నిందితులను కఠినంగా శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మేర గ్రామంలో మూడు రోజుల కిందట 18 -2-26 తేదీన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రజక కుటుంబం ,స్వామివారి దర్శనం కోసం టికెట్టు లేకుండా గుడిలోకి ప్రవేశించారని,గ్రామ సర్పంచ్, మరియు ,అగ్రకుల పెత్తందారులు,రజకులను దుర్భాషలాడుతూ, విచక్షణ రహితంగా దాడి చేసి, అసభ్య పదజాలం తో దూషించి , రెండు నెలలు నిండిన పసిపాపన్ని నిర్దాక్షణంగా, కిరాతకంగా తన్ని, పాపని చంపడం దురహంకార చర్య అని, ఇంత దారుణానికి ఒడి కట్టిన అగ్రకుల పెత్తందారులకు అధికారులు, పోలీస్ లు సహకరిస్తూ, కొమ్ము కాస్తున్నారని,రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుండి దళితులు, బలహీన వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ కరువైందని,ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిందితులపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ,మాలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..
