చనిపోయిన పాప కోసం కొవ్వొత్తులతో ర్యాలీ
గణపురం రజక కుల సంఘం నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులస్తురాలు చంద్రకళ కుటుంబం పై దాడి చేసి రెండు నెలల చంద్రకళ కుమార్తెను కాలుతో తన్ని పాప చనిపోవడానికి కారణమైన రెడ్డి కులానికి చెందిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తూ చనిపోయిన పాపకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన రజక కుల సంఘం నాయకులు.ఇలాంటి దాడులు మరి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణపురం రజక సహకార సంఘం నాయకులు వైనాల వెంకటేశ్వర్లు, పసునూటి వెంకన్న, ఎన్నిండ్ల సమ్మయ్య, వైనాల భాస్కర్, పసునూటి రాజు, నేరెళ్ల సారయ్య, సభ్యులు పసునూటి శంకర్, నేరెళ్ల శంకర్, ఎన్నిండ్ల శంకర్, పసునూటి రాజు,ఎన్నిండ్ల శ్రీకాంత్, వైనాల లింగయ్య, పసునూటి మొగిలి, పసునూటి సాయి తేజ, మామిడి అజయ్, కాశీ మల్లు, రాచర్ల శంకర్ పాల్గొన్నారు.
