రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…?

గణపురం నేటి ధాత్రి

 

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా, కమ్మెర గ్రామంలో రజక (చాకలి )కులస్తులు గుడిలోకి వచ్చారని రెడ్డి కులానికి చెందిన తుకారాం రెడ్డి తన అనుచరులు, రజకులను విచక్షణ రైతంగా కొట్టి రెండు నెలల పసికందును కాలితో తన్ని చంపిన విషయాన్ని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెడ్డి వెలమలకు ఓట్లు వేస్తే గుడికి వెళ్లిన బడికి వెళ్లిన అణగారిన వర్గాలకు చెందిన వారు చనిపోవాలా? ఇదేనా ప్రజా పాలన అంటే? రెడ్డి అగ్ర కులానికి చెందిన వీరిపై మర్డర్ కేస్ నమోదు చేయాలి .సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగం కల్పించిన సమన్యాయం కల్పించాలని పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version