ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అక్రమ కేసులపై తాహసిల్దార్ కి వినతిపత్రం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉప్పల వెంకటేష్ పాపిశెట్టి రామకృష్ణ లపై పెట్టిన అక్రమ కేసులను బే షరతుగా వెంటనే ఎత్తివేయాలని కల్వకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ స్వచ్ఛందంగా వారి యొక్క వ్యాపార సముదాయాలను మూసివేసి బంద్ పాటించి స్థానిక వాసవి మాత దేవాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్యవైశ్య మహాసభ నాయకులు పట్టణంలోని ఆర్య వైశ్యులు అందరూ పాల్గొన్నారు.
