో ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ అధినాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయమే బీ ఆర్ ఎస్ శ్రేణులు పాలమూరు చౌరస్తాలో గుమిగూడారు.. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, తెలంగాణ ఫుడ్ కమీషన్ చైర్మన్ గోలి శ్రీనివారెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మధ్యన కేక్ కట్ చేసి తమ బాస్ కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ, బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో లాంగ్ లీవ్..లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు..బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం… నిన్న ఆమనగల్ లో జరిగిన పరిణామం బీ ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ ను మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని రాజకీయాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ స్థానం గెలిచిన కాంగ్రెస్ లోపాయికార ఎత్తుగడలతో చైర్మన్ కుర్చీ దక్కించుకోవడం సిగ్గుచేటని.. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎక్కడలేని విధంగా కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోవడం ఇక్కడి నాయకులకే చెల్లిందని ఓటర్లు సిగ్గుపడుతున్నారని.. ప్రశ్నించిన మా పార్టీ నాయకుడు ఉప్పల వెంకటేష్ పైన.. బీఆర్ఎస్ కార్యకర్తలపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి.. కాంగ్రెస్..బీజేపీలు చేసినవి నీచ రాజకీయాలని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రోడ్డు వేశారు నీరు మరిచారు..

రోడ్డు వేశారు నీరు మరిచారు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ పక్కన ప్రధాన రహదారి నుండి మార్కెట్ రోడ్డు ప్రధాన రహదారి వరకు, గాంధీనగర్ లో కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు కానీ రోడ్లు వేసిన తర్వాత రోడ్డు బలంగా పటిష్టంగా కావడానికి కనీసం 10 నుంచి 15 రోజుల వరకు నీరు పట్టాలి కానీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఒక్కసారి మాత్రమే ఆ రోడ్డుకు నీరు పట్టారు సంబంధిత శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తి నట్టుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు చేపట్టి ఇలా గాలికి వదిలేస్తే ప్రజాధనం వృధా అవుతుంది అని రోడ్డు నిర్మాణాలు పటిష్టత కోల్పోయి త్వరగా రోడ్లు చెడిపోతాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాగర్ కర్నూలులో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం

235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకు ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవ తేజ నిర్మాణ సంస్థ యజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు
వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు పట్టణ మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు

16వ వార్డులో నూతన బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 16 వార్డులో నూతనంగా వేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి వార్డులో ప్రతిరోజు రెండు గంటలు పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కమిషనర్ ఏ ఈ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోచేరిన మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్
నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బి ఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరముల కాలంలోని దాదాపుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈరోజు మాజీ కౌన్సిలర్ మోతిలాల్ ఖాజా ఖాన్ ఇసాక్ తిరుమల యాదవ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బాదం రమేష్ ఇమ్రాన్ హరికృష్ణ రవీంద్ర చారి అనేకమంది నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు ఆహ్వానం

నాగర్ కర్నూల్ జిల్లా టౌన్
నేటి ధాత్రి

 

 

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎఫ్ బిఎఫ్ బాధిత కుటుంబానికి 20వేల రూపాయలు ప్రయోజనం అందించే పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని నాగర్ కర్నూల్ ఎమ్మార్వో గారు ఒక ప్రకటనలో తెలియజేశారు దానికి సర్కులేషన్ ఒకటి విడుదల చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version