బారాస కౌన్సిలర్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపు

బారాస కౌన్సిలర్ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపు…

బారాస నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గండమాల కృపానందం (గ్యాస్ నాని) ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి,బలవంతంగా విత్ డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా సమయం అయిపోయిన గంట తర్వాత తీసుకుని రావడంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులు సమయం దాటి పోయిందని అనుమతించలేదు. ఆ అభ్యర్థి కంట నీరు పెడుతూ గజగజ వనికి పోతుండగా గమనించిన బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇరు పార్టీల నాయకులు అభ్యర్థిని ఏం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ను మా పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని బెదిరించి ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా చేసుకోవాలని తీసుకురావడం ఏంటని నిలదీశారు. అప్పటికే అభ్యర్థిని దబాయిస్తూ నిన్ను మేము బెదిరించామా అంటూ అభ్యర్థిని గద్దించాడు.అభ్యర్థి గ్యాస్ నాని వనికిపోతూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. బారాస నాయకులు, అధికార పార్టీ నాయకులను అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై జె శ్రీధర్ గొడవ జరిగేలా ఉందని గమనించి అందర్ని కార్యాలయం బయటికి పంపించి వేశారు.

16వ వార్డులో నూతన బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 16 వార్డులో నూతనంగా వేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి వార్డులో ప్రతిరోజు రెండు గంటలు పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కమిషనర్ ఏ ఈ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version