రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి…

రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

సిపిఎం పార్టీకి కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో, రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని,నూతన అండర్ బ్రిడ్జి ప్రారంభించి పూర్తి చేయాలని, అంతవరకు ఉన్న పాత ఆర్ యు బి ని పునరుద్ధరించాలని,రెండవ ప్లాట్ ఫారం పై క్రికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వే పరిసర ప్రాంతాల్లో కోతులు కుక్కలను నివారించాలని, మంచినీళ్లు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని రైల్వే స్టేషన్ మాస్టర్ రతన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్షాల ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, సీనియర్ నాయకులు చాగంటి కిషన్, మోడెం వెంకటేశ్వర్లు,నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, అల్పుగొండ సావిత్ర, బండి దుర్గ ప్రసాద్, తులసిమొగ్గ వెంకన్న,చిక్కుడు కవిత,పొన్నాల ఉపేందర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు..

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు

మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,ఎస్టి కాలనీ, అంబేద్కర్ కాలనీలో బోర్వెల్ కు సంబంధించిన విద్యుత్ మోటర్లు చెడిపోయి నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను11 బోర్లు బిగించి నీటి కొరతను తీర్చారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న నేటి సమస్యలను తీర్చడంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముందుంటారని అన్నారు.ప్రభుత్వ నిధులతోనే కాకుండా తమ విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక బోర్ బావులు వేపించి ప్రజల కష్టాలు తీర్చారని తెలిపారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేరువ చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.అదేవిధంగా సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసిన మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డికి కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబల్ల రవి,మాజీ వార్డు సభ్యులు అరిగేల శ్రీనివాస్,ఇరిగిరాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version